+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

దేశానికి యువత వెన్నముక లాంటిదని భారతదేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని నిర్వాహకులు తెలిపారు. సరైన విద్య, ఆరోగ్యం సమాజానికి ఎంతో అవసరమని గుర్తించిన ప్రభుత్వం  యువతను మేల్కొల్పడానికి అనేక అవగాహన సదస్సులను ఏర్పాటు చేసింది. 11.07.2020 గురువారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడి, గుంటూరు లో రెడ్ క్రాస్ క్లబ్ అధ్వర్యంలో WAY, AIDS మరియు రక్తదానం మీద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలాజ్యోతి విద్యార్థులకు AIDS పై అవగాహన కలిగించారు. హెచ్.ఐ.వి అనేది అంటువ్యాధి కాదని, అంటించుకునే వ్యాధి అని వివరించారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి సోకదని తెలియజెప్పారు. హెచ్.ఐ.వి పాజిటివ్ వచ్చిన యం.సుల్కమ్మ (బాపట్ల)  హెచ్.ఐ.వి వచ్చినవారు ధైర్యంతో ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.