by MOC IQAC | Mar 7, 2025 | International Commemorative Days
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ది 7.3.2025 శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభా కార్యక్రమం జరిగింది. ఈ సభకు కళాశాల వైస్ ప్రిన్సిపల్ Dr. L. మృదుల అధ్యక్షత వహించారు. మహిళా సాధికారతను గురించి వివరించారు. ముఖ్య అతిథిగా కళాశాల పూర్వ విద్యార్థి మరియు లాల్ బహదూర్ శాస్త్రి కేంద్రీయ విశ్వవిద్యాలయం Assistant professor Dr. B. కామాక్షమ్మ గారు ఆన్లైన్ లో స్టూడెంట్స్ కి వేదకాలం మరియు నేటి కాలం యొక్క మహిళల గురించి వివరించారు. తెలుగు అధ్యాపకులు వీరాంజనేయులు గారు మహిళలను గురించిన ప్రేరణదాయకమైన గీతాన్ని ఆలపించారు. కళాశాల ప్రాచార్యులు Dr అన్నదానం. హనుమత్ ప్రసాద్ గారు ఆయా యుగాలలో జన్మించిన మహిళా మణులను వారి గొప్పతనాన్ని కొనియాడారు. ఈ సభకు ఆత్మీయ అతిథి Dr. J. Gnana prasuna గారు గొప్ప గొప్ప మహిళల గురించి వివరించారు. మహిళా దినోత్సవ సందర్భముగా జరిపిన రంగవల్లుల పోటీలలో విజేతలైన విద్యార్థులకు, మహిళా అధ్యాపకులకు బహుమతి ప్రదానం జరిగింది.
సంస్కృత అధ్యాపకులు డా. R.వరప్రసాద్ గారి పర్యవేక్షణలో కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపక అధ్యాపకేతర మహిళామణులకు సన్మాన కార్యక్రమం జరిగింది, ఈ సభను ఆంగ్ల అధ్యాపకులు శ్రీమతి M. కవిత చక్కగా నిర్వహించారు, శాంతి మంత్రంతో సభ ముగిసింది.

by MOC IQAC | Feb 21, 2025 | International Commemorative Days
అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల మరియు సమైక్య భారతి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21, శుక్రవారం అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ సభాకార్యక్రమం జరిగింది. కళాశాల కరస్పాండెంట్ శ్రీ గోగినేని రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో అయినాల మల్లేశ్వరరావు గారు గౌరవ అతిథి గా విచ్చేశారు. మల్లేశ్వరరావు గారు మాట్లాడుతూ ఆంగ్లభాష ఉదరభాష మాతృభాష హృదయభాష అనీ, తల్లి ఒడిలో ఓనమాలు దిద్దిన వారు మాతృభాషను మరువరాదనీ అన్నారు. ఒక వ్యక్తి సంఘటిత శక్తి గా మారితే మాతృభాష పరిరక్షణ సుసాధ్యమని పలికారు. సహజకవి కావడంతో తమదైన శైలిలో సీస పద్యాలను ఆలపించి విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. అనంతరం శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రష్ట్ సభ్యులు శ్రీ యమ్. దినకర్ గారు మాట్లాడుతూ భాషలకు సంబంధించిన ఉద్యమాలు గానీ భాషాబోధనలు కానీ టెక్నాలజీ తో కలిపి ముందుకు తీసుకువెళ్ళాలని అప్పుడే భాష గొప్పతనం అందరికీ చేరుతుందనీ సూచించారు.
