స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర

స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 20/09/2025  శనివారం రోజున స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కమిషనర్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్, మంగళగిరి వారి ఉత్తర్వుల మేరకు “Green AP” గురించి విద్యార్థులకు అవగాహన కల్పించుటకు సమావేశం నిర్వహించాము. ఈ సభలో  ఎన్ ఎస్ ఎస్ యూనిట్ -1 ప్రోగ్రాం ఆఫీసర్ మరియు అథ్యాపకులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి  అవగాహన కల్పించారు. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జి. గోవిందరాజులు గారి పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించబడింది.  కార్యక్రమంలో భాగంగా  కళాశాలలో అథ్యాపకులు విద్యార్థుల చేత మొక్కలు నాటించారు. 14 మంది అథ్యాపక,అథ్యాపకేతర సిబ్బంది  మరియు 160 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ సంరక్షణ పట్ల బాధ్యతా భావం పెంపొందించబడింది.

NSS FOUNDATION DAY

NSS FOUNDATION DAY

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎన్‌.ఎస్‌.ఎస్‌. సెల్‌ వారి మార్గదర్శకాల మేరకు, మాతృశ్రీ ఓరియెంటల్ కళాశాలలో జాతీయ సేవా పథక దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా విద్యార్థుల్లో సామాజిక సేవాభావం, బాధ్యతా చైతన్యం పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా సమావేశం ఏర్పాటు చేయబడింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ లక్కరాజు సత్యనారాయణ గారు (విశ్రాంత వ్యాయామ అధ్యాపకులు) హాజరై, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో ఎన్‌.ఎస్‌.ఎస్‌. వాలంటీర్లుగా విద్యార్థులు గ్రామస్థాయిలో చేయవలసిన సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరిస్తూ, సామాజిక బాధ్యతతో పనిచేయాలని సందేశమిచ్చారు.

ఎన్‌.ఎస్‌.ఎస్‌. యూనిట్–1 ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ టి. జయకృష్ణ గారు ఈ సందర్భంగా కీలక ఉపన్యాసం చేసి, ఎన్‌.ఎస్‌.ఎస్‌. చరిత్ర, లక్ష్యాలు, మరియు యువత పాత్రపై విశదీకరించారు.

కార్యక్రమం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శ్రీ జి. గోవిందరాజులు గారి అధ్యక్షతన సమర్థవంతంగా నిర్వహించబడింది.

అలాగే, ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 23న నిర్వహించిన వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలలో విజేతలైన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసి, వారిని ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో 14 మంది అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది, 86 మంది విద్యార్థులు చురుకైనంగా పాల్గొన్నారు. కార్యక్రమం విద్యార్థుల్లో సామాజిక సేవా స్పృహను పెంపొందించడంలో విశేష ఫలితాలను అందించింది.

గురజాడ వెంకటప్పారావు జయంతి ఉత్సవం

గురజాడ వెంకటప్పారావు జయంతి ఉత్సవం

          మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 20 సెప్టెంబర్ 2025న అభ్యుదయ కవితా పితామహుడు, తెలుగు రచయిత గురజాడ వెంకటప్పారావు గారి జయంతి సందర్భంగా ప్రత్యేక సభా కార్యక్రమం ఏర్పాటయింది. ఈ సభకు శ్రీ జి. గోవిందరాజు గారు అధ్యక్షత వహించారు. గురజాడ గారి జీవిత చరిత్ర, రచనలు, మరియు “దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు” అనే ఆయన సూత్రాన్ని ప్రస్తావిస్తూ ప్రసంగించారు. అధ్యాపకులు ముఖ్యమైన సామాజిక అంశాలపై విద్యార్థులకు సూచనలు అందించారు. వీటిలో కన్యాశులం, బాల్య వివాహాలు, వితంతు వివాహాల సమస్యలు ముఖ్యంగా చర్చించబడ్డాయి. ఈ ప్రసంగాల ద్వారా విద్యార్థులకు సామాజిక బాధ్యత, సమాజంపై అవగాహన పెంపొందించే సందేశం అందించబడింది. ఈ సందర్భంగా విద్యార్థులు గురజాడ గారి జీవితచరిత్ర మరియు కవిత్వంపై మాట్లాడారు. ఈ సభను తెలుగు విభాగ అధ్యక్షులు టి. జయకృష్ణ గారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

