by admin | Aug 31, 2019 | Alumni Interaction
“నీ సేవలోనే నా బ్రతుకు సాగనీ నీ ధ్యాసలోనే నా శ్వాస ఆగనీ” అని అమ్మ సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన శ్రీ కొండముది రామకృష్ణ. గారి 21 వ సంస్మరణ సభ 31.8.2019 శనివారం రామకృష్ణ గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. కళాశాల ప్రిన్స్పాల్ డా॥ ఎ. సుధామవంశీ అధ్యక్షతలో జరిగిన ఈ సభలో రామకృష్ణ అన్నయ్య పెద్ద కుమారులు కొండముది సుబ్బారావు సంస్థ రెసిడెంట్ సెక్రెటరీ రావూరి ప్రసాద్, కమిటీ సభ్యులు చక్కా శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. రామకృష్ణ అన్నయ్య అడ్మినిస్ట్రేటరుగా, అంతరంగిక కార్యదర్శిగా, కవిగా, తత్వ ప్రచారకునిగా ప్రశంసించి వారితో తమకు గల అనుబంధాలను గుర్తుచేసుకొన్నారు. ఒక వ్యక్తి రచనలకు పి.హెచ్.డి పట్టాను ఇవ్వడం ఎంతో గర్వకారణం అని తెలుగు విభాగంలో లెక్చరర్ గా పనిచేస్తున్న ఎల్. మృదులగారిని సభాముఖంగా అభినందించారు. కార్యక్రమంలో కొండముది సోదరులు నాగేశ్వరరావు, ప్రేమ్కుమార్ గారు రవి సంస్థకు నగదు విరాళాన్ని ఇస్తున్నట్లుగా సభలో తెలియజేశారు. కొండముది రవిగారు అన్నయ్య రాసిన పాటలను గానం చేసి ఈ సందర్భముగా సంపూర్ణ విద్యార్థులుగా ఎంపికైన ఎన్. ప్రవీణ్ బి.ఏ. IIIrd Year, దుర్గాప్రసాద్ 10th Class లకు ఒక్కొక్కరికి 1,116 చొప్పున నగదు పురస్కారం అందించారు. ఇదే వేడుకలో చక్కా శ్రీమన్నారాయణగారు తమ తల్లితండ్రుల స్మృత్యర్థం ఫైనల్ ఇయర్ చదువుతున్న వి. శ్రావణి బి. ఏ. III Tel, యు. కృష్ణ బి.ఏ. III Tel లకు బహుమతులు అందజేశారు. అంతేగాక నంబూరి చింజీవిగారు హైస్కూల్లో చదువుతున్న యమ్. నవ్య (10th) కె. భరత్సాయి 10th విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
by admin | Aug 29, 2019 | Language & Communication Skills
తెలుగు భాషా సాహిత్యాలు ప్రజల సంపదగా ప్రాచుర్యం పొందాలని ప్రిన్సిపాల్ డా. ఎ. సుధామవంశీగారు ఆగష్టు 29న జరిగిన తెలుగు మాతృభాషా దినోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుభాష ప్రజలభాషగా వర్ధిల్లాలని గిడుగు రామమూర్తి పంతులుగారు భాషోద్యమం నిర్వహించినట్లు తెలిపారు. కళాశాల ఆంధ్రశాఖ ప్రతినిధి డా. ఎల్. మృదులగారు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. అధ్యాపకులు డా. కె.వి. కోటయ్య, సర్వశ్రీ మడకా సత్యనారాయణ, పి. మధుసూధనరావు, కె. శ్వేత ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు మాతృభాషా గీతాలను గానం చేశారు. గిడుగు రామమూర్తి చేసిన కృషిని వివరించి శ్రోతల మన్ననలు పొందారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సంస్కృత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గిడుగు రామమూర్తిపంతులు గారి చిత్రపటానికి పుష్పమాలాలంకరణ నిర్వహించి జేజేలు పలికారు
by admin | Aug 15, 2019 | Orientation Programm
73 వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడిలో ఆగష్టు 15 వ తేదీన ఘనంగా జరిగాయి. అమ్మ చిత్రపటానికి మరియు భరతమాత చిత్ర పటానికి ఛీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్య పుష్పమాల అలంకరణ నిర్వహించగా, కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి.వై.యన్.బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సభలో ప్రిన్సిపాల్ డా. ఎ. సుధామ వంశీ మాట్లాడుతూ పెద్దలు సంపాదించి పెట్టిన స్వాతంత్య్రాన్ని అనుభవిస్తూ మన సంస్కృతిని భావితరాలవారికి కూడా అందివ్వాలని తెలిపారు. కరస్పాండెంట్ శ్రీ జి.వై.యన్. బాబుగారు మాట్లాడుతూ బాధ్యతలను గుర్తించి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో శ్రమించాలని తెలిపారు. శ్రీ బొప్పూడి రామబ్రహ్మం మాట్లాడుతూ కర్తవ్య నిర్వహణలో కలిసి కట్టుగా కృషి చేయాలని వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కె.ప్రేమక్కుమార్, శ్రీ ప్రసాదవర్మ కామఋషి తదితరులు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు. తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమం ఆసాంతం విద్యార్థినులే నిర్వహించడం విశేషము. ఇదే వేదికపై పలువురు దాతలు అందించిన ప్రోత్సాహక నగదు బహుమతులను సంస్థ పెద్దలు విద్యార్థినీ విద్యార్థులకు అందించారు. దాతలకు కళాశాల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. మిఠాయి పంపిణీతో కార్యక్రమం ముగిసింది.
by admin | Aug 14, 2019 | Human Values
రామాయణంలోని మానవీయ విలువలు నైతిక ఆదర్శాలు సార్వకాలిక, సార్వజనీన లక్షణాలతో వర్ధిల్లుతున్నాయని ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి.యస్.ఆర్ మూర్తి గారు వివరించారు. ఆగష్టు 14 వ తేదీన కళాశాల ప్రార్ధనా మందిరంలో జరిగిన సాహిత్య సమావేశంలో ‘శ్రీమద్రామాయణం – అహల్య’ అనే అంశంపై మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ.సుధామ వంశీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆదర్శవంతమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని హితవు పలికారు. కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మం ఉభయ పరిషత్తుల అధ్యక్షులు శ్రీ యమ్. దినకర్ కళాశాల కరెస్పాండెంట్ శ్రీ జి.వై.ఎన్.బాబు. విశ్వజననీ సంపాదకులు శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయ ప్రసాద్, దర్శనం పత్రిక సంపాదక సభ్యులు శ్రీ ప్రసాదవర్మ కామఋషి, సంస్థ పెద్దలు శ్రీటి.టి. అప్పారావు, శ్రీచక్కా శ్రీమన్నారాయణగారు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, పలువురు సందర్శకులు పాల్గొన్నారు.
by admin | Aug 12, 2019 | Human Values
అని భగవద్గీత ప్రపంచానికి తెలియజేశారు. మానవీయ విలువలను పెంపొందించే దిశగా గీతా జయంతిని పురస్కరించుకొని ది. 12, ఆగష్టు, 2019న విశ్వజననీ పరిషత్ మరియు మాతృశ్రీ ప్రాచ్య కళాశాల ఆధ్వర్యంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి.వి.యన్.బాబుగారు మరియు ప్రిన్సిపాల్ డా.వి. హనుమంతయ్యగారు అన్నపూర్ణాలయం వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభలో ఎమ్. దినకర్ గారు పాల్గొన్నారు. కళాశాలను ఒక ఉన్నతమైన లక్ష్యంతో అమ్మ స్థాపించిందని ఆ లక్ష్యానికి అనుగుణంగా ఇక్కడ విద్య, భోజన, వైద్య సంరక్షణ సదుపాయాలు కొనసాగుతున్నాయని రామబ్రహ్మం గారు తెలియజెప్పారు. సంస్థ ప్రెసిడెంట్ యమ్. దినకర్ గారు మాట్లాడుతూ భగవద్గీత మానవతా.. విలువలను పెంపొందించే ఒక అద్భుతమైన గ్రంథమని పలు ఉదాహరణలతో సవివరంగా తెలియజెప్పారు. కళాశాల పక్షాన డా॥ సుధామవంశి, డా॥ కె.వి.కోటయ్య, డా॥ ఎ.హనుమత్ ప్రసాద్ లు భగవద్గీత ప్రాశస్త్యాన్ని విద్యార్ధులకు వివరించారు. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లములతో విద్యార్థులు తమకు తెలిసిన విషయాలను చక్కగా చెప్పారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు అధ్యాపకులు పి. మధుసూదన్ గారు నిర్వహించారు. సంస్కృత ఆంధ్రాలను అభ్యసిస్తున్న మనమందరం సంస్కృతిని, భగవద్గీతలోని అంతర్యాన్ని భావితరాలకు వ్యాపింపజేయాలని రామబ్రహ్మంగారు పిలుపునిచ్చారు. శాంతి మంత్రంతో ఈ కార్యక్రమం ముగిసింది.