మాతృశ్రీ ఓరియంటల్  కళాశాల – పూర్వ విద్యార్థుల సమావేశం

 మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం 2025 మే 5న కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. ఆన్నదానం హనుమత్ ప్రసాద్, అధ్యాపకులు మరియు పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. గౌరవనీయులు శ్రీ దినకర్ అన్నయ్యగారు పాల్గొన్నారు. సమావేశంలో పూర్వ విద్యార్థుల తమ అనుభవాలను పంచుకున్నారు. వారు సమాజంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తుచేశారు. ముఖ్యంగా పార్వతీపురం, పాలకొండ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని వివరించారు.

  1. పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అందించే అంశంపై చర్చ జరిగింది.
  2. ఆర్థికంగా బలహీనమైన విద్యార్థులకు ఉచిత విద్య అందించాలన్న అంశాన్ని పరిశీలించారు.
  3. విద్యార్థులను ఉత్తమంగా ప్రోత్సహించడానికి గోల్డ్ మెడల్స్ కొనసాగించాలంటూ పూర్వ విద్యార్థులు సూచించారు.
  4. కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెంచే విధానాలను చర్చించారు.
  5. కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం కోసం, మేనేజ్మెంట్ బ్రోచర్లు మరియు ఇతర ప్రచార సామాగ్రిని పంచింది.
  6. కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి. రాఘవేంద్రరావు గారు అనారోగ్య కారణంగా జరిగిన ఆకస్మిక మరణం పట్ల సంతాపం వ్యక్తం చేయబడింది.
  7. శ్రీమాన్ ఎస్. వి. రామకృష్ణమాచార్యులు గారికి (మాతృశ్రీ పాఠశాల రిటైర్డ్ హెడ్మాష్టర్) సంతాపం తెలిపారు.
  8. ప్రస్తుత విద్యార్థులకు ఇచ్చే భోజన నాణ్యతపై పూర్వ విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు.
  9. కళాశాల ప్రస్తుత విద్యార్థుల సంఖ్యపై చర్చించి, అభివృద్ధికి అనేక సూచనలు చేశారు.

పూర్వ విద్యార్థుల విరాళాలు:

 శ్రీ సూర్యరావు గారు (1986–1991 బ్యాచ్):  శ్రీ విశ్వజనని ట్రస్ట్, జిల్లెళ్ళమూడికి రూ. 1 లక్ష విరాళంగా అందించారు, ఇది ప్రస్తుత విద్యార్థుల అన్నదాన కార్యక్రమానికి ఉపయోగపడుతుంది.

  1. డా. ఎం. రామకృష్ణాంజనేయులు గారు (1985–1992 బ్యాచ్): కళాశాలకు రూ. 10,000 (పది వేల రూపాయలు) విరాళంగా అందించారు.
  2. ఈ సమావేశం పూర్వ విద్యార్థుల కళాశాల పట్ల ఉన్న బంధాన్ని, వారి సేవా దృక్పథాన్ని ప్రతిబింబించింది. కళాశాల అభివృద్ధి కోసం అందరూ కట్టుబడి ఉన్నారు.