+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

కళాశాలలో 29.8.2018న తెలుగు భాషా దినోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా నంబూరు జడ్.పి. హైస్కూల్ ఉపాధ్యాయులు, మన కళాశాల పూర్వవిద్యార్థి శ్రీ శేషాద్రి మాట్లాడుతూ ప్రపంచంలో అజంత భాషలెన్ని ఉన్నా తెలుగుకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్నదని తెలిపారు. ఏ భాషలోని పదాలనైనా తెలుగులోకి చాలా సులభంగా స్వీకరించవచ్చని ఉదాహరణ పూర్వకంగా తెలియజెప్పారు. | తెలుగు భాషకే సొంతమైన అవధానప్రక్రియ గొప్పదనాన్ని వివరించారు. తెలుగు వ్యవహార భాషోద్యమకారులైన గిడుగువారి కృషిని శ్లాఘిస్తూ తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ మధుసూదనరావుగారు, కె.వి. కోటయ్య గారు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుగుణగారు మాట్లాడారు. ఈ కార్యక్రమములో భాగంగా శోభన, అనూష అల్లసాని పెద్దనగారు రచించిన ఉత్పలమాలికను ఆశువుగా చెప్పారు. నంబూరు జడ్.పి. హైస్కూల్ విద్యార్థులైన షేక్నిగా, షేక్ సాహెబ్ పోతన నృసింహావతార ఘట్టము లోని గద్యమును అనర్గళముగా పఠించారు.