విజయవాడలో జనవరి 1 నుంచి 11 వరకు జరిగిన ’30వ విజయవాడ బుక్ ఫెస్టివల్’ లో శ్రీ విశ్వజననీ పరిషత్ తరఫున ఒక స్టాలును ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగముగా కొత్తగా విడుదలైన మాతృశ్రీ జీవిత మహోదధితో పాటు అమ్మ సాహిత్యం అందరికి అందేలా ఏర్పాటు చేయడమైంది. బుక్ ఫెస్టివల్కి వచ్చిన పుస్తక ప్రియులకు, ఆధ్యాత్మిక సాహిత్య అభిలాషకులకు పలు గ్రంథాలను డిస్కౌంట్ ధరకు కూడా అందించడమైంది. ఈ పుస్తక ప్రదర్శనను మాతృశ్రీ పాఠశాల సంస్కృత అధ్యాపకులు శ్రీ వల్లూరి త్రయంబకం గారు, పీడీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న హనుమత్ సాయి, గోవింద్ అనే విద్యార్థుల సహాయంతో సమర్థవంతంగా నిర్వహించారు. వీరందరికి వసతి, భోజన సదుపాయాలను ప్రెసిడెంట్ రామబ్రహ్మంగారు వారి స్వగృహమునందే ఏర్పాటు చేయడమే కాక, ఎంతగానో సహకరిస్తూ, ఈ కార్యక్రమ నిర్వహణలో వీరికి మార్గనిర్దేశనం చేశారు. కాగా ఈ బుక్ ఫెస్టివల్ సందర్భంగా ‘అమ్మ యొక్క తత్త్వ ప్రచారమునకు, అలానే ఫిబ్రవరి 17న జరిగే ‘ధాన్యాభిషేకం’ కార్యక్రమం గురించి, అమ్మను తెలిసిన వారికి, తెలియని వారికీ కూడా తెలియపరిచే ఒక చక్కని అవకాశం లభించినట్లుగా త్రయంబకంగారు తెలిపారు.
విజయవాడ బుక్ ఫెస్టివల్ లో అమ్మ సాహిత్య ప్రచారం, అమ్మ తత్త్యప్రసారం
by Parimala Vempati | Jan 1, 2018 | Book Exhibition | 0 comments