by admin | Sep 15, 2018 | Local Functions
డా॥ జయంతి చక్రవర్తి ఆధ్వర్యంలో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, సంస్కృత పాఠశాల ఆధ్వర్యంలో గణేశ ఉత్సవాలు సెప్టెంబరు 13, 14, 15 తేదీలలో ఘనంగా జరిగాయి. మాతృశ్రీ సంస్థ ప్రాంగణంలోని టి.టి.డి. కళ్యాణమండపంలో 13వ తేదీ ఉదయం విశేష పూజలు ఘనంగా జరిగాయి. సంస్థ పెద్దలు శ్రీ యమ్. దినకర్, వసుంధరక్కయ్య, స్థానిక కార్యదర్శి శ్రీ భట్టిప్రోలు రామచంద్రగారు, డాక్టర్ బి.యల్. సుగుణగారు, అధ్యాపక ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థినీ, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శమంతకోపాఖ్యానం, విద్యార్థినుల భక్తిగీతాలు, సాయంత్రం పూజా కార్యక్రమం పద్యనివేదనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేడుకలలో భాగంగా పాఠశాల విద్యార్థినుల నృత్యప్రదర్శన కళాశాల విద్యార్థినుల నాటికలు ప్రదర్శంచబడ్డాయి. 14వ తేదీ పూజా కార్యక్రమం తరువాత విద్యార్థినులు పద్యపఠనం చేశారు. ఓంకారానందగిరిగారు వినాయక ప్రాశస్త్యం గురించి వివరించారు. మంగళగిరి నుండి వచ్చిన మధురిమ, అఖిల (5వ తరగతి) నృత్యప్రదర్శనలు అందరినీ అలరించాయి. అదేరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. నవ్వుల జల్లులు, పెళ్ళిగోల, కార్పోరేట్ వైద్యం, దశావతారం నృత్యం, ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ తదితర నాటికలను ప్రదర్శించారు. ఫైనల్ ఇయర్ విద్యార్థినులు స్నేహంతో రా స్కిట్న ప్రదర్శించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. విద్యార్థులు సినిమా సందడి స్కిట్ నవ్వులజల్లు కురిపించింది. 15వ తేదీ ఉదయం పూజాకార్యక్రమం నిర్వహించి భక్తిశ్రద్ధలతో గణేశ నిమజ్జనం నిర్వహించారు.
by admin | Sep 10, 2018 | Uncategorized
ఆత్మరక్షణ విధానాలను విద్యార్థినులు తెలుసుకోవాలని నాగజ్యోతి, విజయలక్ష్మి మహిళా పోలీసులు వివరించారు. మహిళలు ధైర్యంగా విపత్తులను ఎదుర్కోవాలని హితవు పలికారు. చట్టప్రకారం నిందితులను శిక్షించడంలో మహిళలు తమవంతు కర్తవ్యం నిర్వహించాలని తెలిపారు. పోలీసు యంత్రాంగం మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సోదాహరణంగా వివరించారు. ఆత్మరక్షణ పద్ధతులను ప్రయోగాత్మకంగా తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.యల్ సుగుణ, అధ్యాపకులు యల్. మృదుల, యమ్. కవిత తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
by admin | Sep 7, 2018 | Library
Planning Library Catalogue with Faculty …
by admin | Sep 5, 2018 | Teachers Day
సమాజాన్ని సంస్కారవంతముగా ధర్మపథంలో నడిపించగల ప్రతిభ ఒక్క గురువుకే ఉందని ఓంకారానందగిరిస్వామి తెలిపారు. 5-9-2018 బుధవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన గురుపూజా మహోత్సవంలో ఆయన ముఖ్యవక్తగా ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.సుధామవంశీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అహంకారం, ఆత్మవంచన లేక శిష్యులందరినీ సమదృష్టితో చూసేవాడే నిజమైన గురువనీ, తాను ఆచరిస్తూ ఆచరింపజేసేవాడే ఆదర్శగురువనీ తెలియజెప్పారు. తెలుగు ఉపన్యాసకులు డాక్టర్ కె.వి. కోటయ్యగారు మాట్లాడుతూ గురుప్రాశస్త్యాన్ని సవివరంగా తెలియజేశారు. కళాశాల పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు గురువులకు నమస్కరిస్తూ ప్రసంగాలు చేశారు. ఈ కార్యక్రమములో సంస్థపెద్దలు సిబ్బంది పాల్గొన్నారు.
by admin | Sep 5, 2018 | Human Values, Programs
సమాజాన్ని సంస్కారవంతంగా ధర్మపథంలో నడిపించగల ప్రతిభ ఒక్క గురువుకే ఉందని ఓంకారానంద గిరి స్వామి తెలిపారు.5/9/2018 బుధవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన గురు మహత్సవంలో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా॥ఎ. సుధామ వంశీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అహంకారం, ఆత్మవంచన లేక శిష్యులందరినీ సమదృష్టితో చూసేవాడే నిజమైన గురువని, తాను ఆచరిస్తూ, ఆచరింపజేసేవాడే ఆదర్శగురువనీ తెలియజెప్పారు. తెలుగు ఉపాధ్యాయులు డా.కె.వి. కోటయ్యగారు మాట్లాడుతూ గురు ప్రాశస్త్యాన్ని సవివరంగా తెలియజేశారు. కళాశాల, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు గురువులకు నమస్కరించి ఒక్కొక్కరుగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంస్థ పెద్దలు ఎస్. లక్ష్మణ రావు, ఎ, దినకర్ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండముది ప్రేమ్ కుమార్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.