విద్యార్థుల సంక్షేమం, సమాజ పట్ల బాధ్యతను అవగాహన కల్పించేందుకు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి వారు 26-06-2025 గురువారం EAGLE CLUB మరియు NSS UNIT సంయుక్త ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేటూరు గ్రామ సచివాలయం మహిళా కానిస్టేబుల్ విజయలక్ష్మి గారు విచ్చేసి మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, చట్టపరమైన పరిణామాలు, సమాజంపై ప్రభావం వంటి విషయాలను వివరించారు. ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు అధ్యక్షత వహించి, యువత మత్తుమందులకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలన్న సందేశాన్ని ఇచ్చారు. సంస్కృత విభాగాధిపతి Dr. RVNSS వరప్రసాద్ గారు విద్యార్థులను ఉద్దేశించి భారతీయ జ్ఞానపరంపరలోని నైతిక విలువలు, మానసిక స్థైర్యం గురించి ప్రేరణాత్మకంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని NSS Convener శ్రీ T.జయకృష్ణ గారు నిర్వహించారు. NSS స్వచ్ఛంద సేవలో విద్యార్థులు చురుకుగా పాల్గొని మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, సమాజంలో ఈ అవగాహనను పెంపొందించాలనే ప్రతిజ్ఞ చేశారు. శాంతిమంత్రం తో కార్యక్రమం ముగిసింది.