National Deworming Day

National Deworming Day

10.02.2025 సోమవారం National Deworming Day సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల లో WOMEN EMPOWERMENT CELL తరపున Health Care Program జరిగింది. జిల్లెళ్ళమూడి గ్రామ ఆశావర్కర్ శ్రీలక్ష్మి మరియు నర్స్ మానసలు విద్యార్థులకు నులిపురుగు మందు పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ పోషకాహారాన్ని తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని, శారీరక మానసిక బలం చేకూరినప్పుడే విద్యలో గాని జీవితం లో గాని నాణ్యతను పెంపొందించుకోగలమని వివరించారు. డా. యల్. మృదుల మరియు అధ్యాపక బృందం విద్యార్థులను నులిపురుగు మందు పంపిణీ చేయడంలో సహకరించారు.

 

Republic Day

Republic Day

Republic Day

జనవరి 26, 2025 ఆదివారం ఉదయం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నదానం హనుమత్ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీ గోలి లక్ష్మయ్య (గుంటూరు డి.యస్.పి, క్రైమ్ బ్రాంచ్) గారు విశిష్ఠాతిథిగా మరియు శ్రీమన్నారాయణ (పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేటర్) ముఖ్య అతిథిగా విచ్చేశారు. SVJP TRUST Temples Trusty శ్రీ యమ్. సాయిబాబా గారు Trust Member  శ్రీ లక్కరాజు సత్యనారాయణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గోలి లక్ష్మయ్య గారు జెండావందనం చేసి జ్ఞానంతో నిండిన విద్యను అభ్యసిస్తూ ప్రతి పనిలో ముందడుగు వేయాలని విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం శ్రీమన్నారాయణ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ స్వీయ రాజ్యాంగాన్ని లిఖించుకొని సరైన మార్గంలో నడిస్తే మన భారతదేశం మరింత పురోగతిని సాధించగలదని వివరించారు.

ఇదే వేదికపై అమ్మభక్తులు శ్రీ తంగిరాల కేశవమూర్తి మరియు శారద గార్ల స్మృత్యర్థం వారి కుమారులు శ్రీ తంగిరాల తేజోమూర్తి గారు వేదం,సంస్కృతం మరియు తెలుగు విభాగాలలో ఉత్తమ ప్రదర్శన కనబరచిన వారికి బహుమతి ప్రదానం చేశారు. ఈ బహుమతులను వారి సోదరి శ్రీమతి హైమ దంపతులు స్వయంగా విచ్చేసి పోటీ ప్రపంచానికి అనుగుణంగా మన కళాశాల విద్యార్థులు కూడా తయారవ్వాలని సూచించారు.

75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా విద్యార్థులకు 23 వ తేదీ శుక్రవారం నాడు క్విజ్ వ్యాసరచన మరియు గ్రూప్ డిస్కర్షన్ పోటీలు  నిర్వహించబడ్డాయి. గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తిని పెంపొందించే పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. మిఠాయి పంపిణీ తో కార్యక్రమం ముగిసింది.

On Sunday, January 26, 2025, Matrusri Oriental College celebrated the 76th Republic Day with great enthusiasm. The event was presided over by Principal Dr. Annadanam Hanumath Prasad. The Chief Guest was Sri Goli Lakshmaiah (DSP, Crime Branch, Guntur), and the Special Guest was Sri Mannara Narayana, renowned Personality Development Motivator.

Sri Goli Lakshmiya addressed gathering emphasizing the importance of acquiring knowledge and striving for excellence in every endeavor. Srimannarayana inspired the students by highlighting the need for individuals to create their own path and contribute to India’s progress.

As part of the celebrations, Sri Tangirala Kesavamurthy’s son, Sri Tangirala Tejomurthy presented awards to students who excelled in Vedas, Sanskrit, and Telugu. The awards were handed out by his sister Smt. Hyma and her husband, emphasizing the importance of preparing for a competitive world.

To commemorate 75 years of the college, a series of events, including quiz, Essay writing and group discussion competitions were organized on 24th January. The Republic Day celebration concluded with vibrant cultural programs performed by students promoting patriotism, followed by distribution sweets.

 

National Voters Day

National Voters Day

జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు జిల్లెళ్ళమూడి గ్రామసమీపంలో ఉన్న అప్పాపురం గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు, యువతకు ఓటు యొక్క ప్రాధాన్యత తెలుసుకొని అందరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేయించుకోవాలని ప్రజాస్వామ్యంలో ఇది తప్పనిసరి అని అందరికీ అవగాహన కల్పించారు.అప్పాపురం గ్రామ సచివాలయం నుండి మాతృశ్రీ ఓరియంటల్  కళాశాల విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి గ్రామంలోని అన్ని వార్డులను సందర్శించి  గ్రామస్థులకు ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. అంతేకాక యువత అందరూ కూడా దేశ భవిష్యత్తు నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తారు కనుక అందరిని ఓటు నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మరియు గ్రామ సచివాలయం కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరూ సహకరించారు. అప్పాపురం గ్రామ సర్పంచ్ మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అందిస్తున్న సామాజిక స్పృహను అభినందిస్తూ కళాశాల వాలంటీర్స్ అందరిని కూడా అభినందించారు.

