+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

అని భగవద్గీత ప్రపంచానికి తెలియజేశారు. మానవీయ విలువలను పెంపొందించే దిశగా గీతా జయంతిని పురస్కరించుకొని ది. 12, ఆగష్టు, 2019న విశ్వజననీ పరిషత్ మరియు మాతృశ్రీ ప్రాచ్య కళాశాల ఆధ్వర్యంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి.వి.యన్.బాబుగారు మరియు ప్రిన్సిపాల్ డా.వి. హనుమంతయ్యగారు అన్నపూర్ణాలయం వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభలో ఎమ్. దినకర్ గారు పాల్గొన్నారు. కళాశాలను ఒక ఉన్నతమైన లక్ష్యంతో అమ్మ స్థాపించిందని ఆ లక్ష్యానికి అనుగుణంగా ఇక్కడ విద్య, భోజన, వైద్య సంరక్షణ సదుపాయాలు కొనసాగుతున్నాయని రామబ్రహ్మం గారు తెలియజెప్పారు. సంస్థ ప్రెసిడెంట్ యమ్. దినకర్ గారు మాట్లాడుతూ భగవద్గీత మానవతా.. విలువలను పెంపొందించే ఒక అద్భుతమైన గ్రంథమని పలు ఉదాహరణలతో సవివరంగా తెలియజెప్పారు. కళాశాల పక్షాన డా॥ సుధామవంశి, డా॥ కె.వి.కోటయ్య, డా॥ ఎ.హనుమత్ ప్రసాద్ లు భగవద్గీత ప్రాశస్త్యాన్ని విద్యార్ధులకు వివరించారు. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లములతో విద్యార్థులు తమకు తెలిసిన విషయాలను చక్కగా చెప్పారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు అధ్యాపకులు పి. మధుసూదన్ గారు నిర్వహించారు. సంస్కృత ఆంధ్రాలను అభ్యసిస్తున్న మనమందరం సంస్కృతిని, భగవద్గీతలోని అంతర్యాన్ని భావితరాలకు వ్యాపింపజేయాలని రామబ్రహ్మంగారు పిలుపునిచ్చారు. శాంతి మంత్రంతో ఈ కార్యక్రమం ముగిసింది.