అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

21.2.2019 న ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషను కాపాడుకోవలసిన బాధ్యత భాషాభిమానులపై ఉందని, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డా॥ ఎ. సుధామ వంశీ వివరించారు. ఫిబ్రవరి 21 గురువారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు భాషా ప్రశస్తిని సోదాహరణంగా వివరించారు. బెంగాళీలు తమ మాతృభాషను కాపాడుకోవడానికి చేసిన ప్రాణత్యాగాలను వివరించారు. ఇదే వేదికపై తెలుగు అధ్యాపకులు డా॥ కె.వి.కోటయ్య గారు మాట్లాడుతూ తెలుగు భాషా సాహిత్యాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. తెలుగు పద్యం ఆద్యంతం హృద్యమనీ చెబుతూ తెలుగు పద్యంలోని వైవిధ్యాన్ని, వైశిష్ట్యాన్ని విపులీకరించారు. కాగా ఈ కార్యక్రమాన్ని తెలుగు అధ్యాపకులు డా॥ మడకా సత్యనారాయణ గారు నిర్వహించారు. అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని మాతృ భాషాభిమానులకు, సాహితీ వేత్తలకు జేజేలు పలికారు. పి.డి.సి. ప్రథమ సంవత్సరం (సంస్కృతం) విద్యార్థిని వసంత, పి.డి.సి. ద్వితీయ సంవత్సరం గోవింద్ తదితరులు ఈ సభలో మాట్లాడారు.

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

ఫిబ్రవరి 21 ఆదివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సభలో మాతృభాష విజ్ఞానమయకోశానికీ, ఆనందమయకోశానికీ ఉత్ప్రేరకమని డా.కె.సత్యమూర్తిగారు మాతృభాష ఆవశ్యకతను, ఔన్నత్యాన్ని విశదీకరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. సుధామవంశీ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకమిత్రులు విద్యార్థులు పాల్గొన్నారు. అధ్యక్షులు తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగులోని మాధుర్యాన్ని హృద్యమైన పద్యాలలో దాగి ఉండే అంతరార్థాన్ని తెలియజెప్పారు. ఇదే వేదికపై తెలుగు అధ్యాపకులు, పూర్వ విద్యార్థి శ్రీ పి. మధుసూదన్ గారు మాట్లాడుతూ ప్రాచ్య కళాశాలను స్థాపించడంలో అమ్మ యొక్క దూరదృష్టి, దివ్యదృష్టి అగణితమైనదని, అమ్మ ఆశయాలు భాషాభిమానుల ద్వారా నేడు నెరవేరుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు శాఖాధ్యక్షురాలు డా.యల్. మృదుల నిర్వహించగా కె. వెంకటేష్ వందన సమర్పణ ఈ చేశారు. కార్యక్రమంలో పి.డి.సి ప్రథమ సంవత్సరం చదువుతున్న యమ్. మనస్విని, సంస్కృత విద్యార్థి మలయప్ప, బి.ఏ. ఫైనల్ ఇయర్ విద్యార్థిని పూర్ణిమ, పైనల్ ఇయర్ విద్యార్థి మురళి తెలుగు భాష ఔన్నత్యాన్ని తమ మాటలలో వివరించారు. శోభనా సులభాగతి పోతన ఉత్పలమాలికను శ్రావ్యంగా ఆలపించింది. అదేవిధంగా బి.ఏ. సెకండ్ ఇయర్ విద్యార్థి అంజనేయులు నృసింహావతార ఘట్టాన్ని హావభావాలతో ఆలపించి అందరినీ ఆకట్టుకున్నాడు. శాంతిమంత్రంతో కార్యక్రమం ముగిసింది

అమ్మ ఆగమనోత్సవం

20.2.2019 న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థినుల వసతి గృహంలో ఫిబ్రవరి 20 వ తేదీ బుధవారం అమ్మ ఆగమనోత్సవం కార్యక్రమంలో సంస్థ పెద్దలు శ్రీ యమ్. శరశ్చంద్రగారు, డా|| బి.యల్. సుగుణ గారు, బూదరాజు వాణి గారు తదితరులు సంస్థలోని వారు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. విద్యార్థినులు అమ్మను పూజించుకున్నారు.

