అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ది 7.3.2025 శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభా కార్యక్రమం జరిగింది. ఈ సభకు కళాశాల వైస్ ప్రిన్సిపల్ Dr. L. మృదుల అధ్యక్షత వహించారు. మహిళా సాధికారతను గురించి వివరించారు. ముఖ్య అతిథిగా కళాశాల పూర్వ విద్యార్థి మరియు లాల్ బహదూర్ శాస్త్రి కేంద్రీయ విశ్వవిద్యాలయం Assistant professor Dr. B. కామాక్షమ్మ గారు ఆన్లైన్ లో స్టూడెంట్స్ కి వేదకాలం మరియు నేటి కాలం యొక్క మహిళల గురించి వివరించారు. తెలుగు అధ్యాపకులు వీరాంజనేయులు గారు మహిళలను గురించిన ప్రేరణదాయకమైన గీతాన్ని ఆలపించారు. కళాశాల ప్రాచార్యులు Dr అన్నదానం. హనుమత్ ప్రసాద్ గారు ఆయా యుగాలలో జన్మించిన మహిళా మణులను వారి గొప్పతనాన్ని కొనియాడారు. ఈ సభకు ఆత్మీయ అతిథి Dr. J. Gnana prasuna గారు గొప్ప గొప్ప మహిళల గురించి వివరించారు. మహిళా దినోత్సవ సందర్భముగా జరిపిన రంగవల్లుల పోటీలలో విజేతలైన విద్యార్థులకు, మహిళా అధ్యాపకులకు బహుమతి ప్రదానం జరిగింది.
సంస్కృత అధ్యాపకులు డా. R.వరప్రసాద్ గారి పర్యవేక్షణలో కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపక అధ్యాపకేతర మహిళామణులకు సన్మాన కార్యక్రమం జరిగింది, ఈ సభను ఆంగ్ల అధ్యాపకులు శ్రీమతి M. కవిత చక్కగా నిర్వహించారు, శాంతి మంత్రంతో సభ ముగిసింది.