గీతాజయంతి ఉత్సవాలు | Gita Jayanthi Celebrations

గీతాజయంతి ఉత్సవాలు

11.12.2024, బుధవారం మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కలశాలతో MOU కుదుర్చుకున్న వివిధ పాఠశాల, కళాశాలల విద్యార్దులకు సెమినార్ హాల్‌లో భగవద్గీత పోటీలు నిర్వహించబడ్డాయి. మధ్యాహ్నం అందరింటి ఆవరణలో ఉన్న తి.తి.దే కళ్యాణమండపం లో ఏర్పాటు చేయబడిన సమావేశంలో ముఖ్య అతిథి గా డా. ఉషారాణి సంకా, ఆత్మీయ అతిథి బొప్పూడి రామబ్రహ్మంగారు, కరస్పాండెంట్ జి. రాఘవేంద్రరావు గారు, సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్, గోరంట్ల వెంకన్న ఓరియంటల్ కళాశాల యాజమాన్యం వారు పాల్గొన్నారు.  సభాధ్యక్షులు, కరస్పాండెంట్ గోగినేని రాఘవేంద్రరావు గారు వచ్చే ఏడాది భగవద్గీత పోటీలు మండల స్థాయి జిల్లా స్థాయిలలో నిర్వహించే ప్రయత్నం చేస్తామని తద్ద్వారా సంస్కత భాషా సేవతో పాటు ఉత్తమ సంస్కారాలు కలిగిన పౌరులను తయారు చేసే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ ప్రసాద్ గారు ప్రసంగిస్తూ భగవద్గీత ఎప్పుడు పుట్టింది? ఎందుకు మనం ఇంత వైభవంగా ఒక గ్రంథాన్ని జయంతి గా ఏర్పాటు చేసుకున్నాము? అని సవివరంగా చెప్పారు.  అనంతరం ముఖ్య అతిథి డా. ఉషారాణి గారు మాట్లాడుతూ విద్యార్ధులందరూ భగవద్గీత నేర్చుకొని భావితరాలకు మన సాంస్కృతిక వారసత్వాన్ని అందజేయాలని ఈ గ్రంథం మనల్ని సన్మార్గంలో నడిపించే సూచిక అని వివరించారు. అనంతరం ఆత్మీయ అతిథి బొప్పూడి రామబ్రహ్మం గారు భగవద్గీత 18 అధ్యాయంలో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క అస్త్రం లాంటిది అనీ, స్థితప్రజ్ఞత అంటే ఏమిటో ఆధార శ్లోకాలతో తెలియజేశారు. గీతా జయంతి సందర్భంగా వివిధ పాఠశాలల్లో మరియ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతి ప్రదానం జరిగింది. పోటీలలో పాల్గొనడానికి విద్యార్థులను ఉత్సాహపరిచి ఆ యా పాఠశాల మరియు కళాశాలల నుండి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ సంతోషాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి SVJP Trust ఎంతో సహాయ సహకారాలను అందించింది. రామబ్రహ్మం గారు ప్రథమ ద్వితీయ స్థానాలలో నిలిచిన వారికి గీతా మకరందాన్ని అందించారు. అలాగే ప్రతి విద్యార్థికి భగవద్గీత పుస్తకాలను అందించారు. SVJP Temples Trusty శ్రీ కె. సాయిబాబా గారు అతిథులను అమ్మ ప్రసాదం తో సత్కరించారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల సంస్కృత విభాగ అధ్యక్షులు డా. ఆర్. వరప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంస్కృత ఉపన్యాసకులు వల్లూరి త్రయంబకం గారు వందన సమర్పణ చేశారు. శాంతిమంత్రంతో కార్యక్రమం ముగిసింది.

 On December 11, 2024, Wednesday, on the occasion of Githa jayanthi (Margashira Shuddha Ekadashi), Matrusri Oriental College organized Bhagavad Gita competitions for students from various schools and colleges with which it has MOUs. The morning session was held in the seminar hall. The afternoon session took place at TTD Kalyanamandapam, with Dr. Usharani Sanka as the chief guest, and esteemed guests including Boppoodi Ramabrahmam, Correspondent G. Raghavendra Rao, and management representatives from Siddhartha English Medium High School and Gorantla Venkanna Oriental College.

