+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

కార్తీక వనమహోత్సవం సందర్భంగా నవంబర్ 26-11-19న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణం -లో ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. పరస్పర సహకారం, మైత్రీ భావములను పెంపొందించే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు, కళాశాల ప్రిన్సిపల్ డా. ఎ. సుదామ వంశీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంస్థ పెద్దలు మనశయ్య గారు, వై.వి. శ్రీరామమూర్తిగారు, దేశిరాజు కామరాజుగారు, చక్కా శ్రీమన్నారాయణ గారు, ఎమ్. శరశ్చంద్రగారు, బూదరాజు శ్యామ్ దంపతులు, మనవ నరసింగారావుగారు కళాశాలకు విచ్చేశారు. అమ్మ చిత్ర పటానికి పుష్పాలు అలంకరించి, నమస్కృతులు సమర్పించారు. కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు