BLOOD TEST CAMP

Organized by: NSS Unit / IQAC in collaboration with MMC (Matrusri Medical Centre, Jillellamudi)

Objective of the Program:

  • To create awareness about personal health and regular medical checkups among students and staff.
  • To provide basic diagnostic services and promote health consciousness.

Description of the Program:

  • Medical personnel from MMC conducted free blood tests for students and staff in the college campus.
  • Tests included hemoglobin, sugar, BP, and general health indicators. Students actively participated and understood the importance of maintaining good health and regular checkups.

No. of Participants: Students: 80, Staff: 10, Total: 90

Outcome:

  • Students became aware of their health status.
  • Encouraged regular health monitoring and healthy lifestyle habits.

Coordinators:  Sri. T. Jaya Krishna, NSS Programme Officer, G. Veeranjaneyulu, K. Nagarjuna.

 

స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర

స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 20/09/2025  శనివారం రోజున స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కమిషనర్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్, మంగళగిరి వారి ఉత్తర్వుల మేరకు “Green AP” గురించి విద్యార్థులకు అవగాహన కల్పించుటకు సమావేశం నిర్వహించాము. ఈ సభలో  ఎన్ ఎస్ ఎస్ యూనిట్ -1 ప్రోగ్రాం ఆఫీసర్ మరియు అథ్యాపకులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి  అవగాహన కల్పించారు. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జి. గోవిందరాజులు గారి పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించబడింది.  కార్యక్రమంలో భాగంగా  కళాశాలలో అథ్యాపకులు విద్యార్థుల చేత మొక్కలు నాటించారు. 14 మంది అథ్యాపక,అథ్యాపకేతర సిబ్బంది  మరియు 160 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ సంరక్షణ పట్ల బాధ్యతా భావం పెంపొందించబడింది.

NSS FOUNDATION DAY

NSS FOUNDATION DAY

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎన్‌.ఎస్‌.ఎస్‌. సెల్‌ వారి మార్గదర్శకాల మేరకు, మాతృశ్రీ ఓరియెంటల్ కళాశాలలో జాతీయ సేవా పథక దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా విద్యార్థుల్లో సామాజిక సేవాభావం, బాధ్యతా చైతన్యం పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా సమావేశం ఏర్పాటు చేయబడింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ లక్కరాజు సత్యనారాయణ గారు (విశ్రాంత వ్యాయామ అధ్యాపకులు) హాజరై, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో ఎన్‌.ఎస్‌.ఎస్‌. వాలంటీర్లుగా విద్యార్థులు గ్రామస్థాయిలో చేయవలసిన సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరిస్తూ, సామాజిక బాధ్యతతో పనిచేయాలని సందేశమిచ్చారు.

ఎన్‌.ఎస్‌.ఎస్‌. యూనిట్–1 ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ టి. జయకృష్ణ గారు ఈ సందర్భంగా కీలక ఉపన్యాసం చేసి, ఎన్‌.ఎస్‌.ఎస్‌. చరిత్ర, లక్ష్యాలు, మరియు యువత పాత్రపై విశదీకరించారు.

కార్యక్రమం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శ్రీ జి. గోవిందరాజులు గారి అధ్యక్షతన సమర్థవంతంగా నిర్వహించబడింది.

అలాగే, ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 23న నిర్వహించిన వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలలో విజేతలైన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసి, వారిని ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో 14 మంది అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది, 86 మంది విద్యార్థులు చురుకైనంగా పాల్గొన్నారు. కార్యక్రమం విద్యార్థుల్లో సామాజిక సేవా స్పృహను పెంపొందించడంలో విశేష ఫలితాలను అందించింది.

Guest Lecture on Training in reasoning & thinking Skills

             Guest Lecture on Training in reasoning & thinking Skills

          24 సెప్టెంబర్ 2025 న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెల్లమూడి లో B.Sc. Computer Science విభాగం విద్యార్థుల కోసం Reasoning & Thinking Skills అనే అంశంపై Guest Lecture నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి శ్రీ కె. సంజీవ్ కుమార్ గారు (Guest Lecturer) ప్రసంగకర్తగా హాజరయ్యారు.

ఆయన విద్యార్థి జీవితంలో తార్కికత, తర్కశక్తి, ఆలోచనా పద్ధతుల ప్రాముఖ్యతను వివరించారు. Reasoning మరియు Thinking నైపుణ్యాలు సమస్య పరిష్కార సామర్థ్యాన్ని, ఏకాగ్రతను, మరియు నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని ఆయన తెలియజేశారు. ఈ నైపుణ్యాలు ఉన్నత విద్య, పోటీ పరీక్షలు మరియు వృత్తి అభివృద్ధికి ఎంత అవసరమో విద్యార్థులకు వివరిస్తూ, ఉదాహరణలతో ఆచరణాత్మకంగా బోధించారు.

సెషన్‌లో విద్యార్థులు పజిల్స్‌, తార్కిక ప్రశ్నలు, మరియు సమస్య పరిష్కార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఈ ఉపన్యాసం విద్యార్థులలో ఆలోచనా దక్షతను, సృజనాత్మకతను పెంచింది. కార్యక్రమం చివరన కళాశాల అకాడెమిక్ & అడ్మినిస్ట్రేటివ్ ఇన్‌చార్జ్ శ్రీ జి. గోవిందరాజు గారు, సిబ్బంది సభ్యులతో కలిసి శ్రీ కె. సంజీవ్ కుమార్ గారిని సన్మానించారు. విద్యార్థులు ఈ కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేస్తూ, ఇది తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని తెలిపారు.

గురజాడ వెంకటప్పారావు జయంతి ఉత్సవం

గురజాడ వెంకటప్పారావు జయంతి ఉత్సవం

          మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 20 సెప్టెంబర్ 2025న అభ్యుదయ కవితా పితామహుడు, తెలుగు రచయిత గురజాడ వెంకటప్పారావు గారి జయంతి సందర్భంగా ప్రత్యేక సభా కార్యక్రమం ఏర్పాటయింది. ఈ సభకు శ్రీ జి. గోవిందరాజు గారు అధ్యక్షత వహించారు. గురజాడ గారి జీవిత చరిత్ర, రచనలు, మరియు “దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు” అనే ఆయన సూత్రాన్ని ప్రస్తావిస్తూ ప్రసంగించారు. అధ్యాపకులు ముఖ్యమైన సామాజిక అంశాలపై విద్యార్థులకు సూచనలు అందించారు. వీటిలో కన్యాశులం, బాల్య వివాహాలు, వితంతు వివాహాల సమస్యలు ముఖ్యంగా చర్చించబడ్డాయి. ఈ ప్రసంగాల ద్వారా విద్యార్థులకు సామాజిక బాధ్యత, సమాజంపై అవగాహన పెంపొందించే సందేశం అందించబడింది. ఈ సందర్భంగా విద్యార్థులు గురజాడ గారి జీవితచరిత్ర మరియు కవిత్వంపై మాట్లాడారు. ఈ సభను తెలుగు విభాగ అధ్యక్షులు టి. జయకృష్ణ గారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.