by admin | Nov 26, 2019 | Vanam - Manam
కార్తీక వనమహోత్సవము సందర్భంగా నవంబరు 26-11-2019న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. పరస్పర సహకారం, మైత్రీ భావములను పెంపొందించే విధంగా ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ. సుధామవంశీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంస్థ పెద్దలు అడవుల దీవి మధు అన్నయ్యగారు, వై.వి.శ్రీరామమూర్తిగారు, దేశిరాజు కామరాజు గారు, చక్కా శ్రీమన్నారాయణ గారు, ఎమ్. శరశ్చంద్రగారు, బూదరాజు శ్యామ్ దంపతులు, మన్నవ నరసింహారావు గారు పలువురు కళాశాలకు విచ్చేశారు. అమ్మ చిత్రపటానికి పుష్పాలు అలంకరించి, నమస్కృతులు సమర్పించారు. విద్యార్థులను నిరంతరం అధ్యయనం చేసి ఉత్తమ ఫలితాలను సాధించాలని పెద్దలు తెలియజేశారు. కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
by admin | Dec 6, 2018 | Vanam - Manam
కార్తీక వనమహోత్సవ సందర్భంగా డిసెంబరు 6వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.సుధామవంశి మాట్లాడుతూ భారతీయ సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతను వివరించారు. ఇలాంటి వేడుకల సంప్రదాయాల పరిరక్షణ పరస్పరం సహకారం, మైత్రీభావాలను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యల్.సుగుణ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సంస్థ పెద్దలు వల్లూరి రమేష్ తదితరులు తమ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ చిత్రపటానికి పుష్పాలంకారణ, శ్రీ దామోదర గణపతికి పుష్పమాలాంకరణ నిర్వహించి నమస్కృతులు సమర్పించారు. ఉత్తమ ఫలితాలు సాధించడం లక్ష్యంగా విద్యార్థులు నిరంతర అధ్యయనానికి పూనుకోవాలని హితవు పలికారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులు మాట్లాడుతూ అందరికీ తమ ధన్యవాదాలు తెలిపారు.
by admin | Dec 6, 2018 | Vanam - Manam
కార్తీక వనమహోత్సవం సందర్భంగా డిసెంబరు 6వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ ఎ. సుధాము వంశీ మాట్లాడుతూ భారతీయ సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతను వివరించారు. ఇలాంటి వేడుకలు సంప్రదాయ, పరస్పర సహకార, మైత్రి భావాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కళాశాల విశ్రాంతి ప్రిన్సిపాల్ డా. బి.ఎల్. సుగుణ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, సంస్థ పెద్దలు రమేష్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ చిత్రపటానికి పుష్పాలంకరణ చేసి సమస్కృతులు సమర్పించారు. ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. అనంతరం విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు
by admin | Jul 9, 2018 | Swachh Bharat
అజ్ఞానాన్ని పోగొట్టుకొని సుజ్ఞానం పొందాలంటే నిరంతర అధ్యయనం సాగించాలని ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛభారత్ ప్రత్యేకాధికారి శ్రీ పి.విద్యాసాగర్ వివరించారు. జులై, 9వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సాహితీ సదస్సులో ఆయన ప్రసంగం ఆద్యంతం హృద్యంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యల్. సుగుణగారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జీవితంలో అజ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం, సుజ్ఞానం అంచలంచెలుగా కొనసాగుతూ మానవుడు మహోన్నతుడు అవుతాడని వివరించారు. సుజ్ఞానం వలన మానవునికి బ్రహ్మానందస్థితి, ప్రజ్ఞ వలన ఆత్మానందం, విజ్ఞ వలన దివ్యానందం, ఆజ్ఞ వలన విషయానందం లభ్యమవుతాయని ఆయన విపులీకరించారు. విద్యవల్లనే మానవుడు ఈ సమాజాన్ని ప్రగతి పథంలో నడిపిస్తాడని విశదీకరించారు. ప్రశ్నోత్తరాలతో విద్యార్థులను ఆలోచింప జేస్తూ వారి నుండి సమాధానాలను రాబడుతూ ఆద్యంతం ఆసక్తికరంగా, ఆలోచనాత్మకంగా తమ ప్రసంగాన్ని కొనసాగించారు. తమ ప్రసంగంలో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ సంభాషించడం వల్ల ఈ కార్యక్రమం అందరినీ అలరించింది. ఉభయ పరిషత్తుల అధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఇదే వేదికపై కళాశాల అభివృద్ధి కోసం విద్యాసాగర్ గారి శిష్యులు 50,000/- రూపాయలు విరాళం అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.