+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

కార్తీక వనమహోత్సవము సందర్భంగా నవంబరు 26-11-2019న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. పరస్పర సహకారం, మైత్రీ భావములను పెంపొందించే విధంగా ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ. సుధామవంశీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంస్థ పెద్దలు అడవుల దీవి మధు అన్నయ్యగారు, వై.వి.శ్రీరామమూర్తిగారు, దేశిరాజు కామరాజు గారు, చక్కా శ్రీమన్నారాయణ గారు, ఎమ్. శరశ్చంద్రగారు, బూదరాజు శ్యామ్ దంపతులు, మన్నవ నరసింహారావు గారు పలువురు కళాశాలకు విచ్చేశారు. అమ్మ చిత్రపటానికి పుష్పాలు అలంకరించి, నమస్కృతులు సమర్పించారు. విద్యార్థులను నిరంతరం అధ్యయనం చేసి ఉత్తమ ఫలితాలను సాధించాలని పెద్దలు తెలియజేశారు. కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.