+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

మానవ జీవితం సుసంపన్నం కావడానికి ఉపగ్రహ ప్రయోగాలు ఎంతగానో తోడ్పడతాయని ఇస్రో ప్రాజెక్ట్ డైరక్టర్ శ్రీ రాఘవమూర్తిగారు వివరించారు. జులై 16వ తేదీన కళాశాల ప్రార్థనా మందిరంలో ఆయన మాట్లాడుతూ మన దేశం, ఏదేశానికీ తీసిపోనిదన్నారు. అంతరిక్ష ప్రయోగాలలో భారతదేశం తన ప్రత్యేకతను నిలుపుకున్నట్లు ఆయన తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.యల్.సుగుణగారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఉపగ్రహ ప్రయోగాల తీరు తెన్నులను సోదాహరణంగా ప్రదర్శించారు. అలాగే రాఘవమూర్తిగారు శిక్షణ ఇచ్చిన చివరి సంవత్సరం విద్యార్థినులు  మనిషా, నాగలక్ష్మి పవర్ పాయింట్ ప్రజంటేషన్ను విజయవంతంగా నిర్వహించడం పట్ల ప్రిన్సిపాల్ డా॥ బి.యల్ సుగుణ గారు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. సాంప్రదాయాలతోపాటు శాస్త్రీయ, సాంకేతిక రంగాలకు కూడా సముచిత ప్రాతినిధ్యం లభించడం. అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతరిక్ష రంగంలో భారత దేశానికి సముచిత స్థానం దక్కినట్లు చెప్పారు. వేదికపై తాను శిక్షణ యిచ్చిన విద్యార్థినులు స్టేజీపై సమర్థవంతంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. వారికి నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో రవీంద్రగారు, సంస్థ పెద్దలుచేస్తూ నగదు బహుమతితో ఫోన్ కమ్మా రవింద్ర రావు గారు, సంస్థపెద్దలు ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు