Viswa Samskrutha Basha Dinothsavam

Viswa Samskrutha Basha Dinothsavam

Viswa Samskrutha Basha Dinothsavam

విశ్వసంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సభకు ముఖ్య అతిథిగా సంస్కృత భారతి అఖిల భారత బాలకేంద్ర ప్రముఖులు, విజయవాడ SSR&CVR కళాశాల సంస్కృత ఉపన్యాసకులు శ్రీ ఉపద్రష్ట వేంకట రమణమూర్తి గారు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

సంస్కృతం అనేది ప్రాచీన భాష మాత్రమే కాదు నిత్య నూతనమైన భాష అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో, జన జీవనంలో సంస్కృతం ఎలా ఇమిడిపోయి వున్నదో వివరించి విద్యార్థులకు భాషపై మక్కువ ఆసక్తి కలిగించారు.

కార్యక్రమంలో మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా విద్యార్థులు సంస్కృతంలో ప్రసంగాలను, శ్లోకపఠనాన్ని చేశారు. భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే నృత్య ప్రదర్శనలు జరిగాయి.

సభాకార్యక్రమాన్ని ఆసాంతం సంస్కృత భాషలో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.అన్నదానం హనుమత్ప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు. సంస్కృతోపన్యాసకులు డా.ఆర్ వరప్రసాద్ గారు సభా కార్యక్రమాన్ని నిర్వహించారు

విశ్వసంస్కృత భాషా దినోత్సవం

30-8-2023 న విశ్వసంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సభకు ముఖ్య అతిథిగా సంస్కృత భారతి అఖిల భారత బాలకేంద్ర ప్రముఖులు, విజయవాడ SSR & CVR కళాశాల సంస్కృత ఉపన్యాసకులు శ్రీ ఉపద్రష్ట వేంకట రమణమూర్తి గారు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సంస్కృతం అనేది ప్రాచీనభాష మాత్రమే కాదు నిత్య నూతనమైన భాష అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో, జన జీవనంలో సంస్కృతం ఎలా ఇమిడిపోయి వున్నదో వివరించి విద్యార్థులకు భాషపై మక్కువ ఆసక్తి కలిగించారు. కార్యక్రమంలో మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా విద్యార్థులు సంస్కృతంలో ప్రసంగాలను, శ్లోకపఠనాన్ని చేశారు. భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే నృత్య ప్రదర్శనలు జరిగాయి. సభాకార్యక్రమాన్ని ఆసాంతం సంస్కృత భాషలో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు. సంస్కృతోపన్యాసకులు డా.ఆర్.వరప్రసాద్ గారు సభా కార్యక్రమాన్ని నిర్వహించారు.

విద్యాపరిషత్ వార్తలు (అంతర్జాతీయ మహిళా దినోత్సవము)

మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని మనం ఎంచుకున్న రంగంలో పురోగతిని సాధించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారి సతీమణి రమాదేవి పేర్కొన్నారు. 08.03.22 మంగళవారంనాడు మహిళాదినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడి మరియు రోటరీ క్లబ్ బాపట్ల సంయుక్త ఆధ్వర్యంలో కళాశాలలో డాక్టర్ మృదుల స్వాగత వచనాలతో సభ ప్రారంభం అయింది. ఆ సభలో శ్రీమతి రమాదేవి మాట్లాడుతూ మహిళలు చైతన్యవంతులుగా ఉంటే సమాజం పురోభివృద్ధిని సాధిస్తుందని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ రావినూతల వరప్రసాద్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో అన్నె శివకుమారి గారు ఉమెన్స్ సెల్ ఆఫ్ రోటరీ క్లబ్ మాట్లాడుతూ లింగభేదం లేకుండా అన్ని రంగాలలో స్త్రీలు ప్రవేశించినట్లైతే ఆర్ధిక ప్రగతిని సాధించవచ్చునని గణాంకాలతో వివరించారు. రోటరీక్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాసుగారు మంచి సంస్కారంతో ఉన్న విద్యార్థులను చూసి ఆనందించి సంస్కృతం మరియు తెలుగులో ఎక్కువ మార్కులు సాధించినవారికి ప్రమాణ పత్రాలను అందించారు. పి.గిరిధర్ కుమార్ గారు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో విశ్వజననీపరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ ఐ. రామకృష్ణగారు మాట్లాడుతూ స్త్రీ తల్లిగా చెల్లిగా సేవామూర్తిగా నేడు అందరి మన్ననలు పొందుతూ ముందుకు వెళుతుందని వివరించారు. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరిగా సంస్కృతోపన్యాసకురాలు డా॥ వి.పావని వందన సమర్పణ గావించారు. శాంతిమంత్రాలతో కార్యక్రమం ముగిసింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

