+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

గుంటూరు జిల్లా, బాపట్ల మండలం, జిల్లెళ్ళమూడి గ్రామసరోవరంలో అరవిరిసిన వారిజాతం నెఱవిరిసిన పారిజాతం మన “మాతృశ్రీ ఓరియంటల్ విద్యాలయం”. ప్రాచ్య విద్యాను గంధాన్ని దిగంతాలకు వెదజల్లాలనే సత్సంకల్పంతో జగన్మాత శ్రీపరాత్పరి రాజరాజేశ్వరి అనసూయా దేవి- జ్ఞానపుష్పాలతావి అయిన అమ్మ స్వహస్తాలతో 1971 లో కళాశాలను ప్రారంభించారు. ఈ కళాశాల మొదట ఆంధ్రాయూనివర్సిటీ అప్లియేషన్తో ప్రారంభమై, ఆ తరువాత 1978 నుండి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధమై ఉన్నది.
శ్రీ విశ్వజననీ పరిషత్ ద్వారా కళాశాలలో చేరిన ఆంధ్ర-తెలంగాణ పరిసర సుదూరప్రాంతాల విద్యార్థులకు “డ్రస్సు అడ్రస్సుతో నిమిత్తం లేకుండా” ఉచితవిద్య, వసతి, భోజన, వైద్య సౌకర్యాలు దాదాపు 5 దశాబ్దాలుగా నిర్విరామంగా కల్పించడం గొప్ప విశేషం.
రాష్ట్రంలోనే మొదటి ఓరియంటల్ కళాశాలగా NAAC గుర్తింపుకు వెళుతున్న తరుణంలోశ్రీ విశ్వజననీ పరిషత్ పెద్దలు మరియు కరస్పాండెంట్ శ్రీ జి.వై.యస్.బాబుగారి ప్రయత్నంతో నవంబర్ 29, 2019న నెల్లూరు వేదసంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ డా॥ వి. హనుమంతయ్య గారు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించడం మరో విశేషం. శ్రీ విశ్వజననీ పరిషత్ జనరల్ సెక్రటరీ, శ్రీ కామరాజు గారు మరియు కరస్పాండెంట్ గారి ఆర్థిక, హార్దిక సహకారం మరియు ప్రియవిద్యార్థుల శ్రమదానంతో ప్రిన్సిపాల్ గారు. 17 రోజులలో కళాశాల ఆవరణాన్ని చూడముచ్చటగా తయారు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
2019-20 విద్యాసంవత్సరంనకు సంబంధించి రాష్ట్ర నలుమూలలనుండి 174(122+52) విద్యార్థినీ, విద్యార్థులు కళాశాలలో చేరియున్నారు. వీరిలో అర్హులైన దాదాపు 95 మందిని జ్ఞానభూమి పోర్టల్లో నూతనంగా “జగనన్న విద్యాదీవెన” స్కాలర్ షిప్ లకు కళాశాలలో రిజిష్టర్ చేయడం వలన విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం కల్పించినట్లయినది.
శ్రీవిశ్వజననీ పరిషత్ మరియు పూర్వవిద్యార్థుల సహకారంతో ప్రిన్సిపాల్ మరియు కళాశాల సమితి ఆర్థిక అధ్యాపకులు డిసెంబర్ 15, 2019 నుండి ప్రతిరోజు సాయంత్రం 5గంటలకు స్నాక్స్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
జనవరి 5, 2020 న మేనేజ్ మెంట్ వారి సహకారంతో బాయ్స్ విద్యార్థుల సౌకర్యార్ధం మొదటి సారిగా హాస్టల్ లో ల్యాండ్ లైన్ ఫోన్ ఏర్పాటు చేయటంతో సుదూరప్రాంతాలలో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడుకునే అవకాశం విద్యార్థులకు కల్పించబడింది.
క్రీడలు విద్యార్థులకు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆహ్లాదాన్ని కలిగించి చదువులో రాణించడానికి మరియు ఉత్తేజపరచడానికి ఎంతగానో దోహదపడతాయి. అటువంటి క్రీడలలో వార్షికపోటీలను జనవరి 7,8,9 – 2020 తేదీలలో అధ్యాపకులందరి సమక్షంలో నిర్వహించడం వలన విద్యార్థులలో స్పోర్టివ్ నెస్ ని కలిగించి ప్రోత్సాహక బహుమతులు ప్రకటించడం జరిగింది.