WORLD SANSKRIT DAY CELEBRATIONS – విశ్వ సంస్కృత భాషా దినోత్సవము

  World Sanskrit Day

శ్రావణ పూర్ణిమ సందర్భంగా 09.08.25 వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో విశ్వ సంస్కృత భాషా దినోత్సవము ను జరుపుకొనుట జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ C.H.పవన్ కుమార్ గారు Guest Faculty in Sanskrit Dept , Acharya Nagarjuna University  నుండి విచ్చేసియున్నారు.  కార్యక్రమంలో భాగంగా సభా అధ్యక్షత వహించిన కళాశాల సంస్కృత విభాగాధిపతి తో Dr. R V N S S వరప్రసాద్ గారు సంస్కృత భాష మహాత్యమును గురించి వివరించడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ గౌరవనీయులు సిహెచ్ పవన్ కుమార్ గారు సంస్కృత భాష ప్రాశస్త్యం మరియు ఆధునిక కాలంలో పరిరక్షణ విధానాలను ప్రతిపాదించడం జరిగింది కార్యక్రమంలో సభా నిర్వహణ సంస్కృత అధ్యాపకులు Dr. V.త్రయంబకం గారు నిర్వహించగా  వందన సమర్పణ శ్రీమతి బి సుకన్య గారునిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు సంస్కృత భాష గురించి తమ అభిప్రాయంను వ్యక్తపరిచడం, సంస్కృత గీతాలాపన చేయడం జరిగింది. అంతిమంగా వందన సమర్పణ కార్యక్రమం ముగిసింది.

తెలుగు భాషా దినోత్సవం

తెలుగు భాషా దినోత్సవం

ఆగస్టు 29.2025 శుక్రవారం నాడు మాత్యశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి తి.తి.దే కళ్యాణ మండపంలో తెలుగు భాషా దినోత్సవం జరిగింది. వ్యావహారిక తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి  గారి 162 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఏర్పాటైన ఈ సభకు ఆంధ్ర ఉపన్యాసకులు డా॥ నారాయణం శేషుబాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సభా కార్యక్రమలో కళాశాల కరస్పాండెంట్ శ్రీ జన్నాభట్ల కుమార చంద్రశేఖర గారు, జి. గోవిందరాజు గారు, యమ్. దినకర్ గారు వి. ప్రేమరాజు గారు పాల్గొన్నారు.

విద్యార్థినీ విద్యార్థులు నృత్య ప్రదర్శనలను, లఘు నాటికలను, గీతాలను ఆలపించి  తెలుగు వైభవాన్ని చాటి చెప్పారు. తెలుగుశాఖ అధ్యాపకులు జి. వీరాంజనేయులు గారు సభాకార్యక్రమాన్ని నిర్వహించగా పి. సుందరరావు గారు వందన సమర్పణ గావించారు

గురుపూర్ణిమ/Gurupoornima

గురుపూర్ణిమ/Gurupoornima

ఘనంగా గురుపౌర్ణమి కార్యక్రమం

ది 10.07.2025 గురువారం నాడు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో గురుపౌర్ణమి సందర్భంగా సభాకార్యక్రమం ఘనంగా జరిగింది. గుంటూరు  హిందూ కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు డాక్టర్ దీవి నరసింహ దీక్షిత్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. గురు పరంపర ద్వారానే భారతదేశం విశ్వగురువుగా నిలిచిందని, గురువు జీవితానికి మార్గదర్శకుడే కాక సంస్కృతి పరిరక్షకుడుగా కూడా ఉండాలని తెలిపారు. ఎంతోమంది శిష్యులను తయారు చేయడం వలన వ్యాసభగవానుడి పేరుతో ఈ పర్వదినము వ్యాసపూర్ణిమగా పేరొందిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నదానం హనుమత్ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీ విశ్వజనని పరిషత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ వల్లూరి ప్రేమ్ రాజ్ గారు, Honorary Chairman శ్రీ M.దినకర్ గారు, కోశాధికారి శ్రీ జన్నాభట్ల సుబ్రహ్మణ్యం గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్య అతిథికి ఘనంగా గురుసత్కారం చేశారు. అనంతరం గురుపాదుకాస్తోత్ర పారాయణ జరిగింది. కళాశాల విద్యార్థినీ విద్యార్థులే సభానిర్వహణ చేశారు. కళాశాల సంస్కృత విభాగ అధ్యక్షులు డాక్టర్ ఆర్ వరప్రసాద్ గారు వందనసమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో  కళాశాల అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది.