సంస్కరణోత్సవం

జిల్లెళ్ళమూడి అందరింటిని ప్రభావితం చేసిన విశిష్ట వ్యక్తులలో కొండముది రామకృష్ణ ఒకరని జిల్లెళ్ళమూడి అమ్మ సంస్థల చీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు వివరించారు. ఆగస్టు 23 న కళాశాలలో కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి డా॥ బి.యల్. సుగుణ గారు మాట్లాడుతూ, అమ్మ తత్త్వాన్ని దైవత్వాన్ని దీనులపాలిట ఆదరణను కొండముది రామకృష్ణ ఆరాధించినట్లు, అమ్మ నామ సంస్మరణే నిరంతర శ్వాసగా, ధ్యాసగా జీవించిన ధన్యజీవి అని తెలిపారు. ముఖ్య అతిథి, ప్రముఖవక్త ప్రభాకరస్వామీజీ (హైదరాబాదు) పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రామకృష్ణ ఫౌండేషన్ తరఫున సంపూర్ణ విద్యార్థి అనే పేరుతో ఎ.మనీషా, జె. రామారావు లకు జ్ఞాపిక, నగదు బహుమతిగ అందజేశారు. ఇదే వేదికపై చక్కా శ్రీమన్నారాయణ గారు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం కళాశాల విద్యార్థినీ విద్యార్థులు, యల్. కరుణ, కె. మణికంఠ, హరీష్ గుప్తా, ప్రభృతులకు వస్త్రాలు, నగదు బహుకరించారు.

స్వామివారి అనుగ్రహభాషణ

సకల మానవాళి శ్రేయస్సు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ దైవభక్తి, విశ్వమానవ సౌభ్రాతృత్వంతో మనుగడ సాగించాలని కృష్ణాజిల్లా పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సీతారామ్ స్వామీజీ వివరించారు. ఆగష్టు 14 మంగళవారము కళాశాలలో జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన అనుగ్రహభాషణం చేశారు. ఈ సభలో అధ్యక్షులు శ్రీ రామబ్రహ్మంగారు పాల్గొన్నారు.స్వామీజీ మాట్లాడుతూ సంస్కృతాంధ్రలలోని వివిధ సూక్తులను, పద్యాలను ఉదాహరించి శ్రోతలను అలరించారు. సన్మార్గంలో జీవించడం, సాటి మానవులకు సహాయ సహకారాలు అందిచడం, విజ్ఞాన జ్యోతిని వెలిగించి అజ్ఞానాన్ని పారద్రోలడం విద్యావంతుల కర్తవ్యం అని కార్యక్రమంలో హితవు పలికారు.

శ్రీ వి. యస్.ఆర్.మూర్తి గారి స్ఫూర్తి కార్యక్రమం

లక్ష్య సాధనకోసం అంకిత భావంతో కృషి చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త వి.యస్.ఆర్.మూర్తి వివరించారు. ఆగస్టు 13 వ తేదీ సోమవారం జిల్లెళ్ళమూడి అన్నపూర్ణాలయ సమావేశమందిరంలో ఆయన మాట్లాడుతూ సమాజహితం కోసం కృషి జరిగినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని వివరించారు. దేశాభ్యుదయం కోసం, మానవ మనుగడ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎందరో మహనీయులు అహర్నిశలు శ్రమించిన తీరు తెన్నులను వి.యస్.ఆర్. మూర్తిగారు సోదాహరణంగా వివరించారు. ఇదే వేదికపై విద్యార్థినీ విద్యార్థులను ఆహ్వానించి, వారి జీవిత లక్ష్యాలు ఏమిటి? అని ప్రశ్నించి జవాబులు రాబట్టటం అందరినీ అలరించింది. ఫైనల్ ఇయర్ డిగ్రీ విద్యార్థినులు మనీషా, నాగలక్ష్మి సంతృప్తికరంగా సమాధానాలు చెప్పి శ్రోతల మన్ననలు పొందారు.

శ్రీ వి. యస్.ఆర్.మూర్తి గారి స్ఫూర్తి కార్యక్రమం

లక్ష్య సాధన కోసం అంకిత భావంతో కృషి చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త వి.యస్.ఆర్ మూర్తి వివరించారు. ఆగస్టు 13వ తేదీ సోమవారం జిల్లెళ్ళమూడి అన్నపూర్ణాలయ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ సమాజహితం కోసం కృషి జరిగినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని వివరించారు. ఉభయ పరిషత్తుల అధ్యక్షులు శ్రీ బి.రామబ్రహ్మం గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ యల్. సుగుణగారు పర్యవేక్షించారు. సంస్థ చీఫ్ ప్యాట్రన్ డా. బ్రహ్మాండం రవి,ఈ సభలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. దేశాభ్యుదయం. కోసం, మానవ మనుగడ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎందరో. మహనీయులు అహర్నిశలు శ్రమించిన తీరు తెన్నులను వి.యస్. ఆర్. మూర్తి గారు సోదాహరణంగా వివరించారు. అధ్యక్షులు శ్రీ బొప్పడి రామబ్రహ్మం గారు మాట్లాడుతూ, విద్యార్థులు దేశభక్తి, దైవభక్తి, మానవసేవ, అభివృద్ధి సాధన లక్ష్యాలుగా కృషి వివరించారు. కరస్పాండెంట్ శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ మాట్లాడుతూ ఆకలి, పేదరికం, అసమానతలు సమాజంలో తొలగిపోవాలని ఇది అమ్మ లక్ష్యమని సోదాహరణంగా తెలిపారు. యస్. ఆర్. మూర్తి గారిని నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. సంస్థ పెద్దలు శ్రీ.యమ్. దినకర్ , యమ్.శరచ్చంద్ర. యన్. లక్ష్మి, శ్రీరామ్మూర్తి, డి రామచంద్ర, వసుంధరక్కయ్య, ప్రధానో పాధ్యాయులు,   కె ప్రేమకుమార్ అధ్యాపక సిబ్బంది. విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మనుషులు గతించినా చరిత్ర మాసిపోదు

చరిత్రను విస్మరించిన జాతికి భవిష్యత్తు ఉండదని శ్రీనాధ సాహితీ పరిషత్ (నర్సరావుపేట) నిర్వాహకులు శ్రీ స్వర్ణ చినరామిరెడ్డి ఆగష్టు 7 వ తేదీన వివరించారు. సీనియర్ ఫాకల్టీ డా॥ ఎ. సుధామవంశీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్వర్ణ చినరామిరెడ్డి మాట్లాడుతూ సమాజస్థితిగతులను చరిత్ర ఎప్పటికప్పుడు వివరిస్తుందని పేర్కొన్నారు. ఇదే వేదికపై కళాశాల చరిత్ర అధ్యాపకులు శ్రీ కాశీభట్ట సత్యమూర్తి మాట్లాడుతూ చరిత్ర గమనాన్ని పరిశీలించి ఉత్తమ విధానాలను అలవరచుకొని ముందుకు సాగాలని హితవు పలికారు. ఈ కార్యక్రమానికి చరిత్ర అధ్యాపకులు శ్రీ జి. రాంబాబు గారు స్వాగతం పలికి శాసనాలు, తాళపత్ర గ్రంథాలు దేశవిదేశీ ప్రముఖుల రచనలు చారిత్రక సత్యాలను చాటి చెబుతాయని పేరొన్నారు.