10.02.2025 సోమవారం National Deworming Day సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల లో WOMEN EMPOWERMENT CELL తరపున Health Care Program జరిగింది. జిల్లెళ్ళమూడి గ్రామ ఆశావర్కర్ శ్రీలక్ష్మి మరియు నర్స్ మానసలు విద్యార్థులకు నులిపురుగు మందు పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ పోషకాహారాన్ని తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని, శారీరక మానసిక బలం చేకూరినప్పుడే విద్యలో గాని జీవితం లో గాని నాణ్యతను పెంపొందించుకోగలమని వివరించారు. డా. యల్. మృదుల మరియు అధ్యాపక బృందం విద్యార్థులను నులిపురుగు మందు పంపిణీ చేయడంలో సహకరించారు.