+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

10.1.2020 శుక్రవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రార్థనా మందిరం లో పేరెంట్-టీచర్స్ మీటింగును ఏర్పాటు చేశారు. డా. వి. హనుమంతయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ యమ్. దినకర్ గారు, కళాశాల డెవలప్మెంట్ కమిటీ సభ్యులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ ప్రారంభంలోనే విద్యార్థుల తల్లిదండ్రులలో ఒక విద్యార్ధితల్లిని, ఒక విద్యార్ధితండ్రిని వేదికమీదకు ఆహ్వానించి వారికి సముచిత స్థానం కల్పించి గౌరవించడం జరిగింది. మనకు రెండురకాల విద్య అవసరం. ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది, రెండు ఎలా జీవించాలో నేర్పేది. అలాంటి ఉన్నత ప్రమాణాలతో ఇక్కడ విద్యను అందిస్తున్నామనీ శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు. తెలియజేశారు. విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఇక్కడ చదువుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. కళాశాలలో ఇంకా ఎలాంటి మార్పు ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని వారు ప్రిన్సిపాల్ గారి దృష్టికి తీసుకువచ్చారు. ప్రిన్సిపాల్ గారు దానికి స్పందిస్తూ పేరెంట్స్ సూచించిన విషయాలను పరిగణనలోకి తీసుకొని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.