Correspondent Gogineni Raghavendra Rao highlighted plans to expand the Bhagavad Gita competitions to mandal and district levels next year, emphasizing the importance of promoting Sanskrit and nurturing cultured citizens. Principal Dr. Annadanam Hanumath Prasad delivered a detailed address on the origin and significance of celebrating the Bhagavad Gita Jayanti.

Dr. Usharani encouraged students to learn and uphold the cultural heritage through the teachings of the Bhagavad Gita. Boppoodi Ramabrahmam explained the importance of each verse in the 18 chapters of the Gita, equating each to a powerful weapon and elaborating on “sthitaprajna”.

Prizes were awarded to winners from various schools and colleges. The event was supported by SVJP Trust, and Dr. Ramabrahmam distributed copies of the Bhagavad Gita to all participants. SVJP Temples Trustee K. Saibaba honored guests with prasadam. The program, organized by Dr. R. Varaprasad, concluded with a peace chant.

 

కాళిదాస జయంతి

కాళిదాస జయంతి

కాళిదాస జయంతి

             మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 12.11. 24 వ తేదీన “కాళిదాస జయంతి”ని పురస్కరించుకుని సంస్కృత విభాగం వారు సభను నిర్వహించడం జరిగింది. తొలుత ఈసభకు అధ్యక్షులుగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.AVNG హనుమత్ ప్రసాద్ గారు  కాళిదాసు రచన వైశిష్ట్యాన్ని వివరించారు. సభకు విశిష్టాతిథి, ప్రధాన వక్తగా పాల్గొన్న శ్రీమతి Dr. SVSL ఫణి కామేశ్వరి గారు తమ ప్రసంగం లో కాళిదాసు రచనలు, వర్ణనా నైపుణ్యం,శైలి, ఉపమాలంకార ప్రయోగములు, మొదలగు విషయములను ఉదాహరణలతో వివరించడం జరిగింది. కార్యక్రమంలో పి. డి. సి. ఫస్టియర్ విద్యార్థిని వి. మీనాక్షి, BA OL తృతీయ సంవత్సరము విద్యార్థి పి. లక్ష్మయ్య మహాకవి కాళిదాసు గురించి మాట్లాడటం జరిగింది. ఎస్. దేవి బృందం  సంస్కృత గీతమును ఆలపించారు .సభా కార్యక్రమంలో చివర విశిష్టాతిథిని ‘అమ్మ ప్రసాదం’తో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంనకు సభా నిర్వహణ కళాశాల IQAC Coordinator Dr.V.పావని గారు నిర్వహించగా, సంస్కృత అధ్యాపకులు Dr.V. త్రయంబకం గారు,  వందన సమర్పణ చేయగా శాంతి మంత్రంతో సభను ముగించటం జరిగింది.

 

Valmiki Jayanthi | వాల్మీకి జయంతి

Valmiki Jayanthi | వాల్మీకి జయంతి

వాల్మీకి జయంతి
17-10-2024, గురువారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వాల్మీకి జయంతి ని పురస్కరించుకొని ప్రత్యేక సభ ఏర్పాటు చేయబడింది. కళాశాల పూర్వ చరిత్ర అధ్యాపకులు, రామాయణ రసభారతి బిరుదాంకితులు, విశ్వజనని మాసపత్రిక సంపాదకులైన శ్రీమల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు కళాశాల విద్యార్థులకు,అధ్యాపకులకు రామాయణ ప్రాశస్త్యాన్ని తెలియజేసారు. సాహితీలోకానికి మార్గదర్శకుడైన వాల్మీకి మహర్షి భావుకతనూ, రచనా వైచిత్రినీ, శబ్ద గాంభీర్యమునూ శ్రీమల్లాప్రగడ వారు సభలో ఆవిష్కరించారు. వీరి ప్రసంగం విన్న విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో రామాయణం లోని లౌకిక, అలౌకిక అంశాలను తప్పనిసరిగా తెలుసుకోవాలనే కుతూహలాన్ని కనబరిచారు. కళాశాల సంస్కృతవిభాగం పక్షాన జరిగిన ఈ సభకు ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు అధ్యక్షత వహించి వాల్మీకి మహర్షికి పుష్పాంజలి ఘటించారు. విభాగాధిపతి డా. ఆర్. వరప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆత్మీయ అతిథి శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Gurram Jashuva Jayanthi | గుఱ్ఱం జాషువా జయంతి

