కళాశాల మరియు పాఠశాల విద్యార్థులకు అల్పాహార పంపిణీ ప్రారంభం

“ఆకలే అర్హత”గా అన్నం పెట్టమన్న విశ్వజననీ అమ్మ ఆశయాలకు అనుగుణంగా కళాశాల మరియు పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని 12.12.2019 గురువారం నుండి కళాశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అమ్మ ఆశీస్సులతో మరియు సంస్థవారి సహాయ సహకారాలతో నిర్విరామంగా కొనసాగాలని కళాశాల ప్రిన్సిపాల్ డా॥ వి.హనుమంతయ్య ఆశించారు. ప్రిన్సిపాల్ గారు నూతనంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి స్పందిస్తూ కొంతమంది కళాశాల పూర్వ విద్యార్థి సంఘం తరపున వారి సహకారాన్ని అందిస్తామని మాట ఇస్తూ తొలుతగా రూ. 2000/ నగదును ప్రిన్సిపాల్ గారికి అందజేశారు.

పూర్వపు విద్యార్థులు – గౌరవ పురస్కార మహోత్సవం

మెరుగుపెట్టకుండా రత్నం కూడా ప్రకాశవంతం కాదనీ, మా గురువులు మమ్మల్ని, ఈ రోజు ఒక ఉత్తమమైన అధ్యాపకవృత్తిని చేపట్టేవిధంగా చేశారని కళాశాల పూర్వవిద్యార్థులు తెలిపారు. గౌరవ పురస్కార మహోత్సవ కార్యక్రమం సందర్భంగా 14.11.2019 న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సభలో కళాశాల పూర్వ విద్యార్థులు తమ గురువులు సంస్కారవంతమైన చదువుతో మమ్మల్ని తీర్చిదిద్దారని తెలియజేశారు. డా॥ యల్. మృదుల గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ అథ్యక్షులు శ్రీ యమ్. దినకర్ గారు విచ్చేశారు. విద్యార్థులతో తాము చదువుతున్న విద్య ఎంతవరకు ఉపయోగిస్తుంది. ఎలా వారు పోటీ పరీక్షలలో పాల్గొని తమ జీవనోపాధిని పొందవచ్చు అనే అంశాలను వివరించారు. ఈ సందర్భంగా కళాశాలలో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలను పొందిన 14 మందికి గౌరవ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కొండముది ప్రేమ్కుమార్కు పూర్వవిద్యార్థులు సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థులు – గౌరవ పురస్కార మహోత్సవం

మెరుగు పెట్టకుండా రత్నం ప్రకాశవంతంకాదనీ, గురువులు మమ్మల్ని సానబెట్టి, ఈ రోజు ఒక ఉత్తమమైన అధ్యాపక వృత్తిని చేపట్టేవిధంగా చేశారని కళాశాల పూర్వవిద్యార్థులు తెలిపారు. గౌరవ పురస్కార మహోత్సవ కార్యక్రమ సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థులు తమ అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకున్నారు.  డా. యల్. మృదుల గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు శ్రీయమ్ దినకర్ గారు విచ్చేశారు. విద్యార్థులకు తాము చదువుతున్న విద్య ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎలా వారు పోటీ పరీక్షల్లో పాల్గొని తమ జీవనోపాధిని పొందవచ్చు అన్న విషయాన్ని వివరించారు. ఈ సందర్భంగా కళాశాలలో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలను పొందిన 14 మందికి గౌరవ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రేమ కుమార్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

