స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర

COMMISSIONER OF COLLEGIATE EDUCATION మంగళగిరి వారి ఆదేశాల మేరకు ప్రతినెల మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందులో భాగంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 15.03.2025 శనివారం AVOID SUPs PROMOTE REUSABLES ప్రోత్సహించండి అనే అంశం పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ A.హనుమత్ ప్రసాద్ గారు ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వలన కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు తెలియజేశారు. తెలుగు అధ్యాపకురాలు డా. L. మృదుల గారు సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను ఉపయోగించకూడదని, RE USE PLASTIC పై విద్యార్థులకు అవగాహన కలిగించారు. PLASTIC ను ఉపయోగించడం పై కలుగుతున్న అనారోగ్యాలను గురించి తెలియజేశారు. అనంతరం NSS CO ORDINATOR T. జయకృష్ణ గారు ఒకరోజు మనం వినియోగిస్తున్న ప్లాస్టిక్ వస్తువుల వల్ల భూమిపై ఉన్న పొరలలోని చేరి అవి కరిగిపోకుండా అలాగే ఉండి ఎన్నో వ్యాధులకు లోనవ్వడానికి మూల కారణం అవుతుంది. కనుక మనము సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ ని ఉపయోగించ వద్దని తెలియజేశారు. తరువాత సాయంత్రం 5 గంటలకు కళాశాల మైదానంలో విద్యార్థులు అధ్యాపకులు అందరూ స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేశారు. తడి చెత్తను పొడి చెత్తను వేరుచేసి కళాశాల ఆవరణను శుభ్రపరిచారు. అనంతరం PLASTIC AVOID పై నినాదాలతో జిల్లెళ్ళమూడి గ్రామప్రజలకు అవగాహన కల్పించడానికి ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 72 మంది విద్యార్థినులు 20 మంది విద్యార్థులు 15 మంది అధ్యాపకులు పాల్గొన్నారు.