గురుపూర్ణిమ/Gurupoornima

గురుపూర్ణిమ/Gurupoornima

ఘనంగా గురుపౌర్ణమి కార్యక్రమం

ది 10.07.2025 గురువారం నాడు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో గురుపౌర్ణమి సందర్భంగా సభాకార్యక్రమం ఘనంగా జరిగింది. గుంటూరు  హిందూ కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు డాక్టర్ దీవి నరసింహ దీక్షిత్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. గురు పరంపర ద్వారానే భారతదేశం విశ్వగురువుగా నిలిచిందని, గురువు జీవితానికి మార్గదర్శకుడే కాక సంస్కృతి పరిరక్షకుడుగా కూడా ఉండాలని తెలిపారు. ఎంతోమంది శిష్యులను తయారు చేయడం వలన వ్యాసభగవానుడి పేరుతో ఈ పర్వదినము వ్యాసపూర్ణిమగా పేరొందిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నదానం హనుమత్ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీ విశ్వజనని పరిషత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ వల్లూరి ప్రేమ్ రాజ్ గారు, Honorary Chairman శ్రీ M.దినకర్ గారు, కోశాధికారి శ్రీ జన్నాభట్ల సుబ్రహ్మణ్యం గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్య అతిథికి ఘనంగా గురుసత్కారం చేశారు. అనంతరం గురుపాదుకాస్తోత్ర పారాయణ జరిగింది. కళాశాల విద్యార్థినీ విద్యార్థులే సభానిర్వహణ చేశారు. కళాశాల సంస్కృత విభాగ అధ్యక్షులు డాక్టర్ ఆర్ వరప్రసాద్ గారు వందనసమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో  కళాశాల అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది.

Guest Lecture by Prof. Vidyananda Aarya

Guest Lecture by Prof. Vidyananda Aarya

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల సంస్కృతవిభాగం తరుపున 26-12-2024 గురువారం రోజున అతిథి ఉపన్యాసం ఏర్పాటయింది.  ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం Head of the Department     Prof. విద్యానంద ఆర్య విచ్చేసి సంస్కృతభాష అధ్యయనం – ప్రయోజనాలు అనే అంశంపై ప్రసంగించారు. వీరు ఆధునిక సమాజంలో సంస్కృతభాషపై జరుగుతున్న వివిధ రకాల పరిశోధనలను తెలిపి భావితరాలకు అందబోతున్న సదవకాశాలను గురించి సవివరంగా తెలియజెప్పారు. అంతేకాక లక్షల సంవత్సరాల నుండి ఉనికిని కలిగి ఉన్న సంస్కృత భాష అన్నిభాషలకు మాతృభాష అనీ, సంస్కృతభాషలో ఉచ్చారణ పరంగా, ప్రాంతాల వారీగా, దశాబ్దాలవారీగా గానీ ఏవిధమైన మార్పులు జరగలేదనీ తెలిపారు. ప్రాంతీయ భాషాలు వివిధ దశలలో వివిధ రకాల మార్పులు సంతరించుకుంటుంటాయని సకలభాషలకు తల్లివంటిది కనుక ప్రతిభాష సంస్కృతం నుండే పుట్టిందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సభను సంస్కృతవిభాగాధ్యక్షులు డా. ఆర్. వరప్రసాద్ గారు నిర్వహించగా డా. వి. త్రయంబకం గారు వందన సమర్పణ గావించారు.