+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

మెరుగు పెట్టకుండా రత్నం ప్రకాశవంతంకాదనీ, గురువులు మమ్మల్ని సానబెట్టి, ఈ రోజు ఒక ఉత్తమమైన అధ్యాపక వృత్తిని చేపట్టేవిధంగా చేశారని కళాశాల పూర్వవిద్యార్థులు తెలిపారు. గౌరవ పురస్కార మహోత్సవ కార్యక్రమ సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థులు తమ అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకున్నారు.  డా. యల్. మృదుల గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు శ్రీయమ్ దినకర్ గారు విచ్చేశారు. విద్యార్థులకు తాము చదువుతున్న విద్య ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎలా వారు పోటీ పరీక్షల్లో పాల్గొని తమ జీవనోపాధిని పొందవచ్చు అన్న విషయాన్ని వివరించారు. ఈ సందర్భంగా కళాశాలలో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలను పొందిన 14 మందికి గౌరవ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రేమ కుమార్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.