by MOC IQAC | May 5, 2025 | Alumni, Alumni Interaction
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల – పూర్వ విద్యార్థుల సమావేశం
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం 2025 మే 5న కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. ఆన్నదానం హనుమత్ ప్రసాద్, అధ్యాపకులు మరియు పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. గౌరవనీయులు శ్రీ దినకర్ అన్నయ్యగారు పాల్గొన్నారు. సమావేశంలో పూర్వ విద్యార్థుల తమ అనుభవాలను పంచుకున్నారు. వారు సమాజంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తుచేశారు. ముఖ్యంగా పార్వతీపురం, పాలకొండ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని వివరించారు.
- పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అందించే అంశంపై చర్చ జరిగింది.
- ఆర్థికంగా బలహీనమైన విద్యార్థులకు ఉచిత విద్య అందించాలన్న అంశాన్ని పరిశీలించారు.
- విద్యార్థులను ఉత్తమంగా ప్రోత్సహించడానికి గోల్డ్ మెడల్స్ కొనసాగించాలంటూ పూర్వ విద్యార్థులు సూచించారు.
- కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెంచే విధానాలను చర్చించారు.
- కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం కోసం, మేనేజ్మెంట్ బ్రోచర్లు మరియు ఇతర ప్రచార సామాగ్రిని పంచింది.
- కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి. రాఘవేంద్రరావు గారు అనారోగ్య కారణంగా జరిగిన ఆకస్మిక మరణం పట్ల సంతాపం వ్యక్తం చేయబడింది.
- శ్రీమాన్ ఎస్. వి. రామకృష్ణమాచార్యులు గారికి (మాతృశ్రీ పాఠశాల రిటైర్డ్ హెడ్మాష్టర్) సంతాపం తెలిపారు.
- ప్రస్తుత విద్యార్థులకు ఇచ్చే భోజన నాణ్యతపై పూర్వ విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు.
- కళాశాల ప్రస్తుత విద్యార్థుల సంఖ్యపై చర్చించి, అభివృద్ధికి అనేక సూచనలు చేశారు.
పూర్వ విద్యార్థుల విరాళాలు:
శ్రీ సూర్యరావు గారు (1986–1991 బ్యాచ్): శ్రీ విశ్వజనని ట్రస్ట్, జిల్లెళ్ళమూడికి రూ. 1 లక్ష విరాళంగా అందించారు, ఇది ప్రస్తుత విద్యార్థుల అన్నదాన కార్యక్రమానికి ఉపయోగపడుతుంది.
- డా. ఎం. రామకృష్ణాంజనేయులు గారు (1985–1992 బ్యాచ్): కళాశాలకు రూ. 10,000 (పది వేల రూపాయలు) విరాళంగా అందించారు.
- ఈ సమావేశం పూర్వ విద్యార్థుల కళాశాల పట్ల ఉన్న బంధాన్ని, వారి సేవా దృక్పథాన్ని ప్రతిబింబించింది. కళాశాల అభివృద్ధి కోసం అందరూ కట్టుబడి ఉన్నారు.
by admin | Aug 26, 2020 | Alumni Interaction
శ్రీ జి.వై.యన్.బాబు విద్యాపరిషత్ కరస్పాండెంట్ గా చేస్తూ ఆకస్మికంగా 12.8.2000న అమ్మలో కలసిపోయిన సందర్భంలో శ్రీ విశ్వజననీపరిషత్ ఎగ్జిక్యూటీవ్ బాడీ 26 8. 2020 బుధవారం సమావేశమై కాలేజి పూర్వవిద్యార్థిని కాలేజి రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యల్. సుగుణను కరస్పాండెంట్గా పరిషత్ మిగిలిన సమయానికి ఏకగ్రీవంగా ‘నిర్ణయించడమైనది. గమనించగలరు.
by admin | Dec 19, 2019 | Alumni Interaction
నెల్లూరు వేద సంస్కృత కళాశాల నుంచి మాతృశ్రీ ఓరియంటలే కళాశాల ప్రిన్సిపాల్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డా॥ వి. హనుమంతయ్య గారిని 19-12-19న “పూర్వ విద్యార్థి సమితి” తరపున ప్రార్ధనా మందిరంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు సమక్షంలో ఘనంగా స్వాగత సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ అమ్మ ఆశీస్సులతో, గురువుల క్రమశిక్షణలో విద్యాధికులై దశదిశలా వ్యాపించి అమ్మ తత్త్వ సుగంధాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న (అ) పూర్వ విద్యార్థులు మాతృసంస్థలకు మూలస్థంభాలు లాంటివారని కొనియాడారు.
