Guest Lecture on Training in reasoning & thinking Skills

             Guest Lecture on Training in reasoning & thinking Skills

          24 సెప్టెంబర్ 2025 న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెల్లమూడి లో B.Sc. Computer Science విభాగం విద్యార్థుల కోసం Reasoning & Thinking Skills అనే అంశంపై Guest Lecture నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి శ్రీ కె. సంజీవ్ కుమార్ గారు (Guest Lecturer) ప్రసంగకర్తగా హాజరయ్యారు.

ఆయన విద్యార్థి జీవితంలో తార్కికత, తర్కశక్తి, ఆలోచనా పద్ధతుల ప్రాముఖ్యతను వివరించారు. Reasoning మరియు Thinking నైపుణ్యాలు సమస్య పరిష్కార సామర్థ్యాన్ని, ఏకాగ్రతను, మరియు నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని ఆయన తెలియజేశారు. ఈ నైపుణ్యాలు ఉన్నత విద్య, పోటీ పరీక్షలు మరియు వృత్తి అభివృద్ధికి ఎంత అవసరమో విద్యార్థులకు వివరిస్తూ, ఉదాహరణలతో ఆచరణాత్మకంగా బోధించారు.

సెషన్‌లో విద్యార్థులు పజిల్స్‌, తార్కిక ప్రశ్నలు, మరియు సమస్య పరిష్కార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఈ ఉపన్యాసం విద్యార్థులలో ఆలోచనా దక్షతను, సృజనాత్మకతను పెంచింది. కార్యక్రమం చివరన కళాశాల అకాడెమిక్ & అడ్మినిస్ట్రేటివ్ ఇన్‌చార్జ్ శ్రీ జి. గోవిందరాజు గారు, సిబ్బంది సభ్యులతో కలిసి శ్రీ కె. సంజీవ్ కుమార్ గారిని సన్మానించారు. విద్యార్థులు ఈ కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేస్తూ, ఇది తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని తెలిపారు.

గురుపూర్ణిమ/Gurupoornima

గురుపూర్ణిమ/Gurupoornima

ఘనంగా గురుపౌర్ణమి కార్యక్రమం

ది 10.07.2025 గురువారం నాడు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో గురుపౌర్ణమి సందర్భంగా సభాకార్యక్రమం ఘనంగా జరిగింది. గుంటూరు  హిందూ కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు డాక్టర్ దీవి నరసింహ దీక్షిత్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. గురు పరంపర ద్వారానే భారతదేశం విశ్వగురువుగా నిలిచిందని, గురువు జీవితానికి మార్గదర్శకుడే కాక సంస్కృతి పరిరక్షకుడుగా కూడా ఉండాలని తెలిపారు. ఎంతోమంది శిష్యులను తయారు చేయడం వలన వ్యాసభగవానుడి పేరుతో ఈ పర్వదినము వ్యాసపూర్ణిమగా పేరొందిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నదానం హనుమత్ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీ విశ్వజనని పరిషత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ వల్లూరి ప్రేమ్ రాజ్ గారు, Honorary Chairman శ్రీ M.దినకర్ గారు, కోశాధికారి శ్రీ జన్నాభట్ల సుబ్రహ్మణ్యం గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్య అతిథికి ఘనంగా గురుసత్కారం చేశారు. అనంతరం గురుపాదుకాస్తోత్ర పారాయణ జరిగింది. కళాశాల విద్యార్థినీ విద్యార్థులే సభానిర్వహణ చేశారు. కళాశాల సంస్కృత విభాగ అధ్యక్షులు డాక్టర్ ఆర్ వరప్రసాద్ గారు వందనసమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో  కళాశాల అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది.

Guest Lecture by Prof. Vidyananda Aarya

Guest Lecture by Prof. Vidyananda Aarya

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల సంస్కృతవిభాగం తరుపున 26-12-2024 గురువారం రోజున అతిథి ఉపన్యాసం ఏర్పాటయింది.  ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం Head of the Department     Prof. విద్యానంద ఆర్య విచ్చేసి సంస్కృతభాష అధ్యయనం – ప్రయోజనాలు అనే అంశంపై ప్రసంగించారు. వీరు ఆధునిక సమాజంలో సంస్కృతభాషపై జరుగుతున్న వివిధ రకాల పరిశోధనలను తెలిపి భావితరాలకు అందబోతున్న సదవకాశాలను గురించి సవివరంగా తెలియజెప్పారు. అంతేకాక లక్షల సంవత్సరాల నుండి ఉనికిని కలిగి ఉన్న సంస్కృత భాష అన్నిభాషలకు మాతృభాష అనీ, సంస్కృతభాషలో ఉచ్చారణ పరంగా, ప్రాంతాల వారీగా, దశాబ్దాలవారీగా గానీ ఏవిధమైన మార్పులు జరగలేదనీ తెలిపారు. ప్రాంతీయ భాషాలు వివిధ దశలలో వివిధ రకాల మార్పులు సంతరించుకుంటుంటాయని సకలభాషలకు తల్లివంటిది కనుక ప్రతిభాష సంస్కృతం నుండే పుట్టిందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సభను సంస్కృతవిభాగాధ్యక్షులు డా. ఆర్. వరప్రసాద్ గారు నిర్వహించగా డా. వి. త్రయంబకం గారు వందన సమర్పణ గావించారు.