by MOC IQAC | Dec 7, 2024 | Uncategorized
BASIC LIFE SUPPORT
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు చదువుతో పాటు సామాజిక స్పృహ కలిగి ఉండాలని సమాజంలో తాము ఒకరమని ఎప్పుడూ గుర్తుపెట్టుకొని బాధ్యత కలిగి ప్రవర్తించాలనే ఉద్దేశంతో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో మాతృశ్రీ మెడికల్ సెంటర్ మరియు శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ వారు 7-12-2024 , 8-12-2024 శని ఆదివారాలలో రెండు రోజుల పాటు Basic Life Support అనే అంశంపై వర్క్ షాప్ జరిగింది. Assistant Professor Dr. Y Ashok (Anesthesiology) Educational Consultant, Ramesh Hospitals and team ఈ వర్క్ షాప్ ను నిర్వహించింది. ఈ వర్క షాప్ లో 120 మంది విద్యార్థులు అధ్యాపకులు మరియు మెడికల్ సెంటర్ టీమ్ పాల్గొన్నారు. డా. అశోక్ గారు తమ అనుభవంతో కూడిన లెక్చర్ ఇస్తూ రెండు రోజుల పాటు ఉదయం మనం మన చుట్టూ ఉన్న వారిని ఎలాంటి అత్యవసర చికిత్స చేయగలమో తెలిపారు. మధ్యాహ్నం ప్రతి విద్యార్థి చేత ప్రాక్టికల్ గా ఎలా Cardiac Arrest అయిన వారికి CPR చేయవచ్చో వివరించారు. Heart Attack కి Cardiac Arrest కి మధ్య ఉన్న తేడాను గమనించి ఎలా సరైన సమయంలో స్పందించాలో తెలియజెప్పారు. మనం చేసే ప్రయత్నం ఒక నిండు జీవితాన్ని నిలబెడుతుందనే స్పృహ తో మనం ఆలోచన చెయ్యాలని చెప్పారు. విద్యార్థులందరి చేత ప్రాక్టికల్ గా CPR చేయించి వారిని అభినందిస్తూ CERTIFICATES అందించారు. మాతృశ్రీ మెడికల్ సెంటర్ బృందం Dr. జ్ఞానప్రసూన, Dr. ఇనజ కూమారి గార్లు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంస్థ పెద్దలు శ్రీ యమ్. దినకర్ గారు ఈ కార్యక్రమం లో పాల్గొని ఈ కార్యక్రమం ఏర్పాటు పై తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. రామయ్య, భువనేశ్వరి, చాముండేశ్వరి కార్యక్రమంలో పాల్గొన్నారు.
by MOC IQAC | Aug 31, 2024 | Faculty Development Program, Uncategorized
31, ఆగష్టు 2024 శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల లో Student centered teaching methods పై workshop నిర్వహించారు. కమీషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ నుండి డా. కె. విజయబాబు గారు resource person గా విచ్చేశారు. అధ్యాపకులకు రెండు sessions గా ఈ వర్క్ షాప్ ను నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయునిగా తరగతి గదిలో విద్యార్థులు అభ్యాసం చేయడానికి అనుకూలమైన వాతావారణాన్ని ఎలా సృష్టించాలి, విద్యార్థులను ఎలా భాగస్వాములను చేయాలో సవివరంగా తెలిపారు. విద్యార్థి కేంద్రిత అధ్యాపన జరిగినప్పుడే వారికి విమర్శనాత్మక ఆలోచన, సమస్యను పరిష్కరించే విధానం అలవడతాయని తెలిపారు. వీటన్నిటికంటే ముందుగా అధ్యాపకుడు సరైన ప్రణాళికను రూపొందించుకొని విద్యార్థులను ప్రోత్సహించి విద్యావిధానాన్ని మెరుగుపరచుకొని తరగతి గదిలో వర్తింపచేయవలెనని సూచించారు. ఈ వర్క్ షాప్ ద్వారా అధ్యాపకులు తమ బోధనా విలువలను మెరుగుపరచుకునే ప్రయత్నం చేస్తామని అందుకు ఈ వర్క్ షాప్ మరింతగా ఉపకరించిందని తెలిపారు.
