+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

విద్యారంగం పురోగతిలో నాక్ (NAAC) పాత్ర ప్రగతి ప్రదాయకమని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి.వై.ఎన్.బాబు వివరించారు. ఓరియంటేషన్ కార్యక్రమం జూన్ 3 వ తేది సోమవారంగుంటూరులోని హిందూ కళాశాలలో జరిగిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, గుంటూరు హిందూ కళాశాలలు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అధ్యాపకులు శ్రీ కె.వి.ఎస్.దుర్గాప్రసాద్ (హిందూ కళాశాల), డా॥ కె.విజయబాబు, IQAC కో-ఆర్డినేటర్, ప్రభుత్వ మహిళా కళాశాల, ఎమ్. వేనుబాబు తాడికొండ, డా|| ఎ. లీలామోహన్ విజ్ఞాన్ యూనివర్సిటీ, డా॥ పి.వేణుగోపాల్ హిందూ కళాశాల, డా॥ డి.ఎన్. దీక్షిత్, డా॥ ఎ.సుధామ వంశీ మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపల్ పలువురు అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ఉభయ పరిషత్ అధ్యక్షులు శ్రీ ఎమ్. దినకర్, పురుషోత్తమ పుత్ర భార్గవ శ్రీ పి.ఎస్.ఆర్.ఆంజనేయ ప్రసాద్, (విశ్వజననీ సంపాదకులు) మాతృశ్రీ విద్యా పరిషత్ కన్వీనర్ బొప్పూడి. రామబ్రహ్మం గారు, పలువురు అధ్యాపకులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాల సాధనలోను NAAC పాత్ర కీలకమని పలువురు వక్తలు వివరించారు. NAAC న్యూ మెథడాలజి ఓవర్ వ్యూ ను డా॥ విజయాబ్బాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలియజేసారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపల్ డా॥ ఎ. సుధామ వంశీ NAAC ప్రోగ్రామ్ కై పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారు. NAACకు సంబంధించిన అనేక అంశాలను సోదాహరణంగా వివరించడం పట్ల మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అధ్యాపకేతర సిబ్బంది తమ కృతజ్ఞతలు తెలిపారు.