by admin | Dec 15, 2019 | Programs
ఆంధ్రరాష్ట్ర అవతరణకు ప్రాణాలు సైతం లెక్కచేయక అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా 15.12.19 ఆదివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో కళాశాల ప్రిన్సిపాల్ డా॥ వి. హనుమంతయ్య గారు మాట్లాడుతూ అంతరాలు లేని జీవితం అందరికీ అందాలని కలలుకన్న ప్రాణత్యాగి పొట్టి శ్రీరాములు గారని తెలియజేశారు. లక్షమందిని ఏక పంక్తిన భోజనం చేస్తే చూడాలనుకున్న అమ్మ ఆశయం మహాద్భుతమైనదని ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు. విశ్రాంత ప్రిన్సిపల్ గారు డా॥ బి.ఎల్.సుగుణ, అధ్యాపకులు డా॥ కె.వి.కోటయ్యగారు భక్తిప్రపత్తులతో శ్రీరాములుగారి చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.
by admin | Dec 12, 2019 | Alumni Interaction
“ఆకలే అర్హత”గా అన్నం పెట్టమన్న విశ్వజననీ అమ్మ ఆశయాలకు అనుగుణంగా కళాశాల మరియు పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని 12.12.2019 గురువారం నుండి కళాశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అమ్మ ఆశీస్సులతో మరియు సంస్థవారి సహాయ సహకారాలతో నిర్విరామంగా కొనసాగాలని కళాశాల ప్రిన్సిపాల్ డా॥ వి.హనుమంతయ్య ఆశించారు. ప్రిన్సిపాల్ గారు నూతనంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి స్పందిస్తూ కొంతమంది కళాశాల పూర్వ విద్యార్థి సంఘం తరపున వారి సహకారాన్ని అందిస్తామని మాట ఇస్తూ తొలుతగా రూ. 2000/ నగదును ప్రిన్సిపాల్ గారికి అందజేశారు.
by admin | Dec 12, 2019 | Orientation Programm
“ఆకలే అర్హత”గా అన్నం పెట్టమన్న విశ్వజననీ అమ్మ ఆశయాలకు అనుగుణంగా కళాశాల మరియు పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని 12.12.2019 గురువారం నుండి కళాశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అమ్మ ఆశీస్సులతో మరియు సంస్థవారి సహాయ సహకారాలతో నిర్విరామంగా కొనసాగాలని కళాశాల ప్రిన్సిపాల్ డా॥ వి.హనుమంతయ్య ఆశించారు. ప్రిన్సిపాల్ గారు నూతనంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి స్పందిస్తూ కొంతమంది కళాశాల పూర్వ విద్యార్థి సంఘం తరపున వారి సహకారాన్ని అందిస్తామని మాట ఇస్తూ తొలుతగా రూ. 2000/ నగదును ప్రిన్సిపాల్ గారికి అందజేశారు
by admin | Dec 9, 2019 | Vanam - Manam
ఈ రోజు అనగా డిసెంబర్ 9 వ తేదిన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ‘వనం ‘మనం’ కార్యక్రమం కింద ప్రిన్సిపాల్ డా. వి.హనుమంతయ్యగారి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్ధులు పాల్గొన్నారు. చెట్లను పెంచితే పర్యావరణ పరిరక్షణతో పాటు సహజ పరిరక్షణ కూడా జరుగుతుందని హనుమంతయ్య గారు వివరించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు అందరూ కలిసి కళాశాల విశాలమైన ప్రాంగణంలో మొక్కలు నాటి విద్యార్థులను ఉత్సాహపరిచారు.
by admin | Dec 9, 2019 | Vanam - Manam
ఈ రోజు అనగా డిసెంబర్ 9 వ తేదిన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ‘వనం ‘మనం’ కార్యక్రమం కింద ప్రిన్సిపాల్ డా. వి.హనుమంతయ్యగారి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్ధులు పాల్గొన్నారు. చెట్లను పెంచితే పర్యావరణ పరిరక్షణతో పాటు సహజ పరిరక్షణ కూడా జరుగుతుందని హనుమంతయ్య గారు వివరించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు అందరూ కలిసి కళాశాల విశాలమైన ప్రాంగణంలో మొక్కలు నాటి విద్యార్థులను ఉత్సాహపరిచారు.