సమైక్యభారతి జాతీయ సమన్వయకర్త శ్రీ పి. కన్నయ్య గారు మాట్లాడుతూ తెలుగువాడి ఉనికి యావద్భారతదేశం లోనూ కనిపిస్తుంది కానీ తెలుగువాడి శక్తి సత్తా మరింత చాటి చెప్పాల్సిన అవసరం ఉన్నదనీ తెలిపారు. 2000 సం లో తీసుకున్న నిర్ణయం తో సమైక్యభారతి ని ఏర్పాటు చేసి మాతృభాష పునరుద్ధరణ, కుటుంబవ్యవస్థ పరిరక్షణ లక్ష్యంగా నిర్విరామమైన కృషి చేస్తున్నామని వివరించారు. అంతేకాక మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల మరియు సమైక్య భారతి సంయుక్తంగా మాతృభాష ను పరిరక్షించడం లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల తెలుగు విభాగాధిపతి డా. యల్. మృదుల మరియు సంస్కృత శాఖాధిపతి డా. ఆర్. వరప్రసాద్ గారు మాతృభాష గొప్పదనాన్ని తెలిపారు. విద్యార్థులు పద్యాల అంత్యాక్షరి తో నృత్యప్రదర్శనలతో మాతృభాష గొప్పదనాన్ని తెలిపారు.
ఇదే వేదికపై నాన్నగారి ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని కళాశాలలోని విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల ఆటలపోటీలలో విజేతలకు అమ్మ తనయులు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు ట్రోఫీలను, పతకాలను మరియు ధృవపత్రాలను అందించారు. తెలుగు ఉపన్యాసకులు జి. వీరాంజనేయులు గారు సభానిర్వహణ చేయగా జె. జయకృష్ణ గారు వందన సమర్పణ చేశారు. శాంతిమంత్రంతో కార్యక్రమం ముగిసింది.
by admin | Jun 21, 2024 | International Commemorative Days, Yoga
యోగేన యోగో జ్ఞాతవ్యో – యోగో యోగాత్ ప్రవర్తతే !
యో2ప్రమత్తస్తు యోగేన – స యోగీ రమతే చిరమ్ !!
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ యోగాధ్యాపకురాలు శ్రీమతి డా. చుండూరు నాగసాయి అనూష గారు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా హిస్టరీ విభాగం పక్షాన ఏర్పాటు చేయబడిన సభా కార్యక్రమంలో ప్రిన్పిపాల్ డా.అన్నదానం హనుమత్ప్రసాద్ గారు అధ్యక్షభాషణం చేస్తూ యోగా అనేది మానసిక, శారీరక రుగ్మతలనుండి దూరం చేయగలదని వివరించారు. ముఖ్యంగా స్రీలకు వచ్చే అనారోగ్యాలు సులభమైన ఆసనాలతో నివారించుకోవచ్చని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథి శ్రీమతి అనూష గారు అష్టాంగయోగాలను సవివరంగా తెలిపి ప్రత్యక్షంగా ఆసనాలు వేసి ప్రాణాయామాలలో రకాలను తెలిపి వాటిద్వారా అనేక రుగ్మతలకు ఉన్న నివారణోపాయాలను వివరించారు. నిత్యజీవితంలో యోగాతో అనుబంధం కలిగి ఉంటే రోగాలతో బంధ హీనులం కావచ్చని సూచించారు. ఆధునిక మానవ జీవన శైలి లో యోగాభ్యాసాన్ని అలవరచుకున్నట్లైతే చిరకాలం జీవించగలమన్నారు. హిస్టరీ ఉపన్యాసకులు శ్రీ పి. సుందరరావు గారు సభాసంచాలనం చేస్తూ యోగా ప్రత్యేకతను గుర్తించి గత పది సంవత్సరాలుగా అనేకవిధాలైన కాన్సెప్ట్ లతో ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం ముదావహమని తెలిపారు. అనంతరం విద్యార్థుల యోగాసనాల ప్రదర్శన జరిగింది. కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
by admin | Aug 31, 2023 | International Commemorative Days
Viswa Samskrutha Basha Dinothsavam
విశ్వసంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సభకు ముఖ్య అతిథిగా సంస్కృత భారతి అఖిల భారత బాలకేంద్ర ప్రముఖులు, విజయవాడ SSR&CVR కళాశాల సంస్కృత ఉపన్యాసకులు శ్రీ ఉపద్రష్ట వేంకట రమణమూర్తి గారు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
సంస్కృతం అనేది ప్రాచీన భాష మాత్రమే కాదు నిత్య నూతనమైన భాష అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో, జన జీవనంలో సంస్కృతం ఎలా ఇమిడిపోయి వున్నదో వివరించి విద్యార్థులకు భాషపై మక్కువ ఆసక్తి కలిగించారు.
