మాతృశ్రీ ఓరియంటల్  కళాశాల – పూర్వ విద్యార్థుల సమావేశం

మాతృశ్రీ ఓరియంటల్  కళాశాల – పూర్వ విద్యార్థుల సమావేశం

మాతృశ్రీ ఓరియంటల్  కళాశాల – పూర్వ విద్యార్థుల సమావేశం

 మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం 2025 మే 5న కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. ఆన్నదానం హనుమత్ ప్రసాద్, అధ్యాపకులు మరియు పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. గౌరవనీయులు శ్రీ దినకర్ అన్నయ్యగారు పాల్గొన్నారు. సమావేశంలో పూర్వ విద్యార్థుల తమ అనుభవాలను పంచుకున్నారు. వారు సమాజంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తుచేశారు. ముఖ్యంగా పార్వతీపురం, పాలకొండ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని వివరించారు.

  1. పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అందించే అంశంపై చర్చ జరిగింది.
  2. ఆర్థికంగా బలహీనమైన విద్యార్థులకు ఉచిత విద్య అందించాలన్న అంశాన్ని పరిశీలించారు.
  3. విద్యార్థులను ఉత్తమంగా ప్రోత్సహించడానికి గోల్డ్ మెడల్స్ కొనసాగించాలంటూ పూర్వ విద్యార్థులు సూచించారు.
  4. కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెంచే విధానాలను చర్చించారు.
  5. కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం కోసం, మేనేజ్మెంట్ బ్రోచర్లు మరియు ఇతర ప్రచార సామాగ్రిని పంచింది.
  6. కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి. రాఘవేంద్రరావు గారు అనారోగ్య కారణంగా జరిగిన ఆకస్మిక మరణం పట్ల సంతాపం వ్యక్తం చేయబడింది.
  7. శ్రీమాన్ ఎస్. వి. రామకృష్ణమాచార్యులు గారికి (మాతృశ్రీ పాఠశాల రిటైర్డ్ హెడ్మాష్టర్) సంతాపం తెలిపారు.
  8. ప్రస్తుత విద్యార్థులకు ఇచ్చే భోజన నాణ్యతపై పూర్వ విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు.
  9. కళాశాల ప్రస్తుత విద్యార్థుల సంఖ్యపై చర్చించి, అభివృద్ధికి అనేక సూచనలు చేశారు.

పూర్వ విద్యార్థుల విరాళాలు:

 శ్రీ సూర్యరావు గారు (1986–1991 బ్యాచ్):  శ్రీ విశ్వజనని ట్రస్ట్, జిల్లెళ్ళమూడికి రూ. 1 లక్ష విరాళంగా అందించారు, ఇది ప్రస్తుత విద్యార్థుల అన్నదాన కార్యక్రమానికి ఉపయోగపడుతుంది.

  1. డా. ఎం. రామకృష్ణాంజనేయులు గారు (1985–1992 బ్యాచ్): కళాశాలకు రూ. 10,000 (పది వేల రూపాయలు) విరాళంగా అందించారు.
  2. ఈ సమావేశం పూర్వ విద్యార్థుల కళాశాల పట్ల ఉన్న బంధాన్ని, వారి సేవా దృక్పథాన్ని ప్రతిబింబించింది. కళాశాల అభివృద్ధి కోసం అందరూ కట్టుబడి ఉన్నారు.

