by admin | Jan 26, 2019 | National Commemorative Days
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఘనంగా జరిగాయి. విశ్రాంత భారత ఎన్నికల కమీషనర్ శ్రీ జి.వి.జి.కృష్ణమూర్తిగారు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతకాన్ని ఎగురవేసి గౌరవవందనాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశం ఒక ఆధ్యాత్మిక దేశమనీ, మన దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా విద్యార్థులుండాలనీ హితవు పలికారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం అయిన జిల్లెళ్ళమూడిలో తాను ఈ రోజు పతాకావిష్కరణ చేయడం ఆనందంగా ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో సంస్థ పెద్దలు ఛీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావుగారు, మేనేజింగ్ ట్రస్టీ యమ్. దినకర్గారు, శ్రీరామమూర్తిగారు, బి.రామచంద్రగారు, చక్కా శ్రీమన్నారాయణగారు తదితరులు పాల్గొని జాతీయ పతాకానికి గౌరవవందనం చేసి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు దేశభక్తి పెంపొందించే పాటలతో, మాటలతో అందరినీ అ లరించారు. విద్యార్థుల దేశభక్తి పూర్వక క్రీడావిన్యాసం అందరినీ అ లరించింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ప్రేమకుమార్ గారు తమ సందేశాన్ని అందించారు. తెలుగు అధ్యాపకులు పి.మధుసూదన్ గారు రాజ్యాంగాన్ని గూర్చి సవివరంగా తెలియజేశారు. అనంతరం మిఠాయి పంపిణీ జరిగింది.
by admin | Jan 26, 2019 | Cultural
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల లో ఘనంగా జరిగాయి. విశ్రాంత భారత ఎన్నికల కమిషనర్ అధికారి జి.వి.జి కృష్ణమూర్తి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనాన్ని సమర్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. సుధామ వంశీ గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశం ఒక ఆధ్యాత్మిక దేశమనీ, మన దేశ గౌరవాన్ని ఇనుమడింప జేసే విధంగా విద్యార్థులు ఉండాలని హితవుపలికారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం అయిన జిల్లెళ్ళమూడి గ్రామంలో పతాకావిష్కరణ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ పెద్దలు శ్రీ బ్రహ్మాండం రవీంద్ర రావు గారు, మేనేజింగ్ ట్రస్ట్ యమ్. దినకర్ గారు, శ్రీరామమూర్తి గారు, శ్రీ రామ చంద్రగారు, శ్రీమన్నారాయణ గారు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పలు దేశభక్తి గీతాలను ఆలపించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, శ్రీ ప్రేమకుమార్ గారు తమ సందేశాన్ని అందించారు.
by admin | Jan 15, 2019 | Alumni
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి పూర్వవిద్యార్థులు శ్రీకాకుళం జిల్లా మగ్గూరు గ్రామంలో 15-1-2019 తేదీన (మకర సంక్రాంతినాడు) విద్యార్థులకు సాహిత్య పోటీలు నిర్వహించారు.
by admin | Jan 10, 2019 | Local Functions
వార్తలు ఆధ్యాత్మిక, ధార్మిక, పారమార్థిక గ్రంథాలు ఉత్తమమైన మానసిక స్థితికి తోడ్పడుతాయని “అమ్మలో అమ్మ” గ్రంథకర్త వేదాద్రి బ్రహ్మజ్ఞాన కేంద్రం నిర్వాహకులు, విశ్రాంత అధ్యాపకులు అయిన స్వామి ఓంకారానందగిరి వివరించారు. ఈ నెల 10వ తేదీ గురువారం వాత్సల్యాలయం సమావేశమందిరంలో జరిగిన సభలో తాను రచించిన “అమ్మలో అమ్మ” గ్రంథావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. వసుంధరక్కయ్య జ్యోతి ప్రజ్వలనం చేశారు. ప్రిన్సిపాల్ శ్రీ సుధామవంశి ప్రారంభించారు. ఉభయపరిషత్తుల అధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు ఈ సభకు అధ్యక్షత వహించగా కరస్పాండెంట్ శ్రీపి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్గారు. చీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు, గ్రంథావిష్కరణ చేశారు. విశ్రాంత్ర ప్రిన్సిపాల్ డా. బి.యల్.సుగుణ, అమ్మభక్తులు టి.టి. అప్పారావు శ్రీ యం. దినకర్ తదితర ప్రముఖులు ప్రసంగించారు
by admin | Jan 5, 2019 | Programs
తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీలో మాలిక ఎంపికైంది. జిల్లెళ్లమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎ.సుధామ వంశీ, అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఎంపికైన అనంతరం మాలిక 2019 జనవరి 5వ తేదీన అగర్తలలో నిర్వహించే పోటీలో పాల్గోనున్నందుకు అభినందించారు. సంస్థ పెద్దలు, కళాశాల కరస్పాండెంట్ వి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారు విద్యార్థిని ఎంపికపై వర్షం వ్యక్తం చేశారు. కుమార సంభవంపై ఈ పోటీ జరగనున్నట్లు తిరుపతి సంస్కృత విద్యా పీఠం వారు స్పష్టం చేశారు.