గురజాడ వెంకటప్పారావు జయంతి ఉత్సవం

          మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 20 సెప్టెంబర్ 2025న అభ్యుదయ కవితా పితామహుడు, తెలుగు రచయిత గురజాడ వెంకటప్పారావు గారి జయంతి సందర్భంగా ప్రత్యేక సభా కార్యక్రమం ఏర్పాటయింది. ఈ సభకు శ్రీ జి. గోవిందరాజు గారు అధ్యక్షత వహించారు. గురజాడ గారి జీవిత చరిత్ర, రచనలు, మరియు “దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు” అనే ఆయన సూత్రాన్ని ప్రస్తావిస్తూ ప్రసంగించారు. అధ్యాపకులు ముఖ్యమైన సామాజిక అంశాలపై విద్యార్థులకు సూచనలు అందించారు. వీటిలో కన్యాశులం, బాల్య వివాహాలు, వితంతు వివాహాల సమస్యలు ముఖ్యంగా చర్చించబడ్డాయి. ఈ ప్రసంగాల ద్వారా విద్యార్థులకు సామాజిక బాధ్యత, సమాజంపై అవగాహన పెంపొందించే సందేశం అందించబడింది. ఈ సందర్భంగా విద్యార్థులు గురజాడ గారి జీవితచరిత్ర మరియు కవిత్వంపై మాట్లాడారు. ఈ సభను తెలుగు విభాగ అధ్యక్షులు టి. జయకృష్ణ గారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.