ఆగస్టు 15, విద్యార్థులకు ఉపకార వేతనముల పంపిణీ – 2023 2024

I. శ్రీ అధరాపురపు శేషగిరిరావు గారి స్మారక బహుమతి:
Ist PDC, IInd PDC లలో సంస్కృతంలో అత్యధిక మార్కులు వచ్చిన వారికి రూ. 1000/- ల నగదు బహుమతి. (ఒక్కొక్కరికి 500, రూ.లు చొప్పున) (2,500)
PDC II Sub Skt – I = R.Sasi Rekha = 500/-
PDC II Sub Tel – I = S.Devi = 500/-
శ్రీ అధరాపురపు శేషగిరి రావు స్మారక బహుమతి 1000/- రూ.లు. చొప్పున. – పేద విద్యార్థికి మరియు ఉత్తమ విద్యార్థికి
P. Lakshmaiah PDC II Telugu – 1000/-
III. శ్రీమతి గొట్టిపాటి విజయలక్ష్మి భవాని మరియు హరి గార్లు పేద విద్యార్థుల కొరకు – 900/- రూ.ల నగదు బహుమతి. Ph.No = 7337526951
1) BA II Sem Skt – Chari = 450/-
2) B.AI Sem Tel = Rama = 450/-
IV. తల్లాప్రగడ వెంకట్రావు శ్రీమతి సావిత్రమ్మ గార్ల స్మారక విశేష ప్రతిభా పురస్కారమునకుగాను తల్లాప్రగడ లక్ష్మీపతి గారు 50000/- రూ.ల పై వచ్చే వడ్డీ ఫైనలియర్ పూర్తి అయ్యి అత్యధిక మార్కులు సాధించిన
విద్యార్థులకు. కేటాయించబడినది. (2 x 1250) – Ph.No = 9440661960
III – Total First Telugu = I M. Sravani = 1250/-
III – Total First Sanskrit = I K. Vasantha Kumari = 1250/-
V. గిరీష్ కుమార్ గారు రూ.20,000 ల పై వచ్చే వడ్డీని అత్యధిక మార్కులు సాధించిన ఇరువురు విద్యార్ధినీ విద్యార్థులకు కేటాయించారు. (1000/-) Ph.No = 9820216148
IInd Year Total First Telugu – I = K. Thulasi = 500/-
IInd Year Total First Sanskrit – I= B. Satyavani =500/-

VI. శ్రీ తంగిరాల సత్యనారాయణగారు, శ్రీమతి దమయంతిగారు, మరియు శ్రీ సోమయాజుల రామకృష్ణ శాస్త్రి గారు, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్ల స్మారక చిహ్నంగా, శ్రీయుతులు తంగిరాల రామమోహనరావు గారు విద్యార్థినీ విద్యార్థులకు ఇచ్చే బహుమతి. 2500/- (416 × 3) Ph. No = 9848591981.
1) PDC — II Tel = Shahit = 416/-
2) B.A II Sem Skt = G. Haresh Guptha = 416/-
3) B.A IV Sem Skt = Mani Kumar = 416/-
VII. శ్రీమతి ఆకెళ్ల మాణిక్యాంబ గారి స్మారక చిహ్నంగా వారి కుమారుడు ఆకెళ్ల రవి శంకర్ గారు 25000/- రూ.ల పై వచ్చే వడ్డీ పేద మరియు విధేయ విద్యార్థినీ, విద్యార్థులకు ఇచ్చే నగదు. (416 × 3)=1250/- Ph.No = 9848591981.
1) B.A I Sem Tel = MastanBee = 416/-
2) B.A II Sem Tel = Sk. Muktharunnisa = 416/-
3) B,A II Sem Tel = Jhansi = 416/-

VIII. కీ.శే శ్రీమతి పమిడిబోయిన లీలా వెంకట ధనలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి తమ్ముడు రోషన్ కుమార్ గారు కంప్యూటర్ సబ్జెక్టులో అత్యధిక మార్కులు సంపాదించిన తెలుగు -I, II సంస్కృత -I,II విభాగములోని ఇద్దరు విద్యార్థులకు నగదు బహుమతి.
(4 x 750)=3000 – Ph.No 9963395311.
Telugu – 1) M. Sravani = 750/-
Sanskrit – 1) S. Anil = 750/-
2) K. Anjani = 750/-
2) K.Simha Reddy = 750/-

