స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర

“స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి వారిచే 2025 మే 17న మధ్యాహ్నం 3 గంటలకు గూగుల్ మీట్ ద్వారా Beat the Heat పై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ హనుమత్ప్రసాద్ గారు ప్రారంభించి, కార్యక్రమం ఉద్దేశ్యాన్ని వివరిస్తూ, వేసవిలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎలా ఉపయోగపడుతుందో వివరించారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ యల్. మృదుల గారు “Beat the Heat” అంటూ విద్యార్థులు  వేసవిలో  తీసుకోవలసిన జాగ్రత్తల గురించి స్పష్టంగా వివరించారు. అదేవిధంగా సాధ్యమైనంత వరకు తోటివారికి సహాయపడవలసిందిగా సూచించారు.

NSS కోఆర్డినేటర్ శ్రీ టి. జయకృష్ణ గారు PowerPoint ప్రజెంటేషన్ ద్వారా వేడి సంబంధిత ఆరోగ్య సమస్యల నుంచి ఎలా తప్పించుకోవాలో విద్యార్థులకు స్పష్టమైన సందేశాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో మొత్తం 10 మంది అధ్యాపకులు, 63 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కార్యక్రమంలో విద్యార్ధులకు అన్ని విషయాలు అవగాహన కల్పించేందుకు Quiz నిర్వహించి e-Certificates అందించారు.