ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలని, దాని ఆవశ్యకతను తెలుసుకోవాలని బొప్పూడి రామబ్రహ్మంగారు సూచించారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, ఉభయపరిషత్తుల అభ్యర్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. డిసెంబరులో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక పరిజ్ఞానం నానాటికీ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. సుదామ వంశీ పర్యవేక్షణలో జరిగిన ఈ సభలో బి.రామబ్రహ్మంగారికి అభినందనలు తెలిపారు.