పేరెంట్స్ – టీచర్స్ మీట్

ఎవరు లక్ష్యసిద్ధిని కలిగిస్తే వాడే గురువు అనే అమ్మ వాక్యాన్ని అక్షరసత్యం చేస్తూ ప్రతి విద్యార్థీ ఎదగడానికి కావలసిన పునాదిని మొగ్గ దశలోనే ఏర్పడేటట్లు చేయాలని ప్రిన్సిపాల్ డా. వి. హనుమంతయ్య గారు పేర్కొన్నారు. అమ్మ- నాన్నల ప్రేమే ప్రగతికి మూలం అన్న, అమ్మ సూక్తికి అనుగుణంగా వారి అడుగు జాడలలో నడుస్తూ ప్రతి ఒక్క విద్యార్థీ ఎదగాలని కాంక్షించారు. 10.1.2020 శుక్రవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రార్ధనా మందిరం లో పేరెంట్-టీచర్స్ మీటింగును ఏర్పాటు చేశారు. డా. వి. హనుమంతయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ యమ్. దినకర్ గారు, కళాశాల డెవలప్ కమిటీ సభ్యులు బొప్పూడి రామబ్రహ్మం గారు పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సభ ప్రారంభంలో ఒక్కో విద్యార్థిని వారి తల్లిదండ్రులతో కలిసి వేదికపైకి రావాలని ఆహ్వానించారు. మనకు రెండురకాల విద్య అవసరం. ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది, రెండు ఎలా జీవించాలో నేర్పేది. అలాంటి ఉన్నత ప్రమాణాలతో ఇక్కడ విద్యను అందిస్తున్నామని బొప్పూడి రామబ్రహ్మం గారు తెలియజేశారు. విద్యార్ధినీ, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఇక్కడ చదువుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. కళాశాలలో  ఎలాంటి మార్పు ఉంటే బాగుంటుందనే విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రిన్సిపాల్ గారు దానికి స్పందిస్తూ పేరెంట్స్ సూచించిన విషయాలను పరిగణనలోకి తీసుకొని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్ధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

విద్యాపరిషత్ కరస్పాండెంట్గా

శ్రీ జి.వై.యన్.బాబు విద్యాపరిషత్ కరస్పాండెంట్ గా చేస్తూ ఆకస్మికంగా 12.8.2000న అమ్మలో కలసిపోయిన సందర్భంలో శ్రీ విశ్వజననీపరిషత్ ఎగ్జిక్యూటీవ్ బాడీ 26 8. 2020 బుధవారం సమావేశమై కాలేజి పూర్వవిద్యార్థిని కాలేజి రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యల్. సుగుణను కరస్పాండెంట్గా పరిషత్ మిగిలిన సమయానికి ఏకగ్రీవంగా ‘నిర్ణయించడమైనది. గమనించగలరు.

డా॥ వి.హనుమంతయ్య గారికి పూర్వ విద్యార్థి సంఘం తరపున స్వాగత సన్మానం

నెల్లూరు వేద సంస్కృత కళాశాల నుంచి మాతృశ్రీ ఓరియంటలే కళాశాల ప్రిన్సిపాల్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డా॥ వి. హనుమంతయ్య గారిని 19-12-19న “పూర్వ విద్యార్థి సమితి” తరపున ప్రార్ధనా మందిరంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు సమక్షంలో ఘనంగా స్వాగత సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ అమ్మ ఆశీస్సులతో, గురువుల క్రమశిక్షణలో విద్యాధికులై దశదిశలా వ్యాపించి అమ్మ తత్త్వ సుగంధాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న (అ) పూర్వ విద్యార్థులు మాతృసంస్థలకు మూలస్థంభాలు లాంటివారని కొనియాడారు

డా॥ వి.హనుమంతయ్య గారికి పూర్వ విద్యార్థి సంఘం తరపున స్వాగత సన్మానం

నెల్లూరు వేద సంస్కృత కళాశాల నుంచి మాతృశ్రీ ఓరియంటలే కళాశాల ప్రిన్సిపాల్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డా॥ వి. హనుమంతయ్య గారిని 19-12-19న “పూర్వ విద్యార్థి సమితి” తరపున ప్రార్ధనా మందిరంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు సమక్షంలో ఘనంగా స్వాగత సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ అమ్మ ఆశీస్సులతో, గురువుల క్రమశిక్షణలో విద్యాధికులై దశదిశలా వ్యాపించి అమ్మ తత్త్వ సుగంధాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న (అ) పూర్వ విద్యార్థులు మాతృసంస్థలకు మూలస్థంభాలు లాంటివారని కొనియాడారు.