మార్చి 8 సోమవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో మహిళలకు ప్రాధాన్యతనిచ్చిన దేశం భారతదేశం అని కళాశాల ప్రిన్సిపాల్ డా|| ఎ. సుధామ వంశీ అన్నారు. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అన్న ఆర్యోక్తిని వివరించి అమ్మ మహిళలు విద్యావంతులైతే సమాజ పురోగతిని సాధిస్తుందనే సదుద్దేశంతో కళాశాల స్థాపించిందని విద్యార్థులకు తెలియచెప్పారు. ఈ సభలో కళాశాలలో పనిచేస్తున్న మహిళా అధ్యాపకులను గౌరవించి వారి అభివృద్ధికి కారణాలు, తమకు ఎదురవుతున్న సమస్యలు విద్యార్థులతో వంచుకోవాలని ప్రిన్సిపాల్గారు కోరారు. డా॥యల్.మృదుల మాట్లాడుతూ తాను తన చిన్నతనంలో పడిన కష్టాలను, తన విద్యాభ్యాసం, ఉద్యోగప్రస్థానం అన్నింటినీ చెప్పి అమ్మ దయవలనే కేవలం తను ఈ స్థితిలో ఉన్నానని అర్ద్రతతో కూడిన భక్తితో విద్యార్థులకు తన అనుభవాలు చెప్పారు. యమ్. కవిత మాట్లాడుతూ నేడు ప్రతి మహిళ అన్ని రంగాలలో ముందుంటుంది. మనం అనుకుంటే సాధించలేనిది ఉండదు అని తాను తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు చెప్పి విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపారు. డా|| వి. పావని మాట్లాడుతూ ప్రకృతి, పురుషుడు అనేది విభాగమే కానీ. విభేదం లేదు. అది కేవలం నడవడం కోసమేనని రహస్యాన్ని తెలుసుకోగలిగితే విభేదం లేదని సృష్టి చెప్పారు. బాధ్యతతో కూడిన అధికారాన్ని మాత్రమే ఆశిస్తూ ప్రతి మహిళా ముందుకు వెళ్ళాలని హితవు పలికారు. రమ్య (లైబ్రేరియన్) మాట్లాడుతూ తాను ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాతకూడా తనకున్న ఆసక్తితో పై చదువులు చదవగలిగానని, తాను చదువుకోవడానికి శరశ్చంద్ర అన్నయ్యగారు ఎంతో ప్రోత్సహించారనీ గుర్తుచేసు కొన్నారు. ఇలా మహిళా దినోత్సవంనాడు మహిళా అధ్యాపకులకు ప్రత్యేక సభా నిర్వహణతో డా॥ ఎ. సుధామ వంశీ గారి అధ్యక్షతన ఆర్.వరప్రసాద్ గారి సభా నిర్వహణతో డా॥హనుమత్ ప్రసాద్ గారి ఛలోక్తులతో సభముగిసింది. కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

జాతీయ ఓటరు దినోత్సవం

25-1-2020న కళాశాల ప్రిన్సిపాల్ డా॥ వి. హనుమంతయ్యగారి అధ్యక్షతన జాతీయ ఓటరు దినోత్సవ సభ నిర్వహింపబడినది. ప్రజాస్వామ్యానికి ఓటర్లు ఆయువుపట్టు అని విశదీకరించారు. ఇందు అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

21.2.2019 న ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషను కాపాడుకోవలసిన బాధ్యత భాషాభిమానులపై ఉందని, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డా॥ ఎ. సుధామ వంశీ వివరించారు. ఫిబ్రవరి 21 గురువారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు భాషా ప్రశస్తిని సోదాహరణంగా వివరించారు. బెంగాళీలు తమ మాతృభాషను కాపాడుకోవడానికి చేసిన ప్రాణత్యాగాలను వివరించారు. ఇదే వేదికపై తెలుగు అధ్యాపకులు డా॥ కె.వి.కోటయ్య గారు మాట్లాడుతూ తెలుగు భాషా సాహిత్యాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. తెలుగు పద్యం ఆద్యంతం హృద్యమనీ చెబుతూ తెలుగు పద్యంలోని వైవిధ్యాన్ని, వైశిష్ట్యాన్ని విపులీకరించారు. కాగా ఈ కార్యక్రమాన్ని తెలుగు అధ్యాపకులు డా॥ మడకా సత్యనారాయణ గారు నిర్వహించారు. అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని మాతృ భాషాభిమానులకు, సాహితీ వేత్తలకు జేజేలు పలికారు. పి.డి.సి. ప్రథమ సంవత్సరం (సంస్కృతం) విద్యార్థిని వసంత, పి.డి.సి. ద్వితీయ సంవత్సరం గోవింద్ తదితరులు ఈ సభలో మాట్లాడారు.