+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

సంస్కారవంతమైన ఆలోచనలు చేస్తూ దీర్ఘమైన  నినాదాలని జి.యల్.మునోహర్ గారు తెలిపారు. ది. 12.2.2020 బుధవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వ్యక్తిత్వ వికాసంపై అవగాహన సదస్సు జరిగింది. ఇక్కడ చదివే విద్యార్థులు అమ్మ సంపూర్ణ అనుగ్రహాన్ని పొందియున్నారని మనోహర్ గారు తెలిపారు. విద్యార్థులతో మమేకమై, పలువిధాలుగా ప్రశ్నించి నిజమైన వ్యక్తిత్వం అంటే ఏమిటో వారి నుంచి రాబట్టారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.వి. హనుమంతయ్య గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.  వ్యక్తిత్వమనేది మానవునికి కనిపించని భూషణమనీ, మనలోని ఆలోచనలకి, భావాలకి, ప్రవర్తనకి సంబంధించినదే వ్యక్తిత్వమనీ వివరించారు. ఈ కార్యక్రమం చివరిలో మనోహర్ గారిని ప్రిన్సిపాల్ తో పాటు సంస్థ పెద్దలు శాలువాతో సత్కరించారు. ఈ సమావేశంలో అధ్యాపకులు, విద్యార్థులు, సంస్థపెద్దలు పాల్గొన్నారు.