+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

ఎంచుకున్న రంగంలో పురోగతిని సాధించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారి సతీమణి రమాదేవి పేర్కొన్నారు. 8.3.22. మంగళవారం నాడు మహిళా దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల-జిల్లెళ్ళమూడి, రోటరీ క్లబ్ బాపట్ల సంయుక్తంగా సభను ఏర్పాటు చేశారు. మహిళలు చైతన్యవంతులుగా ఉంటే సమాజం పురోభివృద్ధిని సాధిస్తుందని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ రావినూతల వరప్రసాద్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం. జరిగింది. ఈ కార్యక్రమంలో ఎ. శివ కుమారి గారు ఉమెన్స్ సెల్ ఆఫ్ రోటరీ క్లబ్ మాట్లాడుతూ లింగ భేదం లేకుండా అన్ని రంగాలలో స్త్రీలు ప్రవేశించినట్లైతే ఆర్థిక ప్రగతిని సాధించవచ్చునని గణాంకాలతో వివరించారు. రోటరీక్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాసు గారు సంస్కృతం, తెలుగులో ఎక్కువ మార్కులు సాధించిన వారికి ప్రమాణ పత్రాలను అందించారు. విశ్వజననీ కార్యవర్గ సభ్యులు డి. కామరాజు గారు, పి.గిరిధర్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశ్వజననీ పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ కె. రామకృష్ణగారు మాట్లాడుతూ స్త్రీ, తల్లిగా, చెల్లిగా, సేవామూర్తిగా నేడు అందరి మన్ననలు పొందుతూ ముందుకు వెళ్తోందని వివరించారు. అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.