by admin | Nov 24, 2018 | Awarness Programs
రవాణారంగం పటిష్టంగా ఉండాలంటే రోడ్డురవాణా భద్రత ముఖ్యమని వెదుళ్లపల్లి SI వివరించారు. నవంబరు 24 వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవాలలో యం.మోహన్ పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. సుదామ వంశీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చట్టాలపట్ల అవగాహన ఉండాలని తెలిపారు. నియమ నిబంధనలను పాటించడం ఇప్పటి నుండే అలవరుచుకోవాలని అయన తెలిపారు. చట్టాలను పాటించడంతోపాటు ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడం విద్యార్థుల కర్తవ్యమని సూచించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ చట్టాలు పాటించడంతోపాటు సమాజ శ్రేయస్సుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు.
by admin | Nov 24, 2018 | Awarness Programs
రవాణారంగం పటిష్ఠంగా ఉండాలంటే రోడ్డు రవాణా భద్రత ఎంతో ముఖ్యమని వెదుళ్లపల్లి యస్.ఐ. శ్రీ యమ్.మోహన్ వివరించారు. 2018 నవంబరు 24వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవాలలో యస్.ఐ. పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్గారు డా.ఎ.సుధామవంశీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చట్టాలపట్ల అవగాహన ఉండాలని తెలిపారు. క్రమశిక్షణలో నియమనిబంధనలను పాటించడం ఇప్పటి నుండే అ లవరచుకోవాలని ఆయన హితవు పలికారు. చట్టాన్ని గౌరవించడం ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు చేయూతనివ్వటం విద్యార్థుల కర్తవ్యమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ సమాజప్రగతి లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
by admin | Nov 13, 2018 | Health & Hygeine
13.11.2018 : జిల్లెళ్లమూడిలో నవంబరు 13 న వైద్య ఆరోగ్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్ధినులకు వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం యొక్క ప్రాధాన్యత. జ్వరములు, స్వైన్ ఫ్లూ లపై అవగాహన కార్యక్రమమునకు హాజరైన నరసాయపాలెం వైద్యాధికారి డాక్టర్ ఆర్.గాయత్రి, HEO పి. వెంకటరావు, డా॥ రామారావు (రాజమండ్రి) M.B.B.S, D.C.H పిల్లల వైద్య నిపుణులు H.S. పి. నాగేశ్వరరావు, A.N.M.D. ద్వారక, బి. లావణ్య గ్రామ ఆశాకార్యకర్త జి.శ్రీలక్ష్మీ (మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్ధిని) పాల్గొన్నారు. జి.శ్రీలక్ష్మి కళాశాలలో 14 వ తేది ఉదయం ప్రత్యేకించి విద్యార్థినులకు ఉచితంగా వ్యాధినిరోధక మందులను పంచారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డా॥ ఎ.సుధామ వంశీ మరియు పాఠశాల ప్రధానో పాధ్యాయులు కె.ప్రేమకుమార్ గారి పర్యవేక్షణలో జరిగింది.
by admin | Nov 13, 2018 | Health & Hygeine
నవంబరు 13 న జిల్లెళ్లమూడిలో వైద్య ఆరోగ్య శిబిరం ముగిసింది. పరిశుభ్రత, పోషకాహారం యొక్క ప్రాధాన్యత, జ్వరాలు, స్వైన్ ఫ్లూపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. వైద్యాధికారి డాక్టర్ ఆర్.గాయత్రి, పి. వెంకటరావు, డా. రామరావు రాజమండ్రి J N.B.B.S, BCH పిల్లల వైద్యనిపుణులు నాగేశ్వరరావు, ఎన్.ఎమ్.ద్వారక. గ్రామ కార్యకర్త బి.లాస్య, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండడంపై పలు సూచనలు చేశారు. విద్యార్థినులకు ఉచితంగా వ్యాధినిరోధక మందులను అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, ప్రేమకుమార్ పాల్గొన్నారు.
by admin | Nov 2, 2018 | Samskrutha Sibhiram
జాతీయస్థాయి పోటీకి విద్యార్థిని ఎంపిక
2.11.2018 : తిరుపతి రాష్ట్రీయ సంస్కృతి విద్యాపీఠంలో జరిగిన జాతీయ స్థాయి శాస్త్ర స్పర్ధలో జిల్లెళ్లమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల II పి.డి.సి (సంస్కృతం) విద్యార్థిని శ్యామాలిక ఎంపిక కావడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ డా॥ ఎ. సుధామ వంశీ అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు. అఖిల భారత శాస్త్ర స్పర్ధలో ఈనెల 2, 3 తారీకులలో తిరుపతిలో జరిగిన ఎంపిక పోటీలో శ్యామాలిక 2019 జనవరి 5 వ తేది నుండి త్రిపుర రాజధాని అగర్తలలో ప్రరంభమయ్యే ఈ పోటీలకు శ్యామాలిక ఎంపిక పట్ల సంస్థ పెద్దలు, కళాశాల కరస్పాండెంట్ శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారు హర్షం వ్యక్తం చేశారు. కావ్య కంఠపాఠం (కుమార సంభవము) పై ఈ పోటీ జరగనున్నట్లు తిరుపతి సంస్కృతి విద్యాపీఠం వారు స్పష్టం చేశారు.