28-9-2024 న గుఱ్ఱం జాషువా జయంతి నవయుగ కవి చక్రవర్తి గుఱ్ఱంజాషువా జయంతి సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో గుఱ్ఱం జాషువా జయంతి సభ ఏర్పాటు చేయబడింది. కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ ఈ సభకు అధ్యక్షత వహించగా తెలుగు విభాగాధిపతి శ్రీమతి యల్ మృదుల సభా ప్రాతినిధ్యాన్ని వహించారు. తెలుగు అధ్యాపకులు శ్రీ టి. జయకృష్ణ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ సమకాలీన కవిత్వ ఒరవడియైన భావకవిత్వరీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసిన మహనీయుడు జాషువా అని ఆయన రచనలను, వైశిష్ట్యాన్ని, వారి కవితా మాధుర్యాన్ని చవిచూపారు. తెలుగు విభాగ అధ్యక్షురాలు డా. యల్. మృదుల మాట్లాడుతూ అవమానాలు పొందిన చోటే సత్కారాలను పొందిన జాషువా జీవితవిశేషాలను తెలియజేశారు. అనంతరం తెలుగు అధ్యాపకులు శ్రీ జి. వీరాంజనేయులు జాషువా రచనలలోని దేశభక్తి పాటతో విద్యార్థులలో చైతన్యాన్ని కలిగించారు. కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.