విద్యాపరిషత్ వార్తలు

“యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు | యుక్తస్వప్నావ బోధస్య యోగోభవతి దుఃఖహా”|| అని భగవద్గీత ప్రపంచానికి తెలియజేశారు. మానవీయ విలువలను పెంపొందించే దిశగా గీతా జయంతిని పురస్కరించుకొని ది. 12, ఆగష్టు, 2019న విశ్వజననీ పరిషత్ మరియు మాతృశ్రీ ప్రాచ్య కళాశాల ఆధ్వర్యంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి.వి.యన్.బాబుగారు మరియు ప్రిన్సిపాల్ డా.వి. హనుమంతయ్యగారు అన్నపూర్ణాలయం వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభలో ఎమ్. దినకర్ గారు పాల్గొన్నారు. కళాశాలను ఒక ఉన్నతమైన లక్ష్యంతో అమ్మ స్థాపించిందని ఆ లక్ష్యానికి అనుగుణంగా ఇక్కడ విద్య, భోజన, వైద్య సంరక్షణ సదుపాయాలు కొనసాగుతున్నాయని రామబ్రహ్మం గారు తెలియజెప్పారు. సంస్థ ప్రెసిడెంట్ యమ్. దినకర్ గారు మాట్లాడుతూ భగవద్గీత మానవతా.. విలువలను పెంపొందించే ఒక అద్భుతమైన గ్రంథమని పలు ఉదాహరణలతో సవివరంగా తెలియజెప్పారు. కళాశాల పక్షాన డా॥ సుధామవంశి, డా॥ కె.వి.కోటయ్య, డా॥ ఎ.హనుమత్ ప్రసాద్ లు భగవద్గీత ప్రాశస్త్యాన్ని విద్యార్ధులకు వివరించారు. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లములతో విద్యార్థులు తమకు తెలిసిన విషయాలను చక్కగా చెప్పారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు అధ్యాపకులు పి. మధుసూదన్ గారు నిర్వహించారు. సంస్కృత ఆంధ్రాలను అభ్యసిస్తున్న మనమందరం సంస్కృతిని, భగవద్గీతలోని అంతర్యాన్ని భావితరాలకు వ్యాపింపజేయాలని రామబ్రహ్మంగారు పిలుపునిచ్చారు. శాంతి మంత్రంతో ఈ కార్యక్రమం ముగిసింది.

తిరుపతిలో అమ్మ అనంతోత్సవాలు

12-6-19 న కుష్ఠురోగుల వైద్యశాల, కరకంబాడీ రోడ్ తిరుపతిలో వృద్ధులకు అమ్మ అన్నప్రసాదము, పళ్ళు అందజేశారు. ఈ మహత్కార్యంలో అమ్మ సేవలో అమ్మ అనంతోత్సవ యజ్ఞంలా ఎమ్. హైమవతి, ఎమ్.వి.ఎన్. రవిచంద్ర గుప్త, శ్రీ ఎమ్. రామకృష్ణాంజనేయులు ప్రభృతులు పాల్గొన్నారు.

HEALTH IS WEALTH AN AWARENESS CAMP

“ఆరోగ్యమే మహాభాగ్యం” అను నానుడిని విద్యార్థులలో అవగాహన కలిగించి, దైనందిన జీవితంలో ఆరోగ్యసూత్రాలను పాటిస్తూ మంచి శారీరక మానసిక ఆనందంతో ఎదగాలని ప్రముఖ మానసిక వైద్యనిపుణులు డా॥ జి.పద్మజ గారు సోదాహరణంగా తెలియజేసారు. విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారాలను సూచించారు.

HEALTH IS WEALTH AN AWARENESS CAMP

“ఆరోగ్యమే మహాభాగ్యం” అను నానుడిని విద్యార్థులలో అవగాహన కలిగించి, దైనందిన జీవితంలో ఆరోగ్యసూత్రాలను పాటిస్తూ మంచి శారీరక మానసిక ఆనందంతో ఎదగాలని ప్రముఖ మానసిక వైద్యనిపుణులు డా॥ జి.పద్మజ గారు సోదాహరణంగా తెలియజేసారు. విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారాలను సూచించారు.

సంస్కృతాన్ని పరిరక్షించండి

సంస్కృత భాషను దశదిశలా వ్యాపింపజేయాలని, అందుకు సంస్కృతాన్ని అధ్యయనం చేసే మనమంతా. కృషిచేయాలని, ‘సంస్కృత భారతి’ ప్రాంత అధ్యక్షులైన శ్రీ దోర్బల ప్రభాకరశర్మగారు పిలుపునిచ్చారు. 2.12.2019 సోమవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడిలో జరిగిన సభలో సంస్కృతభాషా ప్రాశస్త్యం గురించి విద్యార్ధులనుద్దేశించి ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపల్ డా॥ వి. హనుమంతయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సంస్కృతంలో మాట్లాడాలని కోరారు. ఒక్కొక్క విద్యార్ధి ఐదుగురికి సంస్కృతం నేర్పుతూ అలా గ్రామంలోని వారందరిచేత సంస్కృతంలో మాట్లాడించాలని తద్వారా జిల్లెళ్ళమూడిని ‘అర్కపురి’ అని పిలిచేలా చేయాలనీ, పిలుపునిచ్చారు. అందుకు తమ సహాయ సహకారాలను అందించాలని డా॥ హనుమంతయ్య గారిని ఈ కార్యక్రమంలో కోరారు. సంస్కృత విభాగంలోని విద్యార్థులు పాల్గొన్నారు.