Gurram Jashuva Jayanthi | గుఱ్ఱం జాషువా జయంతి

28-9-2024 న గుఱ్ఱం జాషువా జయంతి నవయుగ కవి చక్రవర్తి గుఱ్ఱంజాషువా జయంతి సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో గుఱ్ఱం జాషువా జయంతి సభ ఏర్పాటు చేయబడింది. కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ ఈ సభకు అధ్యక్షత వహించగా తెలుగు విభాగాధిపతి శ్రీమతి యల్ మృదుల సభా ప్రాతినిధ్యాన్ని వహించారు. తెలుగు అధ్యాపకులు శ్రీ టి. జయకృష్ణ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ సమకాలీన కవిత్వ ఒరవడియైన భావకవిత్వరీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసిన మహనీయుడు జాషువా అని ఆయన రచనలను, వైశిష్ట్యాన్ని, వారి కవితా మాధుర్యాన్ని చవిచూపారు. తెలుగు విభాగ అధ్యక్షురాలు డా. యల్. మృదుల మాట్లాడుతూ అవమానాలు పొందిన చోటే సత్కారాలను పొందిన జాషువా జీవితవిశేషాలను తెలియజేశారు. అనంతరం తెలుగు అధ్యాపకులు శ్రీ జి. వీరాంజనేయులు జాషువా రచనలలోని దేశభక్తి పాటతో విద్యార్థులలో చైతన్యాన్ని కలిగించారు. కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

Telugu Bhasha Dinothsavam in Association with Andhra Viswakala Parishat & Samaikya Bharathi

Telugu Bhasha Dinothsavam in Association with Andhra Viswakala Parishat & Samaikya Bharathi

తెలుగు భాషా దినోత్సవం

ఆగష్ట్ 29 , 2024 గురువారం నాడు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల-జిల్లెళ్ళమూడి , ఆంధ్ర విశ్వ కళాపరిషత్ మరియు సమైక్య భారతి వారి సంయుక్త ఆధ్వర్యంలో వాత్సల్యాలయ ప్రాంగణంలో వ్యవహారిక భాషోద్యమ పితామహుడైన శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారి 161వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ముందుగా గౌరవ అతిథి గిడుగు రామమూర్తి గారి ముని మనుమడు గిడుగు నాగేశ్వరరావు గారు విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. గిడుగు వారి భాష మరియు సాహిత్య సేవను, గ్రాంథిక వ్యవహార భాషల వ్యత్యాసమును పండితుల తిరస్కారమును , వ్యవహార భాషోద్యమ చరిత్రను వారి జీవిత ఇతివృత్తాన్ని తెలియపరిచారు.
ఈ సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డా: అన్నదానం. హనుమత్ ప్రసాద్ గారు నేడు ప్రాధాన్యత కోల్పోతున్న తెలుగు భాషకు మనమందరం పూర్వవైభవం పొందే విధంగా కృషి చేయాలనే సందేశం అందించారు. తదనంతరం విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వపు రెక్టార్ డాక్టర్ పి .వరప్రసాద మూర్తి గారు వ్యవహార భాషా ఉద్యమంలో భాగంగా గిడుగు వారితో పాటు గురజాడ వారి సేవలను వివరించి, మన కర్తవ్యాన్ని తెలియజేశారు. తర్వాత ముఖ్య అతిథిగా ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు విభాగం, విశాఖపట్నం నుండి విచ్చేసిన డాక్టర్ :వెంకటేశ్వర యోగి గారు యథారాజా తథాప్రజా అనే ఆర్యోక్తిని యథారాజా తథాభాషా అని అన్వయం చేస్తూ , పరభాషని అభిమానిస్తూ మాతృభాషను మరిస్తే మన భాష మనుగడ కష్టం అని గుర్తించి మాతృభాషా సేవ చేయాలని తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రధాన సూత్రధారులు సమైక్య భారతి జాతీయ సమన్వయకర్త , మన విశిష్ట అతిథి శ్రీ పి. కన్నయ్య గారు సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన జిల్లెళ్ళమూడిలో నేటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా నేను కూడా అమ్మ బిడ్డను అయ్యానని, తెలుగు భాషకు మీరందరూ కూడా మరింత సత్కీర్తిని కలిగించాలని విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. తదుపరి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన శ్రీ ప్రసాద వర్మ కామ ఋషి గారు ఆంధ్రభాష సేవను గూర్చి తెలియజేస్తూ , మన భాష అభివృద్ధికి కృషి చేయాలని సందేశం ఇచ్చారు. అనంతరం ఆత్మీయ అతిథిగా విచ్చేసిన శ్రీ మేడా మస్తాన్ రెడ్డి గారు మానసిక ఉల్లాసాన్ని కలిగించే హాస్య రసాన్ని జోడించి తెలుగు భాష విశిష్టతను తెలియపరిచారు. అటు తర్వాత మరో ఆత్మీయ అతిథి శ్రీ వర్రే నాంచారయ్య గారు విద్యార్థులకు తెలుగు భాషపై మక్కువ ఆసక్తి కలిగించారు. మరో ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఆంజనేయులు నాయుడు గారు తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు గారిని స్మరించడం మన కర్తవ్యం అని, తెలుగు వెలుగులను పంచిన మహనీయులందరిని మనం గుర్తుంచుకోవాలని వారి అడుగుజాడల్లో నడవాలని అమూల్యమైన సందేశాన్ని అందించారు. తెలుగు శాఖ అధ్యక్షురాలు డాక్టర్: లక్కవరపు మృదుల సభా నిర్వహణ చేయగా, తెలుగు అధ్యాపకులు కె. హేమంత్ గారు వందన సమర్పణ చేశారు. కళాశాల విద్యార్థులు తమ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహూతులను ఆనంద పరిచారు. ఈ కార్యక్రమం శాంతి మంత్రంతో విజయవంతంగా ముగిసింది