కార్యక్రమంలో మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా విద్యార్థులు సంస్కృతంలో ప్రసంగాలను, శ్లోకపఠనాన్ని చేశారు. భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే నృత్య ప్రదర్శనలు జరిగాయి.
సభాకార్యక్రమాన్ని ఆసాంతం సంస్కృత భాషలో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.అన్నదానం హనుమత్ప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు. సంస్కృతోపన్యాసకులు డా.ఆర్ వరప్రసాద్ గారు సభా కార్యక్రమాన్ని నిర్వహించారు
by admin | Aug 30, 2023 | International Commemorative Days
30-8-2023 న విశ్వసంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సభకు ముఖ్య అతిథిగా సంస్కృత భారతి అఖిల భారత బాలకేంద్ర ప్రముఖులు, విజయవాడ SSR & CVR కళాశాల సంస్కృత ఉపన్యాసకులు శ్రీ ఉపద్రష్ట వేంకట రమణమూర్తి గారు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సంస్కృతం అనేది ప్రాచీనభాష మాత్రమే కాదు నిత్య నూతనమైన భాష అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో, జన జీవనంలో సంస్కృతం ఎలా ఇమిడిపోయి వున్నదో వివరించి విద్యార్థులకు భాషపై మక్కువ ఆసక్తి కలిగించారు. కార్యక్రమంలో మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా విద్యార్థులు సంస్కృతంలో ప్రసంగాలను, శ్లోకపఠనాన్ని చేశారు. భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే నృత్య ప్రదర్శనలు జరిగాయి. సభాకార్యక్రమాన్ని ఆసాంతం సంస్కృత భాషలో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు. సంస్కృతోపన్యాసకులు డా.ఆర్.వరప్రసాద్ గారు సభా కార్యక్రమాన్ని నిర్వహించారు.
by admin | Mar 8, 2022 | International Commemorative Days
మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని మనం ఎంచుకున్న రంగంలో పురోగతిని సాధించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారి సతీమణి రమాదేవి పేర్కొన్నారు. 08.03.22 మంగళవారంనాడు మహిళాదినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడి మరియు రోటరీ క్లబ్ బాపట్ల సంయుక్త ఆధ్వర్యంలో కళాశాలలో డాక్టర్ మృదుల స్వాగత వచనాలతో సభ ప్రారంభం అయింది. ఆ సభలో శ్రీమతి రమాదేవి మాట్లాడుతూ మహిళలు చైతన్యవంతులుగా ఉంటే సమాజం పురోభివృద్ధిని సాధిస్తుందని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ రావినూతల వరప్రసాద్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో అన్నె శివకుమారి గారు ఉమెన్స్ సెల్ ఆఫ్ రోటరీ క్లబ్ మాట్లాడుతూ లింగభేదం లేకుండా అన్ని రంగాలలో స్త్రీలు ప్రవేశించినట్లైతే ఆర్ధిక ప్రగతిని సాధించవచ్చునని గణాంకాలతో వివరించారు. రోటరీక్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాసుగారు మంచి సంస్కారంతో ఉన్న విద్యార్థులను చూసి ఆనందించి సంస్కృతం మరియు తెలుగులో ఎక్కువ మార్కులు సాధించినవారికి ప్రమాణ పత్రాలను అందించారు. పి.గిరిధర్ కుమార్ గారు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో విశ్వజననీపరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ ఐ. రామకృష్ణగారు మాట్లాడుతూ స్త్రీ తల్లిగా చెల్లిగా సేవామూర్తిగా నేడు అందరి మన్ననలు పొందుతూ ముందుకు వెళుతుందని వివరించారు. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరిగా సంస్కృతోపన్యాసకురాలు డా॥ వి.పావని వందన సమర్పణ గావించారు. శాంతిమంత్రాలతో కార్యక్రమం ముగిసింది.