అమ్మా- నాన్నల ప్రేమే ప్రగతికి మూలం, ఎవడు లక్ష్యసిద్ధిని కలిగిస్తే వాడే గురువు అని చెప్పిన అమ్మ సూక్తుల ప్రమాణంగా, కరస్పాండెంట్ గారి మార్గదర్శనంతో కళాశాలలో జనవరి 10, 2020న ఉదయం 10 గంటలకు పేరెంట్ – టీచర్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులను కళాశాలల అధ్యాపకబృందం సాదరంగా ఆహ్వానించిన విధానం పేరెంట్స్ ను మైమరచేలా చేసింది. 112 మంది తల్లిదండ్రులతో ప్రార్థనామందిరంలో సంస్థ పెద్దల సమక్షంలో పేరెంట్ – టీచర్స్ మీట్ ప్రిన్సిపాల్ గారి అధ్యక్షతన అధ్యాపకుల సహకారంతో దిగ్విజయంగా జరిగింది.
25.1.2020 శనివారం నాడు నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమం జరిగింది. విద్యార్థినీ విద్యార్థులకు ఓటుహక్కు విలువను కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. హనుమంతయ్య తెలియజేశారు. అదేరోజు బాడీ ఫిటినెస్ఎవేర్ నెస్ ప్రోగ్రామ్ జరిగింది. శరీర దృఢత్వం దానివలన కలిగే మానసిక వికాసములు గురించి యోగా ట్రైనర్ అయిన శ్రీమతి సంగీత అంకతగారుప్రయోగాత్మక యోగాసనాలతో విద్యార్థులను ఉత్తేజపరచారు.
జనవరి 26 న రిపబ్లిక్ డే ఉత్సవాలను వినూత్నంగా సంస్థపెద్దలను ప్రిన్సిపాల్ గారు గార్డ్ ఆప్ ఆనర్ తో ఆహ్వానించిన విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆహ్వానితులు అవరసరస్వతి జగన్మాత అమ్మకు, అలాగే రాజ్యాంగ నిర్మాత డా॥బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయజెండాను గౌరవవందనంతో ఎగురవేశారు.
గణతంత్రదినోత్సవాన్ని ప్రిన్సిపల్ అధ్యక్షతన కళాశాల ప్రార్థనామందిరములో పెద్దల ఉపన్యాసాలతో, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో జాతీయనాయకులను స్మరించుకున్నారు. దేశాభివృద్ధిలో యువత ప్రధాన భూమికయని ప్రెసిడెంట్ శ్రీ దినకర్ గారు విద్యార్థులనుద్దేశించి ఉపన్యసించారు.
ఫిబ్రవరి 7 వ తేదీన ఆర్.టి.సి. స్పెషల్ బస్సులో జిల్లెళ్ళమూడి నుండి ఉదయం 7.35 ని.లకు వైజ్ఞానిక యాత్రకు ఫైనల్ విద్యార్థులు బయలుదేరినారు. 9.30 గంటలకు 150 సంవత్సరాలు మన చరిత్ర కలిగిన గుంటూరు హిందూ సంస్థలను దర్శించారు. మన కళాశాల కరస్పాండెంట్ జి.వై.యన్. బాబు గారు విజ్ఞానయాత్రను అభినందిస్తూ వచ్చిన బృందానికి ఆదరంగా స్వల్పాహారాన్ని గారు నెల్లూరు నుండి పంపించారు. ఏర్పాటు చేసారు.
మనకరస్పాండెంట్ గారికి మరియు హిందూ హైస్కూల్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పి, 11 గంటలకు యాత్రబృందం బయలుదేరి 12 గంటలకు అమరావతిలోని బౌద్ధారామం, రామలింగేశ్వర దేవాలయం దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ బొప్పూడి వివరించారు. రామబ్రహ్మంగారి నివాసానికి చేరినాము. విజ్ఞానయాత్రకు వచ్చిన 36 మంది విద్యార్థులకు మరియు 6 మంది అధ్యాపక సిబ్బందికి రుచికరమైన కుటుంబసభ్యులందరూ కలసి భోజన పదార్థాలను ఆదరంగా వడ్డించిన విధానం మరువలేనిది.
13.2.2020 గురువారం రోజు మాతృశ్రీ ఓరియంటల్ కాలేజెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో హెచ్.ఐ.వి మరియు ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డా. కె.నిర్మలాజ్యోతి ఆర్.ఆర్.సి. మాష్టర్ ట్రైనర్, జె.యమ్.జె. కాలేజ్, తెనాలి, పాజిటివ్ స్పీకర్ గా బాపట్ల నుండి యమ్. సుబ్బమ్మ గారు వచ్చి హెచ్.ఐ.వి. వచ్చిన వారు అధైర్యపడకుండా ఉండాలని తెలియజేశారు. ఈ సదస్సులో శ్రీమతి కె.అపర్ణ, మెడికల్ ట్రైనర్ విద్యార్థులకు హెచ్.ఐ.వి, ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. మన కళాశాల యస్.యస్.యస్. కో-ఆర్డినేటర్ శ్రీ జి. రాంబాబు గారు సమన్వయ కర్తగా వ్యవహరించారు.
