తెలుగు భాషా దినోత్సవం
ఆగస్టు 29.2025 శుక్రవారం నాడు మాత్యశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి తి.తి.దే కళ్యాణ మండపంలో తెలుగు భాషా దినోత్సవం జరిగింది. వ్యావహారిక తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి గారి 162 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఏర్పాటైన ఈ సభకు ఆంధ్ర ఉపన్యాసకులు డా॥ నారాయణం శేషుబాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సభా కార్యక్రమలో కళాశాల కరస్పాండెంట్ శ్రీ జన్నాభట్ల కుమార చంద్రశేఖర గారు, జి. గోవిందరాజు గారు, యమ్. దినకర్ గారు వి. ప్రేమరాజు గారు పాల్గొన్నారు.
విద్యార్థినీ విద్యార్థులు నృత్య ప్రదర్శనలను, లఘు నాటికలను, గీతాలను ఆలపించి తెలుగు వైభవాన్ని చాటి చెప్పారు. తెలుగుశాఖ అధ్యాపకులు జి. వీరాంజనేయులు గారు సభాకార్యక్రమాన్ని నిర్వహించగా పి. సుందరరావు గారు వందన సమర్పణ గావించారు