 

 

Viswa Samskrutha Bhasha Dinothsavam | విశ్వ సంస్కృతభాషా దినోత్సవం

Viswa Samskrutha Bhasha Dinothsavam | విశ్వ సంస్కృతభాషా దినోత్సవం

అమృతభాష పునరుద్ధరణకై ప్రపంచవ్యాప్తంగా శ్రావణపూర్ణిమ పర్వదినం రోజున విశ్వ సంస్కృతభాషా దినోత్సవం జరుపుకుంటున్నాము. మాతృశ్రీ ప్రాచ్య కళాశాల లో జనని సంస్కృతంబు జగతి భాషలకెల్ల అని చాటి చెప్పే విధంగా సంస్కృతభాషాదినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలను చేపట్టారు. ముందుగా కళాశాలలో ఏర్పాటు చేసిన సభకు ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ అధ్యక్షభాషణ చేస్తూ పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా అనే నినాదంతో విద్యార్థులను సంస్కృతం లో మాట్లాడే ప్రయత్నం నేటినుంచే ప్రారంభించాలని సూచించారు. దేశవ్యాప్తంగా సంస్కృతభాష ప్రాచారానికై అహర్నిశం కృషి చేస్తున్న సంస్కృతభారతి సంస్థ తరుపున చీరాల జనపదం లో బాలకేంద్రాలను నిర్వహిస్తున్న శ్రీమతి సి.హెచ్. గీత గారు ఈ సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వీరు సంస్కృతభాషా ప్రచార సాధకులుగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు ఉండాలని అలా మీరు ప్రయత్నం చేయాలని చెప్పారు. అంతేకాక విద్యార్థులకు బాలకేంద్రాన్ని స్వయంగా నిర్వహించి సులభ శైలిలో సంస్కృతంలో మాట్లాడడం నేర్పించారు. కళాశాల విద్యార్థులు సంస్కృతగీతాలాపన, శ్లోకపఠనం ఛేశారు. సంస్కృతభాషా ప్రాశస్త్యాన్ని చాటి చెప్తూ నృత్యప్రదర్శన గావించారు. సంస్కృతవిభాగం తరుపున జరిగిన ఈ కార్యక్రమంలో సంస్కృతశాఖాధ్యక్షులు డా. ఆర్. వరప్రసాద్ గారు సభానిర్వహణ చేయగా, డా. వి. త్రయంబకం గారు వందనసమర్పణ చేశారు. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాంతిమంత్రంలో కార్యక్రమం ముగిసింది.