ఫిబ్రవరి 20వ తేది ఉదయం విద్యార్థినులు వసతిగృహంలో, 21తేదీన విద్యార్థుల వసతి గృహంలో అమ్మ ఆగమన ఉత్సవాన్ని భక్తిప్రపత్తులతో జరుపుకొని రాబోవు పరీక్షలకు అమ్మ ఆశీస్సులు పొందినారు.
ఫిబ్రవరి 21 వ తేదీ మధ్యాహ్నం నుండి సంస్థ పెద్దల ఆశీస్సులతో కళాశాల వార్షికోత్సవ సంబరాలు అంబరాన్నంటేలా విద్యార్థుల ఆటపాటలతో, అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రార్థనా మందిరం శోభాయమానమయినది. 18 రకాల క్రీడలలో పాల్గొని విజేతలైన దాదాపు 137 మందికి పైగా విద్యార్థినీ, విద్యార్థులకు వినూత్నరీతిలో అమ్మ ప్రతిమతో ప్రత్యేకంగా ముద్రించిన 8 రకాలగోల్డ్, సిల్వర్, కాంస్య పతకాలు, కాలేజీ ట్రోపీ మరియు షీల్డ్స్ సంస్థ పెద్దలచే బహూకరించబడినవి. దాదాపు రూ. 15000 విలువైన మిరుమిట్లు గొలిపే బహుమతులన్నింటినీ అమ్మకు ప్రీతిపాత్రుడైన ఫార్మర్ ఫిజికల్ డైరెక్టర్, శ్రీ చంద్రమోహన్
4.3.2020 బుధవారం నాడు కోవిడ్ – 19 కరోనా వైరస్ ను గురించిన ఎవేర్ నెస్ ప్రోగ్రామ్ జరిగింది. ఆ అవగాహన సదస్సులో బాపట్ల నగర ప్రఖ్యాత వైద్యులు డా. ఇనజకుమారి గారు కరోనా వైరస్ దానివలన కలిగే అపాయాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రార్థనా మందిరములో 200 నాడు ప్రముఖ పాత్రికేయులు, సాహితీవేత్త ప్రత్యేకించి శ్రీ విశ్వజననీపరిషత్ పార్మర్ ప్రెసిడెంట్ గారైన స్వర్గీయ శ్రీ పొత్తూరి వేంకటేశ్వరావుగారి సంస్మరణ సభను సంస్థ పెద్దల మార్గదర్శనంతో ఘనంగా జరిగింది.
2019-20 విద్యాసంవత్సరంనకు గాను రాష్ట్ర నలుమూలలనుండి 174 మంది విద్యార్థులు. కళాశాలలో చేరియున్నారు. వారిలో 120 మంది నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులకు మార్చి 15 నాటికి పరీక్షలు వేసింది. పూర్తిచేసుకుని వారి స్వస్థలాలకు రైల్వే కన్సెషన్ పామ్స్ తో (కొంతమందికి) క్షేమంగా చేరినట్లు తెలిసినది.
జిల్లెళ్లమూడి నుండి బాపట్లలో పరీక్షలు వ్రాయు విద్యార్థులకు కొంతమేర ప్రయాణసాధనంగా ఉంటుందని మరమ్మత్తులకు గురై కొన్నాళ్ళుగా షెడ్ లో నిరుపయోగంగా ఉన్న సంస్థ అంబులెన్స్ ను జనరల్ సెక్రటరీ శ్రీ కామరాజు గారి సూచనల మేరకు ప్రిన్సిపాల్ గారు ఆ వాహనాన్ని డా. హనుమత్ ప్రసాద్ గారి ద్వారా చీరాలకు పంపించి, రిపేర్ చేయించి, కండిషన్ లోకి తీసుకురావడంతో విద్యార్థులకు ప్రయాణసాధనమైనది. దానికైన ఖర్చు రూ.14000 లు. అందులో రూ.10000 లు జనరల్ సెక్రటరీ గారు ఇవ్వగా, మిగిలిన రూ.4000 ప్రిన్సిపాల్
మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో మన ఓల్డ్ స్టూడెంట్ మరియు 2016 సంఘటన. డి.యస్.సి. లో సెలక్ట్ అయిన చి. వేంకటాచారి మార్చి 9వ తేదీన ఫైనల్ విద్యార్థులకు టి.పి.టి./బి.యిడి. ఎంట్రన్స్ పరీక్షల గురించి అవగాహన కల్పించారు.
