పేరెంట్స్ టీచర్స్ మీట్

12.11. 2022 శనివారం వాత్సల్యాలయంలో కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీ పి.గిరిధర్ కుమార్ గారు, డాక్టర్ బి.ఎల్ | సుగుణ గారు, ప్రిన్సిపల్ ఆర్.వరప్రసాద్ గారు, శ్రీ ఎం.దినకర్ గారు, డా॥ యు. వరలక్ష్మి గారు, చిన్నంనాయుడు గారు, రావమ్మ గారు పాల్గొన్నారు. వరప్రసాద్ గారు కళాశాల లక్ష్యాలు పురోగతి ప్రగతి నివేదికలను అందించారు. | సుగుణ గారు మాట్లాడుతూ విద్య కేవలం బతుకు తెరువు కోసమే కాదు జీవిత పరమార్ధాన్ని కూడా తెలుపుతుంది. క్రమశిక్షణతో వివేకంతో మన కళాశాల పూర్వ విద్యార్థులు ఎంతోమంది ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరొంది | ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అమ్మ భావాలకు వారసులై నిలిచా రని అన్నారు.
అనంతరం అమ్మ తనయులు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్యగారు మాట్లాడుతూ “ఇలాంటి వేదికలు ఎన్నో జరగాలని సూచించారు. కళాశాల ప్రస్తుత స్థితిని శ్రీ ఎం. దినకర్ గారు వివరించారు. |అనంతరం డాక్టర్ యు. వరలక్ష్మి గారు మాట్లాడుతూ పూర్వజన్మ సుకృతం వలన మీ పిల్లలను | ఉత్తమంగా తీర్చి దిద్దేందుకే ఈ కళాశాలలో చేర్పించారాని, మన విద్యార్థులు ఉత్తమ పౌరులు కాగలరని తల్లిదండ్రుల నుద్దేశించి పలికారు. గిరిధర కుమార్ గారు మాట్లాడుతూ సమావేశంలో ప్రధాన ఉద్దేశాన్ని వివరించారు. చిన్నంనాయుడు గారు అమ్మ ప్రేరణ మాలో అమృత వాయువులను ప్రవహింప జేస్తుంది కాబట్టే పూర్వ విద్యార్థులమైన మేము పార్వతీపురంలో నిత్యం అన్నప్రసాద వితరణ చేయగలుగుతున్నాము అన్నారు. పూర్వ విద్యార్థిని రావమ్మ గారు మాట్లాడుతూ తాను తన పిల్లలు ఉన్నత స్థానంలో ఉండేలా జీవితాన్ని అందించిన అమ్మకు నమస్సులు తెలిపారు. మొక్క ఎన్నో ఫలాలను ఇచ్చినా మూలం భూమిలోనే ఉంటుంది గనుక విద్యాఫలాలను అందుకున్న వారు మాతృ సంస్థను మరవరాదని అన్నారు. కార్యక్రమంలో ఇంటర్న్ షిప్ ను సజావుగా నడిపించి ఉపాధ్యాయులకు విద్యార్థులకు మార్గదర్శనం చేసిన శ్రీ ఓంకారానంద గిరి స్వామివారిని సన్మానించారు యాజమాన్యం వారు. రాబోయే అమ్మ శతజయంతి ఉత్సవాలకు విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించారు. శాంతిమంత్రం పఠనంతో నాటి కార్యక్రమం ముగిసింది.

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవాలు

12.12.2021 ఉదయం యువసినీ గేయకవి శ్రీ అనంత శ్రీరాం వచ్చి తనూ అమ్మవద్దకు రావటంలోని అదృష్టాన్ని వివరించి సంస్కృతం చదువుకోకపోయాననే బాధ ఉన్నదనీ, ఎప్పటికైనా తీర్చుకుంటానని చెప్పారు. సభాధ్యక్షులుగా డాక్టర్ దామోదరం గణపతిరావు, ఆత్మీయ అతిధిగా శ్రీ వారణాసి ధర్మసూరి ఉచితరీతిన ప్రసంగించారు. శ్రీ మాజేటి రామకృష్ణాంజనేయులు సభా నిర్వహణ చేశారు. శ్రీ గోలి రామచంద్రరావు ఆహ్వానం పలుకగా డాక్టర్. బి.శ్యామల వందన సమర్పణ చేశారు.
12.12.2021 సాయంత్రం ముగింపు సమావేశానికి కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ బి.యల్.సుగుణ అధ్యక్షత వహించారు. గౌరవ అతిధి ప్రఖ్యాత ఆర్థికశాస్త్రవేత్త శ్రీ కుమ్మమూరు నరసింహమూర్తి అమ్మ తనకు. ఏలా విద్యగనిపి పైకి తెచ్చింది చెప్పారు. నాగార్జున విశ్వవిద్యాలయ రెక్టార్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వరప్రసాదమూర్తి ప్రసంగించారు. శ్రీ ఆర్.వరప్రసాద్ సభానిర్వహణ చేశారు. శ్రీ బౌరోతు శంకరరావు ఆహ్వానం పలుకగా శ్రీ ఐ.వి.సుబ్రహ్మణ్య శాస్త్రి వందన సమర్పణ చేశారు.
అందరింటి సభ్యులందరినీ పూర్వవిద్యార్థుల సమితి నూతన వస్త్రాలతో సత్కరించారు. ఈ స్వర్ణోత్సవ వైభవం జిల్లెళ్ళమూడి అందరింటి విశిష్టతకు తగ్గట్టుగా అందరి మన్ననలు అందుకుంది.

