by MOC IQAC | Apr 19, 2025 | Awarness Programs
Swachh Andhra Swarna Andhra
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు Commissioner of Collegiate Education (CCE) వారి సూచనల మేరకు ప్రతి నెల మూడవ శనివారం “స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర” కార్యక్రమంగా జరుపుకుంటున్నాం. ఏప్రిల్ 2025 నెలకు సంబంధించిన థీమ్ ఈ-వేస్ట్ నిర్వహణ (E-Waste Management)గా నిర్ణయించబడింది.
ఈ సందర్భంగా 19-04-2025 శనివారం రోజున మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఈ-వేస్ట్ నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ముందుగా NSS కోఆర్డినేటర్ శ్రీ టి. జయకృష్ణ గారి ఆధ్వర్యంలో E-Waste నిర్వహణపై సెమినార్ నిర్వహించబడింది. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. హనుమత్ప్రసాద్ విద్యార్థులకు E-Waste అనేది ఏమిటి, దాని వల్ల పర్యావరణంపై కలిగే ప్రభావాలు మరియు E-Waste సరైన నిర్వహణ యొక్క ఆవశ్యకతను గురించి వివరంగా తెలియజేశారు. కళాశాలలోని E-Waste ను సేకరించి E- Wasted వస్తువుల రకాలు, వాటి ద్వారా కలిగే ప్రమాదాలు మరియు సరైన రీతిలో నిర్వహించు పద్ధతుల గురించి వివరించారు. ఇందులో విద్యార్థులు, అధ్యాపకులు చురుకుగా పాల్గొని తమ వద్ద ఉన్న పాడైన లేదా ఉపయోగం లేని ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకువచ్చి అందజేశారు. 12 మంది అధ్యాపకులు 40 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పర్యావరణ బాధ్యతకు సంబంధించి చైతన్యం కలిగించింది.
by MOC IQAC | Mar 19, 2025 | Awarness Programs, Drug Awareness, Extension Activities
DRUG AWARENESS PROGRAM
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడి లో ఈగల్ క్లబ్ ఆధ్వర్యంలో March 19 20 25 న డ్రగ్ పై అవగాహన మరియు దుర్వినియోగం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించింది. సభలో ప్రిన్సిపల్ డా. A.హనుమత్ ప్రసాద్ గారు మాట్లాడుతూ విద్యార్థుల మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ Academic Excellence పై దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం EAGLE CLUB CO ORDINATOR B.సుకన్య నోరులేని జంతువులు కూడా దూరంగా ఉంచే పొగాకు లాంటి హానికారకాలకు మనం దూరంగా ఉంటూ మన చుట్టూ పక్కల వారికి అందరికీ దీని గురించి అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ సభకు అతిథిగా విచ్చేసిన మూలపాలెం సచివాలయం మహిళా పోలీస్ అధికారి Zion Perpetua Nathala ప్రతి ఒక్క విద్యార్థి సమాజం పట్ల బాధ్యత వహించి తాను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటమే కాకుండా ఇతరులకు దీనిపై అవగాహన కలిగించేలా సామర్థ్యాన్ని కలిగి ఉండాలని వివరించారు. 80 మంది విద్యార్థినులు 22 మంది విద్యార్థులు 10 మంది అధ్యాపకులు పాల్గొన్న ఈ కార్యక్రమం విద్యార్థుల మాదకద్రవ్యాల దుర్వినియోగం ద్వారా కలిగే ప్రమాదాలను గురించి అవగాహన కల్పించడంలో ఎంతగానో తోడ్పడింది. EAGLE CLUB CO ORDINATOR B.సుకన్య అధ్యాపకులకు అతిథులకు కృతజ్ఞతలు తెలియజేయడంతో కార్యక్రమం ముగిసింది.
by MOC IQAC | Mar 15, 2025 | Awarness Programs, Extension Activities, Plastic Awarness
స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర
COMMISSIONER OF COLLEGIATE EDUCATION మంగళగిరి వారి ఆదేశాల మేరకు ప్రతినెల మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందులో భాగంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 15.03.2025 శనివారం AVOID SUPs PROMOTE REUSABLES ప్రోత్సహించండి అనే అంశం పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ A.హనుమత్ ప్రసాద్ గారు ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వలన కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు తెలియజేశారు. తెలుగు అధ్యాపకురాలు డా. L. మృదుల గారు సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను ఉపయోగించకూడదని, RE USE PLASTIC పై విద్యార్థులకు అవగాహన కలిగించారు. PLASTIC ను ఉపయోగించడం పై కలుగుతున్న అనారోగ్యాలను గురించి తెలియజేశారు. అనంతరం NSS CO ORDINATOR T. జయకృష్ణ గారు ఒకరోజు మనం వినియోగిస్తున్న ప్లాస్టిక్ వస్తువుల వల్ల భూమిపై ఉన్న పొరలలోని చేరి అవి కరిగిపోకుండా అలాగే ఉండి ఎన్నో వ్యాధులకు లోనవ్వడానికి మూల కారణం అవుతుంది. కనుక మనము సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ ని ఉపయోగించ వద్దని తెలియజేశారు. తరువాత సాయంత్రం 5 గంటలకు కళాశాల మైదానంలో విద్యార్థులు అధ్యాపకులు అందరూ స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేశారు. తడి చెత్తను పొడి చెత్తను వేరుచేసి కళాశాల ఆవరణను శుభ్రపరిచారు. అనంతరం PLASTIC AVOID పై నినాదాలతో జిల్లెళ్ళమూడి గ్రామప్రజలకు అవగాహన కల్పించడానికి ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 72 మంది విద్యార్థినులు 20 మంది విద్యార్థులు 15 మంది అధ్యాపకులు పాల్గొన్నారు.