మార్చి 14 శనివారం రోజున ఫైనల్ ఇయర్ మన పూర్వ విద్యార్థి డా.యమ్.రామచంద్రరావు గారిచే టి.పి.టి./ బి. యిడి. ఎంట్రన్స్ మరియు పోటీ పరీక్షలపై అవగాహన కల్పించి విద్యార్థులలో మనోధైర్యాన్ని, భవిష్యత్ కార్యాచరణను, పరీక్షలపట్ల కార్యోన్ముఖులను చేసారు. ఈ సందర్భంగా మన కళాశాల పూర్వవిద్యార్థి, రేపల్లె గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ శ్రీ గోలి రామచంద్రరావు గారు విద్యార్థుల కొరకు పోటీపరీక్షల పుస్తకాలనిమిత్తం రూ.5000లు ధాన్యాభిషేకం నాడు ప్రిన్సిపాల్ గారికి ఇచ్చినారు. దానికి రూ.3000లు చేర్చి, మొత్తం రూ.8000లకు ప్రిన్సిపాల్ గారు పుస్తకాలను పెద్దల సమక్షంలో విద్యార్థులకు బహూకరించారు.
వేదిక్ యూనివర్సిటీ క్రింది ఉన్న 45 మంది విద్యార్థులకు ఏప్రియల్ 4 నుండి పరీక్షలు జరుగుసని యూనివర్సిటీ తెలియజేసియున్నది. కరోనా వ్యాప్తి దృష్ట్యా మార్చి 22 న జనతాకర్ప్యూ తరువాత నుంచి భారతప్రభుత్వం విడతలవారీగా లాక్ డౌన్ ల దరిమిలా వేదిక్ యూనివర్సిటీ ఏప్రిల్ 4 నుండి జరుగవలసిన పరీక్షలను వాయిదా వేసింది.
కరోనా సమయంలోనే కమీషనర్,ఆర్. జె.డి. వారి ఆదేశాలమేరకు మరియు కరస్పాండెంట్ గారి సూచనల మేరకు ఏప్రిల్ 17 వ తేదీ నుండి కళాశాల అధ్యాపకులు ఆన్ లైన్ ద్వారా విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకుంటూ తరగతులు నిర్వహించడం,ఓరియంటల్ కళాశాలలో గొప్ప విశేషం.
లాక్ డౌన్ కారణంగా జిల్లెళ్ళమూడి క్షేత్రంలో చిక్కుకుపోయిన 45 మంది విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపించుటలో సంస్థ పెద్దలు మరియు కళాశాల కరస్పాండెంట్ గారు చొరవతీసుకుని, ప్రభుత్వాధికారులతో చర్చించి, మే 22 వ తేదీన జిల్లెళ్ళమూడి నుండి ప్రత్యేకవాహనాల ద్వారా విద్యార్థులను విజయవాడ వరకు చేర్చి, అక్కడనుండి మరొక ప్రత్యేక బస్సులో వారినందరినీ గమ్యస్థానాలకు చేర్చినవిధానం ఒక సాహసోపేత సంఘటన.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సర్యులర్ ప్రకారం జూలై 6 వ తేదీ నుండి 2020-21 విద్యాసంవత్సరం సిలబస్ ను ఆన్ లైన్ /కాన్ఫరెన్స్ క్లాసులు ద్వారా ప్రారంభించారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అధ్యాపకులు ప్రత్యేకమైన సమయసారిణిని ప్రకారం విద్యార్థులకు ఆన్ లైన్ – కాన్ఫరెన్స్ క్లాసులు మొదలుపెట్టారు. విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకుంటూ, కరోనా సమయంలో జాగ్రత్తలు తెలియజేస్తూ, ఐ.సి.టి మోడ్ లో నూతన పాఠాలను ప్రారంభించి ఇతర కాలేజ్ లకు ధీటుగా ఓరియంటల్ ఉపయోగించుకుంటూ విద్యాపరంగా నూతన ఒరవడిని సృష్టిస్తున్నారు. ఈ విధానాన్ని మొదటగా ప్రోత్సహించిన కరస్పాండెంట్ శ్రీ జి.వై.యస్ బాబుగారికి ధన్యవాదాలు మరియు విద్యార్థులకు లాక్ డౌన్ లో సైతం టెక్నాలజీ ద్వారా విజ్ఞానాన్ని అందిస్తున్న కళాశాల అధ్యాపకులకు అభినందనలు. అధ్యాపకుల ఆన్ లైన్ క్లాసుల ఫీడ్ బ్యాక్ ని ఎప్పటికప్పుడు రికార్డ్ చేసి కళాశాల నుంచి సి.సి.ఇ. వెబ్ సైట్ కి పంపిస్తున్న కంప్యూటర్ ప్యాకల్టీ శ్రీ వి. రోషన్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు.