ది 07.04.2025 సోమవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి లో IQAC, Career guidance and placement cell ఆధ్వర్యంలో “CAREER OPPRTUNITIES AND STRATEGIES FOR UPSC AND COMPITATIVE EXAMS” అనే అంశంపై ప్రముఖ IAS OFFICER శ్రీ హెచ్.పీ. రాజు గారు మార్గదర్శనం చేశారు. కార్యక్రమంలో ముందుగా కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు సభను ప్రారంభించి విశిష్ట అతిథిని పరిచయం చేశారు. ధాత్రి ఫౌండేషన్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటయింది. College Management Committee సభ్యులు శ్రీమతి హైమ గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏర్పాట్లు చేశారు.
H. P. రాజు గారు ముఖ్యంగా All India Services గురించి వివరించి వాటి ప్రాధాన్యం మరియు సామాజిక బాధ్యతలపై వివరణాత్మకంగా మాట్లాడారు. తెలుగు, సంస్కృతం వంటి సాంప్రదాయ భాషలు చదివిన విద్యార్థులకు UPSC లో ఉన్న అవకాశాలను వివరించారు. అనంతరం విద్యార్థులతో జరిగిన Interaction session లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.
Management Committee సభ్యులు మాధవీలత గారు, విశిష్ట అతిథి చెప్పినట్లు కళాశాల విద్యార్థులను UPSC పరీక్షల వైపు ఆకర్షితులయ్యేలా అధ్యాపకులు(UPSC examination point of View) syllabus ను బోధించాలని, మరింత ప్రోత్సాహం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. కొంతమంది విద్యార్థులు ఈ యేడాది Preliminary Exam వ్రాయడానికి సుముఖత వ్యక్తం చేశారు.