విద్యార్థులకు బహుమతి ప్రధానం

15.02.2019 న సమాజాన్ని ప్రతిబింబించే సాహిత్యం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ప్రముఖకవి విశ్రాంత జిల్లా ప్రభుత్వ ఖజానా సహాయాధికారి అల్లం జగపతిబాబు వివరించారు. శుక్రవారం జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సాహితీ సదస్సులో ఆయన మాట్లాడుతూ సాహిత్యంలో ప్రజాజీవితం ప్రతిబింబించాలని తెలిపారు. కాళాశాల ప్రిన్సిపాల్ డా॥ సుధామ వంశీ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా “షోడశి” తదితర గ్రంథాలను విద్యార్థులకు బహూకరించారు. ఉత్తమ సాహిత్యానికి దిశా నిర్దేశం చేసే శక్తి ఉంటుందని అల్లం జగపతిబాబు సోదాహరణంగా తెలిపారు. ఇదే వేదికపై విద్యార్థులకు వివిధ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం జరిగింది. “అమ్మ సందేశం సమాజాభ్యుదయం” సమాజ ప్రగతిలో విద్యార్థుల పాత్ర, “మాతృభాషా మాధుర్యము”, “విశ్వజనిగా అమ్మ” అనే అంశాలపై వివిధ స్థాయిలలో వక్తృత్వపు పోటీ జరిగింది. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అమ్మ ఆగమనోత్సవం మరియు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థినుల వసతి గృహంలో ఫిబ్రవరి 20వ తేదీ సోమవారం అమ్మ ఆగమన ఉత్సవం జరిగింది. నూతనంగా భవన నిర్మాణం చేసిన ఈ వసతి గృహంలో విద్యార్థినులు పచ్చని తోరణాలతో రంగవల్లులతో పుష్పాలతో అలంకరణలు చేసి అమ్మను భక్తిశ్రద్ధలతో అర్చించారు. కార్యక్రమంలో పలువురు సంస్థ పెద్దలు పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించారు.
ఫిబ్రవరి 21వ తేదీ మంగళవారం రోజున విద్యార్థుల వసతిగృహంలో అమ్మ ఆగమన ఉత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి అమ్మ సంస్థల వారసత్వ ట్రస్టీ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు టెంపుల్స్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ యమ్. దినకర్ గారు మరియు కమిటీ సభ్యులు డి. వి. యన్. కామరాజు గారు, ఐ. రామకృష్ణ గారు, యమ్. సాయిబాబా గారు, వి. బసవరాజు గారు పాల్గొన్నారు. విద్యార్థులు లలితా సహస్రనామ పారాయణ చేశారు.
అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు కళాశాల లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సభ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. వరప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధ్యాపకులు సంస్కృత ఆంధ్రభాషల ప్రాశస్త్యం గురించి వివరించారు. శాంతి మంత్రంతో కార్యక్రమం ముగిసింది. NAAC అవగాహన సదస్సు
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఫిబ్రవరి 13వ తేదీన NAAC విషయంలో పురోగతి సాధించుటకు విద్యార్థులతో, అధ్యాపక, అధ్యాపకేతర బృందంతో విడివిడిగా” అవగాహన సదస్సులు” ఏర్పాటు చేయుట జరిగింది. ఈ సదస్సులో ప్రధానంగా SVJP Trust సభ్యులు, College Development Committee Member శ్రీ. బొప్పూడి రామబ్రహ్మం గారు SVJP Temple Trust, Managing Trustee, Sri M. దినకర్ గారు, పాల్గొని NAAC ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవసరమైన సలహాలు, సూచనలు అందజేయుట జరిగింది.
ధాన్యాభిషేకం