కొండముది రామకృష్ణగారి 21 సంస్మరణ సభ

“నీ సేవలోనే నా బ్రతుకు సాగనీ నీ ధ్యాసలోనే నా శ్వాస ఆగనీ” అని అమ్మ సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన శ్రీ కొండముది రామకృష్ణ. గారి 21 వ సంస్మరణ సభ 31.8.2019 శనివారం రామకృష్ణ గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. కళాశాల ప్రిన్స్పాల్ డా॥ ఎ. సుధామవంశీ అధ్యక్షతలో జరిగిన ఈ సభలో రామకృష్ణ అన్నయ్య పెద్ద కుమారులు కొండముది సుబ్బారావు సంస్థ రెసిడెంట్ సెక్రెటరీ రావూరి ప్రసాద్, కమిటీ సభ్యులు చక్కా శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. రామకృష్ణ అన్నయ్య అడ్మినిస్ట్రేటరుగా, అంతరంగిక కార్యదర్శిగా, కవిగా, తత్వ ప్రచారకునిగా ప్రశంసించి వారితో తమకు గల అనుబంధాలను గుర్తుచేసుకొన్నారు. ఒక వ్యక్తి రచనలకు పి.హెచ్.డి పట్టాను ఇవ్వడం ఎంతో గర్వకారణం అని తెలుగు విభాగంలో లెక్చరర్ గా పనిచేస్తున్న ఎల్. మృదులగారిని సభాముఖంగా అభినందించారు. కార్యక్రమంలో కొండముది సోదరులు నాగేశ్వరరావు, ప్రేమ్కుమార్ గారు రవి సంస్థకు నగదు విరాళాన్ని ఇస్తున్నట్లుగా సభలో తెలియజేశారు. కొండముది రవిగారు అన్నయ్య రాసిన పాటలను గానం చేసి ఈ సందర్భముగా సంపూర్ణ విద్యార్థులుగా ఎంపికైన ఎన్. ప్రవీణ్ బి.ఏ. IIIrd Year, దుర్గాప్రసాద్ 10th Class లకు ఒక్కొక్కరికి 1,116 చొప్పున నగదు పురస్కారం అందించారు. ఇదే వేడుకలో చక్కా శ్రీమన్నారాయణగారు తమ తల్లితండ్రుల స్మృత్యర్థం ఫైనల్ ఇయర్ చదువుతున్న వి. శ్రావణి బి. ఏ. III Tel, యు. కృష్ణ బి.ఏ. III Tel లకు బహుమతులు అందజేశారు. అంతేగాక నంబూరి చింజీవిగారు హైస్కూల్లో చదువుతున్న యమ్. నవ్య (10th) కె. భరత్సాయి 10th విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులను అందజేశారు.

మాతృశ్రీ యువజన సేవా సంఘసేవ

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి పూర్వవిద్యార్థులు శ్రీకాకుళం జిల్లా మగ్గూరు గ్రామంలో 15-1-2019 తేదీన (మకర సంక్రాంతినాడు) విద్యార్థులకు సాహిత్య పోటీలు నిర్వహించారు.

సంస్కరణోత్సవం

జిల్లెళ్ళమూడి అందరింటిని ప్రభావితం చేసిన విశిష్ట వ్యక్తులలో కొండముది రామకృష్ణ ఒకరని జిల్లెళ్ళమూడి అమ్మ సంస్థల చీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు వివరించారు. ఆగస్టు 23 న కళాశాలలో కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి డా॥ బి.యల్. సుగుణ గారు మాట్లాడుతూ, అమ్మ తత్త్వాన్ని దైవత్వాన్ని దీనులపాలిట ఆదరణను కొండముది రామకృష్ణ ఆరాధించినట్లు, అమ్మ నామ సంస్మరణే నిరంతర శ్వాసగా, ధ్యాసగా జీవించిన ధన్యజీవి అని తెలిపారు. ముఖ్య అతిథి, ప్రముఖవక్త ప్రభాకరస్వామీజీ (హైదరాబాదు) పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రామకృష్ణ ఫౌండేషన్ తరఫున సంపూర్ణ విద్యార్థి అనే పేరుతో ఎ.మనీషా, జె. రామారావు లకు జ్ఞాపిక, నగదు బహుమతిగ అందజేశారు. ఇదే వేదికపై చక్కా శ్రీమన్నారాయణ గారు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం కళాశాల విద్యార్థినీ విద్యార్థులు, యల్. కరుణ, కె. మణికంఠ, హరీష్ గుప్తా, ప్రభృతులకు వస్త్రాలు, నగదు బహుకరించారు.