అహంకార మమకారాలను తొలగించుకుంటే స్వధర్మాన్ని నెరవేర్చుకోవచ్చు. “స్వధర్మే నిధనం శ్రేయః” అని
భగవద్గీతలో చెప్పిన వాక్యాన్ని శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు వివరించారు. 22.7.2019 సోమవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ‘భగవద్గీత – లైఫ్ స్కిల్స్’ అనే అంశంపై జరిగిన ఉపన్యాసంలో ఆయన మాట్లాడుతూ భగవద్గీతలోని అనేక విషయాలు నిత్యజీవితంలో పాటించగలిగితే జీవనం సుగమం అవుతుందని వివరించారు. భగవద్గీత మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్దగలదని, యోగము అనగా సమత్వము అని అది అమ్మ మనకు ఆచరణలో చూపించిందని, విద్యార్థులంతా అమ్మ తత్వాన్ని కూడా అలవర్చుకోవాలని తెలియచెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.సుధామవంశీ గారి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో 1976-78 సంవత్సరం నాటి పూర్వ విద్యార్థులు పాల్గొనటం విశేషం.