by admin | Jul 10, 2023 | Uncategorized
జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జూలై 10 నుండి 27 వరకు విద్యార్థినీ, విద్యార్థులకు సంగీత శిక్షణా కార్యక్రమం జరిగింది. సంస్థ పెద్దలు, అమ్మభక్తులు అయిన శ్రీ రావూరి ప్రసాదరావు ఈ సంగీత శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ ముగింపు సందర్భంగా. జూలై 28 వ తేదీన అన్నపూర్ణాలయం సమావేశ మందిరంలో విద్యార్థినీ, విద్యార్థులు సంగీత కార్యక్రమం నిర్వహించి అమ్మ భక్తి గీతాలను గానం చేశారు. సంగీతం శ్రోతలను అలరించడంతో పాటు ఆనందాన్ని అనుభూతిని అందిస్తుందని సంగీత శిక్షకులు రావూరి ప్రసాదరావు వివరించారు. కళాశాల కరస్పాండెంట్ శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు, సంస్థ పెద్దలు, వసుంధరక్కయ్య, కళాశాల ప్రిన్సిపాల్ డా. బి.యల్ సుగుణ, శ్రీ యమ్. దినకర్, శ్రీ వి. రామచంద్ర, కళాశాల అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ శిక్షణ ఇచ్చిన అమ్మ ఆస్థాన గాయకులు శ్రీ రావూరి ప్రసాదును “ఘనంగా సత్కరించారు. ఈ సంగీత శిక్షణను ఏర్పాటు చేసిన కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.యల్ సుగుణ, సంస్థ స్థానిక కార్యదర్శి శ్రీ.వి.రావు- “చంద్రను అభినందించి ఘనంగా సత్కరించారు
by admin | Nov 12, 2022 | Uncategorized
12.11. 2022 శనివారం వాత్సల్యాలయంలో కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీ పి.గిరిధర్ కుమార్ గారు, డాక్టర్ బి.ఎల్ | సుగుణ గారు, ప్రిన్సిపల్ ఆర్.వరప్రసాద్ గారు, శ్రీ ఎం.దినకర్ గారు, డా॥ యు. వరలక్ష్మి గారు, చిన్నంనాయుడు గారు, రావమ్మ గారు పాల్గొన్నారు. వరప్రసాద్ గారు కళాశాల లక్ష్యాలు పురోగతి ప్రగతి నివేదికలను అందించారు. | సుగుణ గారు మాట్లాడుతూ విద్య కేవలం బతుకు తెరువు కోసమే కాదు జీవిత పరమార్ధాన్ని కూడా తెలుపుతుంది. క్రమశిక్షణతో వివేకంతో మన కళాశాల పూర్వ విద్యార్థులు ఎంతోమంది ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరొంది | ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అమ్మ భావాలకు వారసులై నిలిచా రని అన్నారు.
అనంతరం అమ్మ తనయులు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్యగారు మాట్లాడుతూ “ఇలాంటి వేదికలు ఎన్నో జరగాలని సూచించారు. కళాశాల ప్రస్తుత స్థితిని శ్రీ ఎం. దినకర్ గారు వివరించారు. |అనంతరం డాక్టర్ యు. వరలక్ష్మి గారు మాట్లాడుతూ పూర్వజన్మ సుకృతం వలన మీ పిల్లలను | ఉత్తమంగా తీర్చి దిద్దేందుకే ఈ కళాశాలలో చేర్పించారాని, మన విద్యార్థులు ఉత్తమ పౌరులు కాగలరని తల్లిదండ్రుల నుద్దేశించి పలికారు. గిరిధర కుమార్ గారు మాట్లాడుతూ సమావేశంలో ప్రధాన ఉద్దేశాన్ని వివరించారు. చిన్నంనాయుడు గారు అమ్మ ప్రేరణ మాలో అమృత వాయువులను ప్రవహింప జేస్తుంది కాబట్టే పూర్వ విద్యార్థులమైన మేము పార్వతీపురంలో నిత్యం అన్నప్రసాద వితరణ చేయగలుగుతున్నాము అన్నారు. పూర్వ విద్యార్థిని రావమ్మ గారు మాట్లాడుతూ తాను తన పిల్లలు ఉన్నత స్థానంలో ఉండేలా జీవితాన్ని అందించిన అమ్మకు నమస్సులు తెలిపారు. మొక్క ఎన్నో ఫలాలను ఇచ్చినా మూలం భూమిలోనే ఉంటుంది గనుక విద్యాఫలాలను అందుకున్న వారు మాతృ సంస్థను మరవరాదని అన్నారు. కార్యక్రమంలో ఇంటర్న్ షిప్ ను సజావుగా నడిపించి ఉపాధ్యాయులకు విద్యార్థులకు మార్గదర్శనం చేసిన శ్రీ ఓంకారానంద గిరి స్వామివారిని సన్మానించారు యాజమాన్యం వారు. రాబోయే అమ్మ శతజయంతి ఉత్సవాలకు విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించారు. శాంతిమంత్రం పఠనంతో నాటి కార్యక్రమం ముగిసింది.
