by MOC IQAC | May 17, 2025 | Swachh Bharat
స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర
“స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి వారిచే 2025 మే 17న మధ్యాహ్నం 3 గంటలకు గూగుల్ మీట్ ద్వారా Beat the Heat పై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ హనుమత్ప్రసాద్ గారు ప్రారంభించి, కార్యక్రమం ఉద్దేశ్యాన్ని వివరిస్తూ, వేసవిలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎలా ఉపయోగపడుతుందో వివరించారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ యల్. మృదుల గారు “Beat the Heat” అంటూ విద్యార్థులు వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి స్పష్టంగా వివరించారు. అదేవిధంగా సాధ్యమైనంత వరకు తోటివారికి సహాయపడవలసిందిగా సూచించారు.
NSS కోఆర్డినేటర్ శ్రీ టి. జయకృష్ణ గారు PowerPoint ప్రజెంటేషన్ ద్వారా వేడి సంబంధిత ఆరోగ్య సమస్యల నుంచి ఎలా తప్పించుకోవాలో విద్యార్థులకు స్పష్టమైన సందేశాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 10 మంది అధ్యాపకులు, 63 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో విద్యార్ధులకు అన్ని విషయాలు అవగాహన కల్పించేందుకు Quiz నిర్వహించి e-Certificates అందించారు.
by admin | Dec 9, 2019 | Vanam - Manam
ఈ రోజు అనగా డిసెంబర్ 9 వ తేదిన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ‘వనం ‘మనం’ కార్యక్రమం కింద ప్రిన్సిపాల్ డా. వి.హనుమంతయ్యగారి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్ధులు పాల్గొన్నారు. చెట్లను పెంచితే పర్యావరణ పరిరక్షణతో పాటు సహజ పరిరక్షణ కూడా జరుగుతుందని హనుమంతయ్య గారు వివరించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు అందరూ కలిసి కళాశాల విశాలమైన ప్రాంగణంలో మొక్కలు నాటి విద్యార్థులను ఉత్సాహపరిచారు.
by admin | Dec 9, 2019 | Vanam - Manam
ఈ రోజు అనగా డిసెంబర్ 9 వ తేదిన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ‘వనం ‘మనం’ కార్యక్రమం కింద ప్రిన్సిపాల్ డా. వి.హనుమంతయ్యగారి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్ధులు పాల్గొన్నారు. చెట్లను పెంచితే పర్యావరణ పరిరక్షణతో పాటు సహజ పరిరక్షణ కూడా జరుగుతుందని హనుమంతయ్య గారు వివరించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు అందరూ కలిసి కళాశాల విశాలమైన ప్రాంగణంలో మొక్కలు నాటి విద్యార్థులను ఉత్సాహపరిచారు.
by admin | Nov 26, 2019 | Vanam - Manam
కార్తీక వనమహోత్సవము సందర్భంగా నవంబరు 26-11-2019న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. పరస్పర సహకారం, మైత్రీ భావములను పెంపొందించే విధంగా ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ. సుధామవంశీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంస్థ పెద్దలు అడవుల దీవి మధు అన్నయ్యగారు, వై.వి.శ్రీరామమూర్తిగారు, దేశిరాజు కామరాజు గారు, చక్కా శ్రీమన్నారాయణ గారు, ఎమ్. శరశ్చంద్రగారు, బూదరాజు శ్యామ్ దంపతులు, మన్నవ నరసింహారావు గారు పలువురు కళాశాలకు విచ్చేశారు. అమ్మ చిత్రపటానికి పుష్పాలు అలంకరించి, నమస్కృతులు సమర్పించారు. విద్యార్థులను నిరంతరం అధ్యయనం చేసి ఉత్తమ ఫలితాలను సాధించాలని పెద్దలు తెలియజేశారు. కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
by admin | Nov 26, 2019 | Vanam - Manam
కార్తీక వనమహోత్సవం సందర్భంగా నవంబర్ 26-11-19న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణం -లో ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. పరస్పర సహకారం, మైత్రీ భావములను పెంపొందించే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు, కళాశాల ప్రిన్సిపల్ డా. ఎ. సుదామ వంశీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంస్థ పెద్దలు మనశయ్య గారు, వై.వి. శ్రీరామమూర్తిగారు, దేశిరాజు కామరాజుగారు, చక్కా శ్రీమన్నారాయణ గారు, ఎమ్. శరశ్చంద్రగారు, బూదరాజు శ్యామ్ దంపతులు, మనవ నరసింగారావుగారు కళాశాలకు విచ్చేశారు. అమ్మ చిత్ర పటానికి పుష్పాలు అలంకరించి, నమస్కృతులు సమర్పించారు. కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు
by admin | Nov 26, 2019 | Vanam - Manam
కార్తీక వనమహోత్సవము సందర్భంగా నవంబరు 26-11-2019న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. పరస్పర సహకారం, మైత్రీ భావములను పెంపొందించే విధంగా ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ. సుధామవంశీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంస్థ పెద్దలు అడవుల దీవి మధు అన్నయ్యగారు, వై.వి.శ్రీరామమూర్తిగారు, దేశిరాజు కామరాజు గారు, చక్కా శ్రీమన్నారాయణ గారు, ఎమ్. శరశ్చంద్రగారు, బూదరాజు శ్యామ్ దంపతులు, మన్నవ నరసింహారావు గారు పలువురు కళాశాలకు విచ్చేశారు. అమ్మ చిత్రపటానికి పుష్పాలు అలంకరించి, నమస్కృతులు సమర్పించారు. విద్యార్థులను నిరంతరం అధ్యయనం చేసి ఉత్తమ ఫలితాలను సాధించాలని పెద్దలు తెలియజేశారు. కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.