 

Library Week Celebrations | గ్రంథాలయ వారోత్సవాలు

Library Week Celebrations | గ్రంథాలయ వారోత్సవాలు

గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వివిధ కార్యక్రమాలు జరిగాయి.  విద్యార్థులలో విజ్ఞానాన్ని పెంపొందించి వారిలో ఆలోచనా పరిధిని విస్తృతం చేసేందుకు గాను 14,15,16  తేదీలలో ఈ కార్యక్రమాలు జరిపారు.

మొదటి రోజు శ్రీ M. S. శరచ్చంద్రగారు ఆన్ లైన్ ద్వారా ప్రసంగిస్తూ విద్యార్థులకు గ్రంథాలయాల ప్రాముఖ్యతను మరియు మన కళాశాలలో ఉన్న అమూల్యమైన సంస్కృతాంధ్ర గ్రంథాలను వినియోగించుకోవాలని తెలియజేశారు.   అనంతరం సంస్కృతాంధ్ర గ్రంథాల ప్రదర్శన విద్యార్థులకు విశేషంగా ఆకట్టుకుంది. వివిధ గ్రంథాలను పరిశీలించడం ద్వారా వారు కొత్త విజ్ఞానాన్ని పొందగలిగారు.

రెండవ రోజు విద్యార్థులకు వ్యాసరచన మరియు వక్త్రత్వ పోటీలు జరిగాయి. PDC మరియు DEGREE స్థాయిలలో జరిగిన ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మూడవ రోజు సాయంత్రం కళాశాల ఉప ప్రాచార్యురాలు శ్రీమతి L. మృదుల గారి ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ జరిగింది. ఈ సభలో వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడంతో పాటు BEST LIBRARY USER AWARD అందించారు. Librarian R. రమ్య మూడురోజులపాటు విద్యార్థులను ఉత్సాహపరచి గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోమని సూచించారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా పుస్తక పఠనంతో జ్ఞానాభివృద్ధిని పెంపొందించుకోవాలని అధ్యాపకులు సూచించారు.

 

Teacher’s Day | ఉపాధ్యాయదినోత్సవం

Teacher’s Day | ఉపాధ్యాయదినోత్సవం

ఉపాధ్యాయదినోత్సవం

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల లో 2024, సెప్టెంబర్ 5 వ తేదీ గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వినూత్నమైన విద్యాబోధనను అందించడానికి విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేందుకు చొరవ చూపించారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉపాధ్యాయపాత్రలను పోషించి తమ జూనియర్ విద్యార్థులకు బోధించడానికి అవకాశం ఇవ్వబడింది.  ఈ విధంగా participative learning ద్వారా విద్యార్థులు విద్యాబోధనకు ముందుగా planning, presentation, communication, and interaction వంటి చర్యలలో కావలసిన నైపుణ్యాలను తెలుసుకున్నారు. విద్యార్థులను ఉపాధ్యాయుల పాత్రలను పోషించేందుకు అవకాశం కల్పించడం ద్వారా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చే collaborative learning  మరియు Peer to peer interaction పై దృష్టి సారించేందుకు ఎంతగానో ఉపకరించింది. విద్యార్థులు తమ గురుభక్తిని తెలుపుతూ గురువులను అందరినీ సత్కరించారు. విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంత్యుత్సవాన్ని తమ చేతుల మీదుగా నిర్వహించి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. తరగతి గదులలో విద్యాబోధన జరుగుతున్న విధానం నుంచి సాయంత్రం సభానిర్వహణ వరకు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ డా. యల్. మృదుల గారి పర్యవేక్షణలో జరిగింది. అధ్యాపకులందరూ విద్యార్థులకు ఆశీర్వాద వచనాలను అందించారు.

 

National Sports Day

National Sports Day

Brief Report: –

            To commemorate National Sports Day Matrusri Oriental College, Jillellamudi has organized series of competitions for both boys and girls the events were designed to promote teamwork and physical fitness among students

Details of Events:

 Boys:

  • Chess
  • Carroms
  • Wallyball

Girls:

  • Carroms
  • Chess
  • Shot put
  • Lemon & Spoon
  • Rope Game

The students are actively participated in all events

      జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్లమూడి విద్యార్ధిని విద్యార్ధులకు అనేక పోటీలను నిర్వహించింది. ఈ పోటీలలో పాల్గొనడం ద్వారా విద్యార్ధులు శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోగలరు. ఈ పోటీలలో  విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు.

పోటీల వివరాలు:

  • వాలీబాల్
  • క్యారమ్స్
  • చెస్
  • షాట్ పుట్
  • లెమన్ & స్పూన్
  • రోప్ గేమ్