by admin | Dec 12, 2021 | Uncategorized
12.12.2021 ఉదయం యువసినీ గేయకవి శ్రీ అనంత శ్రీరాం వచ్చి తనూ అమ్మవద్దకు రావటంలోని అదృష్టాన్ని వివరించి సంస్కృతం చదువుకోకపోయాననే బాధ ఉన్నదనీ, ఎప్పటికైనా తీర్చుకుంటానని చెప్పారు. సభాధ్యక్షులుగా డాక్టర్ దామోదరం గణపతిరావు, ఆత్మీయ అతిధిగా శ్రీ వారణాసి ధర్మసూరి ఉచితరీతిన ప్రసంగించారు. శ్రీ మాజేటి రామకృష్ణాంజనేయులు సభా నిర్వహణ చేశారు. శ్రీ గోలి రామచంద్రరావు ఆహ్వానం పలుకగా డాక్టర్. బి.శ్యామల వందన సమర్పణ చేశారు.
12.12.2021 సాయంత్రం ముగింపు సమావేశానికి కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ బి.యల్.సుగుణ అధ్యక్షత వహించారు. గౌరవ అతిధి ప్రఖ్యాత ఆర్థికశాస్త్రవేత్త శ్రీ కుమ్మమూరు నరసింహమూర్తి అమ్మ తనకు. ఏలా విద్యగనిపి పైకి తెచ్చింది చెప్పారు. నాగార్జున విశ్వవిద్యాలయ రెక్టార్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వరప్రసాదమూర్తి ప్రసంగించారు. శ్రీ ఆర్.వరప్రసాద్ సభానిర్వహణ చేశారు. శ్రీ బౌరోతు శంకరరావు ఆహ్వానం పలుకగా శ్రీ ఐ.వి.సుబ్రహ్మణ్య శాస్త్రి వందన సమర్పణ చేశారు.
అందరింటి సభ్యులందరినీ పూర్వవిద్యార్థుల సమితి నూతన వస్త్రాలతో సత్కరించారు. ఈ స్వర్ణోత్సవ వైభవం జిల్లెళ్ళమూడి అందరింటి విశిష్టతకు తగ్గట్టుగా అందరి మన్ననలు అందుకుంది.
by admin | Dec 11, 2021 | Uncategorized
11.12.2021 ఉదయం కళాశాల ప్రాంగణంలో “అంత నామకోటిస్థూప” ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థూపాన్ని యానాది రాముడు ఆవిష్కరించగా శ్రీ బ్రహ్మాందం రవీంద్రరావు, శ్రీ బొప్పూడి రామబ్రహ్మం వంటి పెద్దలు అతిథులుగా పాల్గొన్నారు. స్థూపానికి ధనదాతలుగా ఉన్న శ్రీ శిష్టి లక్ష్మీ ప్రసన్నాంజనేయ శర్మ గారు వారి కుటుంబం విచ్చేశారు. శ్రీ ప్రసన్నాంజనేయశర్మగారు తాము కళాశాలలో ఆచార్యులుగా పనిచేసిన నాటి జ్ఞాపకాలు అమ్మతో అనుబంధాలు, విద్యార్థుల దీక్షాదక్షతులు జ్ఞాపకం చేసుకొని అద్భుతంగా ప్రసంగించారు.
ఉదయం జరిగిన సభాకార్యక్రమానికి గన్నవరం భువనేశ్వరీ పీఠాధిపతులు శ్రీ కమలానంద భారతీస్వామి. వారు ఈ జాతి వైభవానికి ఆలయాలు- సంస్కృత భాషాబోధన ఏలా మూలకందలో వివరించారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ ఛైర్పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి సంస్కృతాంధ్రభాషల విశిష్టత దానికి ప్రజలు ప్రభుత్వము చేయవలసిన కృషి వివరించారు. అకాడమీ పాలకమండలి సభ్యులు శ్రీ కప్పగంతు రామకృష్ణ తన విద్యాభ్యాసం నాటి విశేషాలు సంస్కృత కళాశాలల సాధన బోధనలు వివరించారు. సభాధ్యక్షులుగా పూర్వవిద్యార్ధి శ్రీ యం. జగన్నాధం రాగా సభానిర్వహణ పూర్వవిద్యార్ధి శ్రీ గంటేడు చిన్నంనాయుడు సమర్ధవంతంగా నిర్వహించారు. శ్రీ యం. నాగరాజు పూర్వవిద్యార్థి వందన సమర్పణ చేశారు. కళాశాల పూర్వ ప్రస్తుత గురువులను పూర్వవిద్యార్ధి సమితి సత్కరించింది. వారు సందేశాలిచ్చారు ఉచిత రీతిలో,