by MOC IQAC | Dec 1, 2024 | AIDS, Awarness Programs
WORLD AIDS DAY
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో డిసెంబరు 1వ తేదీ ఆదివారం సభాకార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సభాధ్యక్షులు, కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు ప్రసంగిస్తూ ఎయిడ్స్ రావడానికి కారణాలు, నివారణమార్గాలు విద్యార్థులకు తెలిపారు. అనంతరం చరిత్ర ఉపన్యాసకులు పి. సుందరరావు గారు ఎయిడ్స్ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా ఎలా వ్యాపించి ఉందో గణాంకాలతో తెలిపి అతి త్వరలో ఎయిడ్స రహిత ప్రపంచంగా మారడానికి అందరూ కృషి చేయాలని, ఆ వ్యాధి లక్షణాలు ఉన్నవారిని భయపడకుండా నివారణోపాయాలను తెలియజెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు సాహిత్, మీనాక్షి, శ్రీలక్ష్మి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు తీసుకోవలసిన జాగ్రత్తలను చక్కగా వివరించారు. అనంతరం కళాశాల మైదానం లో విద్యార్థులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అందరూ కలిసి మానవహారం నిర్వహించారు. అంతే కాక జిల్లెళ్ళమూడి గ్రామప్రజలకు అవగాహన కల్పించేందుకు అందరూ ర్యాలీ గా గ్రామంలో పర్యటించి గ్రామస్థులకు అవగాహన కలిగించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కమీషనరేట్ ఆప్ కాలేజియేట్ వారి ఆదేశాల మేరకు విద్యార్థులకు పోష్టర్ పెయింటింగ్, పెయింటిగ్, రంగవల్లుల పోటీలు ఎయిడ్స్ మహమ్మారి నిర్మూలన ప్రతిబింబించేవిధంగా పోటీలు నిర్వహించబడ్డాయి.
by admin | Jun 30, 2023 | Awarness Programs
2022-23 faculty development program లో భాగంగా కళాశాల అధ్యాపకులకు (1st బ్యాచ్) కంప్యూటర్ నాలెడ్జ్ కోసం MS OFFICE తరగతులు ది 30.06.2023 సాయంత్రం గం 4.30 లకు మన కళాశాల కంప్యూటర్ లాబ్ లో ఇచ్చారు. కంప్యూటర్ లెక్చరర్ శ్రీ డి.ప్రవీణ్ గారు శిక్షణ ఇచ్చారు.
by admin | Jun 5, 2023 | Plastic Awarness
జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 6వ తేదీ మంగళవారం *ప్లాస్టిక్ నివారణ – పర్యావరణ పరిరక్షణ* అనే నినాదంతో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభాకార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల NSS UNIT తరపున జరిగిన ఈ సభను NSS కో ఆర్డినేటర్ జి. రాంబాబు గారు నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ అన్నదానం. హనుమత్ప్రసాద్ గారు అధ్యక్షత వహించారు. ప్రిన్సిపల్ గారు అధ్యక్ష భాషణను చేస్తూ పాంచభౌతికమైన ఈ శరీరం ప్రకృతితో మమేకమై ఉన్నదని కనుక ప్రకృతి పరిరక్షణ మనందరి కర్తవ్యం అని తెలిపారు. జి. రాంబాబు గారు మాట్లాడుతూ 1972 నుండి జూన్ 5వ తేదీ పర్యావరణ దినోత్సవంగా మనం గత ఐదు దశాబ్దాలుగా జరుపుకుంటున్నామని కనుక ఈ రోజున ప్రతిపాదించిన అంశాలను మనందరం ఆచరణలో పెట్టగలిగితేనే భావితరాల వారికి ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించగలమని తెలిపారు. అనంతరం కె. సత్యమూర్తి గారు మాట్లాడుతూ పర్యావరణానికి సంబంధించిన అధ్యయనాలు యూజీ స్థాయి విద్యార్థులకు 2005 నుండి అమలు పరచడం ముదావహమని అవి సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ఉపకరిస్తున్నాయని వివరించారు. డా. యల్. మృదుల గారు మాట్లాడుతూ ఏదైనా సందర్భంలో మనం ఒక చెట్టు నరకవలసి వస్తే పది చెట్లను నాటాలని అప్పుడే ప్రకృతి విధ్వంసానికి అడ్డుకట్ట వేయగలమని సూచించారు. ఎం. కవిత గారు ప్రసంగిస్తూ ప్రతి ఏడాది జరుపుకునే పర్యావరణ దినోత్సవాన్ని ఈ సంవత్సరం *ఎ సొల్యూషన్ టు ప్లాస్టిక్* అనే Theam తో UNED సంస్థ ముందుకు వెళుతుందని తెలిపారు. ఆర్. వరప్రసాద్ గారు మానవున్ని అల్పాయుష్కునిగా చేయడంలో పర్యావరణం ప్రధాన పాత్ర వహిస్తుందని కలుషిత పర్యావరణంయ అనేది ప్రాణికోటి మనుగడకు ముప్పు తీసుకురాబోతుందని కనుక మనమంతా పర్యావరణాన్ని రక్షించడంలో మన వంతు కృషి చేయాలని చేద్దామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అధ్యాపకులు విద్యార్థులతో కలిసి కళాశాల ప్రాంగణంలో మొక్కలను నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ నినాదాల తో కళాశాల నుండి ర్యాలీగా బయలుదేరి జిల్లెళ్ళమూడి గ్రామ ప్రజలకు చైతన్యాన్ని కలిగించేలా ముందుకు సాగారు.