అంబేద్కర్ జయంతి వారోత్సవాలు

అంబేద్కర్ 134వ జయంతి వారోత్సవాలు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు ‘రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర’ అనే అంశంపై వక్తృత్వం, వ్యాసరచన పోటీలు జరిగాయి. అనంతరం జరిగిన సభలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. ఎ. హనుమత్ ప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలంటే అందరూ ఐకమత్యంతో ఉండాలని,  కుల మత వర్గ వర్ణ విచక్షణ లేకుండా అందరూ కలిసిమెలిసి ఐకమత్యంతో జాతి సమైక్యతకు పాటుపడాలని వివరించారు.  ఇదే సభలో సంస్కృత శాఖాధ్యాక్షలు డాక్టర్.ఆర్.వరప్రసాద్ విద్య అనేది ఒక శక్తి అనీ, దానిని అంబేద్కర్ ఒక ఆయుధంగా మార్చుకొని  అణగారిన వర్గాల కోసం క్రొత్తదారులను ఎలా సృష్టించారో తెలియజేశారు. ఈ సమావేశంలో కళాశాల చరిత్ర ఉపన్యాసకులు శ్రీ పి.సుందరరావు గారు అంబేద్కర్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని, విద్యాశక్తితో తన జీవితం మార్చుకొని కోట్లాది మందికి ఎలా ఆదర్శంగా నిలిచారో వివరించి, రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ యొక్క ముఖ్యమైన పాత్రను విద్యార్థులందరికీ తెలియజేశారు. అనంతరం శాంతి మంత్రంతో  ఈ సమావేశం ముగిసింది.`