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవాలు

11.12.2021 ఉదయం కళాశాల ప్రాంగణంలో “అంత నామకోటిస్థూప” ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థూపాన్ని యానాది రాముడు ఆవిష్కరించగా శ్రీ బ్రహ్మాందం రవీంద్రరావు, శ్రీ బొప్పూడి రామబ్రహ్మం వంటి పెద్దలు అతిథులుగా పాల్గొన్నారు. స్థూపానికి ధనదాతలుగా ఉన్న శ్రీ శిష్టి లక్ష్మీ ప్రసన్నాంజనేయ శర్మ గారు వారి కుటుంబం విచ్చేశారు. శ్రీ ప్రసన్నాంజనేయశర్మగారు తాము కళాశాలలో ఆచార్యులుగా పనిచేసిన నాటి జ్ఞాపకాలు అమ్మతో అనుబంధాలు, విద్యార్థుల దీక్షాదక్షతులు జ్ఞాపకం చేసుకొని అద్భుతంగా ప్రసంగించారు.

ఉదయం జరిగిన సభాకార్యక్రమానికి గన్నవరం భువనేశ్వరీ పీఠాధిపతులు శ్రీ కమలానంద భారతీస్వామి. వారు ఈ జాతి వైభవానికి ఆలయాలు- సంస్కృత భాషాబోధన ఏలా మూలకందలో వివరించారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ ఛైర్పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి సంస్కృతాంధ్రభాషల విశిష్టత దానికి ప్రజలు ప్రభుత్వము చేయవలసిన కృషి వివరించారు. అకాడమీ పాలకమండలి సభ్యులు శ్రీ కప్పగంతు రామకృష్ణ తన విద్యాభ్యాసం నాటి విశేషాలు సంస్కృత కళాశాలల సాధన బోధనలు వివరించారు. సభాధ్యక్షులుగా పూర్వవిద్యార్ధి శ్రీ యం. జగన్నాధం రాగా సభానిర్వహణ పూర్వవిద్యార్ధి శ్రీ గంటేడు చిన్నంనాయుడు సమర్ధవంతంగా నిర్వహించారు. శ్రీ యం. నాగరాజు పూర్వవిద్యార్థి వందన సమర్పణ చేశారు. కళాశాల పూర్వ ప్రస్తుత గురువులను పూర్వవిద్యార్ధి సమితి సత్కరించింది. వారు సందేశాలిచ్చారు ఉచిత రీతిలో,

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవాలు

11.12.2021 మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ఛీఫ్ సెక్రటరీ శ్రీ యల్.వి.సుబ్రహ్మణ్యంగారు. వచ్చి అమ్మతో అనుభవాలు చెప్పి కళాశాలకు తన చేతనైన సాయంచేయటానికి ఎప్పుడూ సిద్ధమే నన్నారు. సభాధ్యక్షులుగా పూర్వవిద్యార్థిని శ్రీమతి పి.వి. రామశర్మ ముఖ్యఅతిధిగా కృష్ణాజిల్లా ఉపాధ్యాయ యం.యల్.సి. శ్రీమతి టి. కల్పలత వచ్చారు. సభానిర్వహణ డాక్టర్ వై.నాగేంద్రమ్మ చేయగా, ఆహ్వానం కుమారి ఎ.మనీషా, వందన సమర్పణ శ్రీ పి.సత్యనారాయణ చేశారు. విద్యార్థులచే అమ్మ నామ సంకీర్తన – సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింప బడ్డాయి.

పొత్తూరి సంస్మరణ సభ

ప్రముఖ పత్రికా సంపాదకులు, సాహితీవేత్త,  శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావుగారి సంస్మరణ సభ 5-08-2020 లో జిల్లెళ్లమూడిలో జరిగింది. విశ్వజననీ పరిషత్ మాజీ ప్రెసిడెంట్ గా ఆయన గురుతర బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించారని, ఆయన లోటు తీరనిదని బ్రహ్మాండం రవిగారు ఆవేదన వ్యక్తం చేశారు.   డిగ్రీ పట్టా లేకపోయినా, తన యొక్క (ప్రతిభా పాటవ ప్రదర్శనలో, శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.  సంస్మరణ సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. హనుమంతయ్య మాట్లాడుతూ పొత్తూరి వారు నైతిక విలువలు కల్గిన పాత్రికేయులనడో సంశయం లేదన్నారు.  సాహిత్య అభివృద్ధికి విశేష సేవలు అందించిన వారుగా పేర్కొన్నారు. ఈ సభలో సంస్థ ప్రెసిడెంట్ దినకర్ గారు మాట్లాడుతూ అమ్మ భక్తుడైన పొత్తూరి వారు సంస్థ శ్రేయోభిలాషిగా మనందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉంటారని తెలియజేశారు. భారతదేశ ప్రధానియైన పి.వి నరసింహరావు గారు తన విదేశీ పర్యటన విశేషాలను తెలియజేయడానికి పొత్తూరి వారే సమర్థులుగా పేర్కొనడం వారి ప్రతిభకు నిదర్శనం అని తెలియచేశారు.పొత్తూరి వారికి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలతో, సంస్థతో విడదీయలేని అనుబంధం ఉందని వారి మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.  నైతికతకు, వ్యక్తిత్వానికి పొత్తూరి వారు జీవితం నిదర్శనం అని కె. వి. కోటయ్య గారుఅన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది. మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థుల వసతి గృహం వద్ద అమ్మ ఆగమనోత్సవం

21.02.2019 న అమ్మ ఆగమనోత్సవం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలోని విద్యార్థుల వసతి గృహం వద్ద అమ్మ పూజ జరిగింది. సంస్థ పెద్దలు శ్రీ. యమ్. దినకర్, శ్రీ. యమ్. శరచ్చంద్ర, దేశిరాజు కామరాజు, రావూరి ప్రసాద్, బి. రామచంద్ర, డా॥ బి.యల్. సుగుణ, చక్కా శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం జరిగింది.