ఆధ్యాత్మిక క్షేత్రమైన జిల్లెళ్ళమూడిలో నాన్నగారి ఆరాధనోత్సవాలు ఫిబ్రవరి 17వ తేదీ. శుక్రవారం రోజున అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గ సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ గారు, తదితర ప్రముఖులు విచ్చేసి అమ్మ, నాన్న గార్ల ఆశీస్సులు అందుకున్నారు. శ్రీ విశ్వజననీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులకు పలువురు దాతలు విద్యార్థులను ప్రోత్సహిస్తూ నగదు బహుమతులను అందించారు. వారి వివరములు……
17th. ఫిబ్రవరి బహుమతుల వివరములు 2023
17-02-2023 వ తేదీన శ్రీ నాన్నగారి ధాన్యాభిషేక మహోత్సవము సందర్భముగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో విద్యనభ్యసించు విద్యార్థినీ విద్యార్థుల విద్యాభివృద్ధికై ప్రోత్సాహకంగా వివిధ దాతలు ప్రకటించిన విరాళములకు గాను 2022-23 విద్యా సంవత్సరపు విద్యార్థుల ఎంపిక.
1. శ్రీ నండూరి నరసింహారావు రాజ్యలక్ష్మి దంపతుల స్మారక చిహ్నంగా శ్రీ నండూరి గోవిందరావు గారు విద్యార్థులకు ప్రదానము చేయు రజతపతకం తెలుగు మరియు సంస్కృతం డిగ్రీ స్థాయిలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థిని విద్యార్థులకు. (Cell No: 9849801490.)
పేరు : 1.M.Shyamalika BA (OL) – III SKT Rs. 2250/- 2.
2. శ్రీ గుడిపూడి ఉమాశంకర్ తమ తల్లిదండ్రుల స్మారకచిహ్నంగా పాఠశాలనుండి కళాశాలకు వచ్చి P.D.C. 1st Year లో అత్యధిక మార్కులు సాధించిన పేద బ్రాహ్మణ విద్యార్థికి గాని బ్రాహ్మణేతర విద్యార్థికి గాని రూ.35000/- లు నగదు పై వచ్చే వడ్డీ Rs.1784/- (Rs.446+446+446+446).
పేరు : తరగతి :
S.Devi – I – PDC TEI
K.Jhansi – I – PDC TEI
Ch. Kiranmai – PDC TEI
A.Manikumar Reddy – PDC TEI
3. శ్రీ గుడిపూడి పాండురంగ విఠల్ గారు పేద విధేయ విద్యార్థికి ప్రోత్సాహక వేతనముగా ప్రతి సంవత్సరం రూ.30000/- ల పై వచ్చే వడ్డీ Rs.1500/- (Rs.500 +500+500). (Cell No: 944093976)
పేరు : తరగతి :
1 K. Simhareddy – III – BA-SKT
T. Alekhya – III – BA-SKT
K. Sai Sruthi – III – BA-SKT
4. శ్రీ వల్లూరి పార్ధసారధిరావు గారు PDC స్థాయిలో ఇంగ్లీష్ నందు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఇద్దరికి రూ. 558+558 = Rs.1116.
పేరు : తరగతి :
1A.Nitya Santoshini – II – PDC – TEL
2 D.Vani – II – PDC – TEL
5. శ్రీ ప్రసాదవర్మ కామఋషి గారు డిగ్రీ స్థాయిలో మరియు PDC స్థాయిలో ప్రత్యేకంగా తెలుగులో అత్యధిక మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులకు ప్రధానము చేయు రూ.1116 + 1116 మరియు P.D.C స్థాయిలో 558/- + 558/- ల నగదు బహుమతి. (Cell No:9441274034).
పేరు : తరగతి :
1 S.Usha Rani – III – BA – SKT
2 K. Jeeva Kumar – III – BA – TEL
1 P.Lakshmaiah – I – BA – SKT
2 A. Nitya Santhoshini I – BA – TEL
6. శ్రీ ఐ.హనుమబాబు గారి స్మారక చిహ్నంగా సేవా కార్యక్రమాలలో స్వచ్చందంగా పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు వారి కుమారుడు శ్రీ ఐ.కృష్ణశర్మ గారు అందించే ప్రోత్సాహక నగదు బహుమతి ఇద్దరికి Rs. 2232/- (1,116/- + 1,116/-) Cell No – 9490245437
పేరు : తరగతి :
1K.Bhagavanulu – III – BA – SKT
2 Ch. Raju – III – BA – TEL