+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

కార్తీక వనమహోత్సవ సందర్భంగా డిసెంబరు 6వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.సుధామవంశి మాట్లాడుతూ భారతీయ సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతను వివరించారు. ఇలాంటి వేడుకల సంప్రదాయాల పరిరక్షణ పరస్పరం సహకారం, మైత్రీభావాలను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యల్.సుగుణ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సంస్థ పెద్దలు వల్లూరి రమేష్ తదితరులు తమ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ చిత్రపటానికి పుష్పాలంకారణ, శ్రీ దామోదర గణపతికి పుష్పమాలాంకరణ నిర్వహించి నమస్కృతులు సమర్పించారు. ఉత్తమ ఫలితాలు సాధించడం లక్ష్యంగా విద్యార్థులు నిరంతర అధ్యయనానికి పూనుకోవాలని హితవు పలికారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులు మాట్లాడుతూ అందరికీ తమ ధన్యవాదాలు తెలిపారు.