by admin | Dec 12, 2019 | Alumni Interaction
“ఆకలే అర్హత”గా అన్నం పెట్టమన్న విశ్వజననీ అమ్మ ఆశయాలకు అనుగుణంగా కళాశాల మరియు పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని 12.12.2019 గురువారం నుండి కళాశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అమ్మ ఆశీస్సులతో మరియు సంస్థవారి సహాయ సహకారాలతో నిర్విరామంగా కొనసాగాలని కళాశాల ప్రిన్సిపాల్ డా॥ వి.హనుమంతయ్య ఆశించారు. ప్రిన్సిపాల్ గారు నూతనంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి స్పందిస్తూ కొంతమంది కళాశాల పూర్వ విద్యార్థి సంఘం తరపున వారి సహకారాన్ని అందిస్తామని మాట ఇస్తూ తొలుతగా రూ. 2000/ నగదును ప్రిన్సిపాల్ గారికి అందజేశారు.
by admin | Nov 14, 2019 | Alumni Interaction
మెరుగుపెట్టకుండా రత్నం కూడా ప్రకాశవంతం కాదనీ, మా గురువులు మమ్మల్ని, ఈ రోజు ఒక ఉత్తమమైన అధ్యాపకవృత్తిని చేపట్టేవిధంగా చేశారని కళాశాల పూర్వవిద్యార్థులు తెలిపారు. గౌరవ పురస్కార మహోత్సవ కార్యక్రమం సందర్భంగా 14.11.2019 న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సభలో కళాశాల పూర్వ విద్యార్థులు తమ గురువులు సంస్కారవంతమైన చదువుతో మమ్మల్ని తీర్చిదిద్దారని తెలియజేశారు. డా॥ యల్. మృదుల గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ అథ్యక్షులు శ్రీ యమ్. దినకర్ గారు విచ్చేశారు. విద్యార్థులతో తాము చదువుతున్న విద్య ఎంతవరకు ఉపయోగిస్తుంది. ఎలా వారు పోటీ పరీక్షలలో పాల్గొని తమ జీవనోపాధిని పొందవచ్చు అనే అంశాలను వివరించారు. ఈ సందర్భంగా కళాశాలలో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలను పొందిన 14 మందికి గౌరవ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కొండముది ప్రేమ్కుమార్కు పూర్వవిద్యార్థులు సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
by admin | Aug 31, 2019 | Alumni Interaction
“నీ సేవలోనే నా బ్రతుకు సాగనీ నీ ధ్యాసలోనే నా శ్వాస ఆగనీ” అని అమ్మ సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన శ్రీ కొండముది రామకృష్ణ. గారి 21 వ సంస్మరణ సభ 31.8.2019 శనివారం రామకృష్ణ గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. కళాశాల ప్రిన్స్పాల్ డా॥ ఎ. సుధామవంశీ అధ్యక్షతలో జరిగిన ఈ సభలో రామకృష్ణ అన్నయ్య పెద్ద కుమారులు కొండముది సుబ్బారావు సంస్థ రెసిడెంట్ సెక్రెటరీ రావూరి ప్రసాద్, కమిటీ సభ్యులు చక్కా శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. రామకృష్ణ అన్నయ్య అడ్మినిస్ట్రేటరుగా, అంతరంగిక కార్యదర్శిగా, కవిగా, తత్వ ప్రచారకునిగా ప్రశంసించి వారితో తమకు గల అనుబంధాలను గుర్తుచేసుకొన్నారు. ఒక వ్యక్తి రచనలకు పి.హెచ్.డి పట్టాను ఇవ్వడం ఎంతో గర్వకారణం అని తెలుగు విభాగంలో లెక్చరర్ గా పనిచేస్తున్న ఎల్. మృదులగారిని సభాముఖంగా అభినందించారు. కార్యక్రమంలో కొండముది సోదరులు నాగేశ్వరరావు, ప్రేమ్కుమార్ గారు రవి సంస్థకు నగదు విరాళాన్ని ఇస్తున్నట్లుగా సభలో తెలియజేశారు. కొండముది రవిగారు అన్నయ్య రాసిన పాటలను గానం చేసి ఈ సందర్భముగా సంపూర్ణ విద్యార్థులుగా ఎంపికైన ఎన్. ప్రవీణ్ బి.ఏ. IIIrd Year, దుర్గాప్రసాద్ 10th Class లకు ఒక్కొక్కరికి 1,116 చొప్పున నగదు పురస్కారం అందించారు. ఇదే వేడుకలో చక్కా శ్రీమన్నారాయణగారు తమ తల్లితండ్రుల స్మృత్యర్థం ఫైనల్ ఇయర్ చదువుతున్న వి. శ్రావణి బి. ఏ. III Tel, యు. కృష్ణ బి.ఏ. III Tel లకు బహుమతులు అందజేశారు. అంతేగాక నంబూరి చింజీవిగారు హైస్కూల్లో చదువుతున్న యమ్. నవ్య (10th) కె. భరత్సాయి 10th విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులను అందజేశారు.